యాప్నగరం

ప్రియుడి బర్త్‌డే పార్టీకి నయన్‌ అంత ఖర్చు చేసిందా?

హీరోయిన్ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకలకు రూ.25లక్షలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Samayam Telugu 26 Sep 2020, 2:50 pm
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల తన 35వ బర్త్‌డే వేడుకలను ప్రియురాలు నయనతారతో కలిసి గోవాలో జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తన ప్రియుడు పుట్టినరోజు వేడుకలను నయనతార దగ్గరుండి జరిపించడమే కాకుండా ఖర్చంతా తానే భరించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu Nayanthara Vignesh Shivan


Also Read: గతేడాది నల్లబాలు.. ఇప్పుడు ఎస్పీ బాలు.. టాలీవుడ్‌కు అచ్చిరాని సెప్టెంబర్ 25

గోవాలో వీరిద్దరు మూడు రోజులు ఎంజాయ్ చేయగా.. అందుకోసం నయన్ ఏకంగా రూ.25లక్షలు ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త కోలీవుడ్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. విఘ్నష్ శివన్ దర్శకత్వం వహించిన నానుమ్‌ రౌడీదాన్( తెలుగులో నేను రౌడీ నే) సినిమాలో నయనతార నటించారు. ఆ చిత్ర షూటింగ్‌లో ఇద్దరి పరిచయం ముదిరి ప్రేమగా మారింది.

Also Read: బాలు నా ఆరో ప్రాణం.. దేవుడు అన్యాయం చేశాడంటూ కంటతడి పెట్టుకున్న కె. విశ్వనాథ్

ఇప్పటి నుంచీ వీరిద్దరు రిలేషన్‌ కొనసాగిస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తమకు కొన్ని కలలు ఉన్నాయని, వాటిని నెరవేర్చుకునే వరకు పెళ్లి చేసుకోమని విఘ్నేష్ ఇటీవల ఓ ఇంట్వర్యూలో చెప్పారు. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో కాదువాకుల రెండు కాదల్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నయనతార, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read: అమితాబ్ కోలుకున్నారు.. బాలు విషయంలో జరిగిన తప్పేంటి?.. ఆ సర్జరీనే కారణమా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.