యాప్నగరం

దేవుడా.. యాంకర్ రష్మి వంద ఎకరాల భూమి కొన్నారా?

యాంకర్ రష్మి ఏకంగా వంద ఎకరాల భూమి కొన్నారట. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా వార్తలు వస్తున్నాయి.

Samayam Telugu 19 Feb 2020, 3:19 pm
‘జబర్దస్త్’, ‘ఢీ’ షోలతో యాంకర్ రష్మి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. మధ్యలో సినిమాలు కూడా చేస్తున్నారు. సాధారణంగా సినిమాకు సంబంధించిన వారు తాము సంపాదించుకున్న డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టాలని చూస్తుంటారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అపార్ట్‌మెంట్స్ కొనుక్కున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హోటల్ బిజినెస్ మొదలుపెట్టారు. మరో పక్క హీరోయిన్లలో రకుల్ జిమ్ సెంటర్స్ నడుపుతున్నారు. అదే విధంగా రష్మి భూములు కొన్నారట. ఒడిశాలో దాదాపు వంద ఎకరాల భూములు కొన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
Samayam Telugu rashmi gautam
రష్మి గౌతమ్


ఆంధ్రా- ఒడిశా బోర్డర్ దగ్గర ఉన్న బెర్హాపూర్ ప్రాంతంలో రష్మి పుట్టారు. ఆమె చదువంతా వైజాగ్‌లో జరిగింది. అందుకే రష్మికి తెలుగు భాషలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. అయితే ఆమె కొన్న వంద ఎకారల భూమిలో కోకో, యూకలిప్టస్ పంటలను వేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలపై ఎలాంటి రూమర్స్ వచ్చినా రష్మి వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తారు. మరి ఈ వంద ఎకరాల భూమి కొన్నట్లు వస్తున్న వార్తలపై రష్మి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

READ ALSO: Bheeshma: ప్రమోషన్స్‌కి రానంటున్న హీరోయిన్?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.