యాప్నగరం

రమ్యకృష్ణ విలనిజం.. మెగా మేనల్లుడు‌ తట్టుకోగలడా?

సాయిధరమ్ తేజ్- దేవా కట్టా కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్రలో నెగిటివ్ ఛాయలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

Samayam Telugu 28 Oct 2020, 10:53 am
ఒకప్పుడు అగ్ర హీరలందరి సరసన ఆడిపాటి గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలిలో శివగామ పాత్రలో కనబరిచిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అమ్మ, అత్త పాత్రల్లో కనిపిస్తున్న రమ్యకృష్ణ ఈ సారి నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. మెగా హీరో సాయిధరమ్ తేజ్, దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కబోయే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu రమ్యకృష్ణ, సాయిధరమ్ తేజ్


Also Read: ఈ గయ్యాళి అత్తకు బలైన కోడళ్లెందరో.. అగ్రహీరోలనే ఆటాడుకున్న సూర్యకాంతం

ఈ చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా రమ్యకృష్ణ పోషించే పాత్రపై సోషల్‌మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. దేవాకట్ట గతంలో దర్శకత్వం వహించిన ‘ప్రస్థానం’ సినిమాలో సాయికుమార్ పాత్ర ఎంత హైలెట్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కూడా అంతకుమించి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: 25 మిలియన్ వ్యూస్... రికార్డు క్రియేట్ చేసిన ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్

‘నరసింహ’ సినిమాలో నీలాంబరిగా నెగిటివ్ రోల్‌లో కనిపించిన రమ్యకృష్ణ రజినీకాంత్‌‌‌తో పోటీపడి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ఆమె మరోసారి నెగిటివ్ రోల్‌‌లో కనిపిస్తుండటంతో మెగా మేనల్లుడు ఆమె ముందు నిలబడగలడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో తేజ్ సరసన నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరు గతంలో ‘చిత్రలహరి’లో కలిసి నటించారు.

Also Read: చారిత్రక వీరుడి పాత్రలో బాలకృష్ణ.. బన్నీని మరిపిస్తారా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.