ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ సక్సెస్ అందుకొని యమ జోష్లో ఉన్న రామ్ పోతినేని తాజాగా 'RED' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. మరోసారి మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ డిఫరెంట్ గెటప్లో రంగంలోకి దిగుతున్నాడు ఎనర్జిటిక్ స్టార్. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన రెడ్ మూవీ ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ శాటిలైట్ హక్కులను భారీ ధరకు ప్రముఖ టీవీ ఛానెల్ యాజమాన్యం దక్కించుకుందని తెలిసింది.
థియేటర్స్ ఓపెన్ చేయని కారణంగా ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలు ఈ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చాయి. కానీ RED సినిమాను ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చేయాలని భావించిన చిత్రయూనిట్ ఆయా ఆఫర్స్ తిరస్కరించాయని విన్నాం. అయితే రీసెంట్గా ఈ చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటించడంతో రామ్ అభిమానులు హుషారెత్తిపోయారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో క్రేజ్ దృష్ట్యా ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు ఓ సమాచారం బయటకొచ్చింది. 13.5 కోట్లు ఆఫర్ చేసి ఆ హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: రాఘవేంద్రుడి పెళ్లి సందడి అఫీషియల్ అనౌన్స్మెంట్.. హీరో కన్ఫర్మ్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ స్రవంతీ మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. చిత్రంలో రామ్ సరసన నివేథా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్లు హీరోయిన్లుగా నటించగా.. హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ చేసింది. రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మణిశర్మ బాణీలు కట్టారు. ఇప్పటివరకు విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీ విడుదల కోసం రామ్ అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
థియేటర్స్ ఓపెన్ చేయని కారణంగా ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలు ఈ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చాయి. కానీ RED సినిమాను ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చేయాలని భావించిన చిత్రయూనిట్ ఆయా ఆఫర్స్ తిరస్కరించాయని విన్నాం. అయితే రీసెంట్గా ఈ చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటించడంతో రామ్ అభిమానులు హుషారెత్తిపోయారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో క్రేజ్ దృష్ట్యా ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు ఓ సమాచారం బయటకొచ్చింది. 13.5 కోట్లు ఆఫర్ చేసి ఆ హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: రాఘవేంద్రుడి పెళ్లి సందడి అఫీషియల్ అనౌన్స్మెంట్.. హీరో కన్ఫర్మ్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ స్రవంతీ మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. చిత్రంలో రామ్ సరసన నివేథా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్లు హీరోయిన్లుగా నటించగా.. హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ చేసింది. రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మణిశర్మ బాణీలు కట్టారు. ఇప్పటివరకు విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీ విడుదల కోసం రామ్ అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.