యాప్నగరం

‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటోన్న సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దీని తరవాత కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించనున్న సినిమాలో నటిస్తారు.

Samayam Telugu 23 Sep 2019, 3:48 pm
‘చిత్రలహరి’తో ఫామ్‌లోకి వచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు వేగం పెంచారు. వరుసపెట్టి సినిమాలను అంగీకరిస్తు్న్నారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే, సుబ్బు అనే కొత్త దర్శకుడితో పనిచేయడానికి సాయి ధరమ్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభంకావాల్సి ఉంది.
Samayam Telugu SaiDharamTej
సాయి ధరమ్ తేజ్


ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం పరిశ్రమలో చక్కెర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ను పరిశీలిస్తున్నారట. ఈ భామ ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’లో నటించింది. ఆమెతో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది.

Also Read: గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఆల్మోస్ట్ సేఫ్

కాగా, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతోన్న సుబ్బు.. దీన్ని ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కొత్త అవతారంలో కనిపించనున్నారట. ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాలు తేజూ చేతిలో ఉన్నాయి. దర్శకులు దేవాకట్ట, మేర్లపాక గాంధీలతో సాయి ధరమ్ జతకట్టనున్నారు. వీటిని సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.