యాప్నగరం

Harish Shankar: హరీష్ శంకర్ హృతిక్ రోషన్‌ను కలిసింది ఇందుకే.. బయటపడ్డ నిజాలు!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ చేయబోతున్నాడు. తాజాగా ఆయన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌ను కలవడం చర్చనీయాంశం కాగా.. ఎందుకు కలిశారో ఇప్పుడు బయటపడింది.

Authored bySanthosh Damera | Samayam Telugu 7 Feb 2023, 4:47 pm

ప్రధానాంశాలు:

  • గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌ను కలిసిన హరీష్ శంకర్
  • మైత్రీ సంస్థ ప్రొడ్యూసర్ నవీన్‌తో కలిసి వెళ్లిన డైరెక్టర్
  • మీటింగ్ వెనకున్న కారణాలపై నెట్టింట మొదలైన చర్చ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Harish Shankar, Hritik Roshan
Hariహsh Shankar: హరీష్ శంకర్, హృతిక్
తెలుగులో కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి హరీష్ శంకర్‌ (Harish Shankar). తీసినవి కొద్ది సినిమాలే అయినా అందులో ‘మిరపకాయ్, గబ్బర్ సింగ్, డీజే, గద్దలకొండ గణేష్’ వంటి బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) వీరాభిమాని అయిన హరీష్ శంకర్.. తనతో నెక్స్ట్ సినిమా కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తు్న్నాడు. కానీ పవన్ పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కట్లేదు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) లాంఛనంగా ప్రారంభమైనా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. అయితే ఈ గ్యాప్‌లో కథపై వర్కవుట్ చేస్తున్న హరీష్.. రీసెంట్‌గా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన నవీన్‌ ఎర్నేనితో కలిసి బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌‌ను (Hritik Roshan) కలవడం హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఈ మీటింగ్ వెనకున్న కారణాలపై చర్చ మొదలుపెట్టిన నెటిజన్లు ఈ కాంబినేషన్‌లో ఏదైనా ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారా? అని ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే మైత్రీ మూవీస్.. ప్రభాస్, హృతిక్‌తో కలిసి పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హృతిక్‌.. సిద్ధార్థ్‌తో ‘ఫైటర్’ సినిమా చేస్తు్న్నాడు. ఈ నేపథ్యంలోనే నవీన్ ఎర్నేని, హరీష్ శంకర్ ఆదివారం హృతిక్ రోషన్‌ను యాడ్ షూట్ సెట్‌లో కలిసిన ఫొటో నెట్టింట వైరల్ అయింది.

ఈ మీట్ వెనకున్న వాస్తవమేంటో తాజాగా బయటికొచ్చింది. హరీష్ శంకర్‌ తెరకెక్కించిన గద్దల కొండ గణేష్ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన అయనంకా బోస్.. ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో షూటింగ్ చేస్తున్నాడు. ఆయనే దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత నవీన్‌ను సదరు షూటింగ్ సెట్స్‌కు ఆహ్వానించాడు. ఆ ఇంటరాక్షన్ సమయంలోనే ఈ చిత్రం క్లిక్ చేయబడింది. కాబట్టి ఇది సాధారణ సమావేశమే తప్ప మరొకటి కాదని తేలిపోయింది.

నిజానికి మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్‌తో ఓ సినిమా చేసేందుకు గతంలో ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలకే పరిమితం కావడంతో కుదర్లేదు. ఇప్పుడు మైత్రీ సంస్థ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందిస్తున్నందున సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ సెట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో హృతిక్ గెస్ట్ రోల్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ చిత్రానికి ప్రభాస్, సిద్ధార్థ్ చోరో రూ. 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటన్నట్లుగా ఇండస్ట్రీలో రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి.


రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.