యాప్నగరం

సునీల్-సలోనీ మళ్లీ జంటగా... ‘మర్యాద రామన్న’ కాంబో రిపీట్!

‘మర్యాద రామన్న’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సునీల్, సలోనీ జోడీ మరోసారి జతకట్టనున్నట్లు సమాచారం. వీఎన్ ఆదిత్య సినిమాలో వీరు జంటగా కనిపించనున్నారట.

Samayam Telugu 28 Nov 2020, 2:01 pm
Samayam Telugu సునీల్, సలోనీ
కమెడియన్‌గా రాణిస్తున్న సమయంలోనే హీరోగా టర్న్ తీసుకున్నాడు సునీల్. తొలి సినిమా ‘అందాల రాముడి’తోనే అలరించిన ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత హీరోగా నటించిన సినిమాలన్నీ ప్లాఫ్ కావడంతో సునీల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు విలన్‌గా మారిన సునీల్ ఇటీవలే ‘కలర్ ఫోటో’తో ఆకట్టుకున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లో కూడా సునీల్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

Also Read: వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరో తెలిస్తే షాకవుతారు...

అసలు విషయానికొస్తే... ‘మర్యాద రామన్న’లో ప్రేక్షకులను అలరించిన సునీల్, సలోనీ జంట మరోసారి కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. సునీల్ ప్రస్తుతం వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా సలోనీని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ వార్తే గనుక నిజమైతే సునీల్, సలోని కలిసి పదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కలిసి సందడి చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సైలెంట్‌గా జరుగుతోందట.

Also Read: అనిల్ రావిపూడి మార్క్‌తో 'గాలి సంపత్'.. అరకులో శ్రీ విష్ణుతో కలిసి రాజేంద్ర ‌ప్ర‌సాద్ సందడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.