యాప్నగరం

Pawan Kalyan: జెట్ స్పీడ్‌లో పవన్ కళ్యాణ్ OG షూటింగ్.. అసలు రీజన్ ఇదే!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. అంతకుముందే మొదలైన సినిమా షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి మరీ ఈ గ్యాంగ్‌స్టర్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేశాడు పవన్. అయితే దీని వెనకున్న అసలు కారణమేంటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Authored byసంతోష్ దామెర | Samayam Telugu 25 May 2023, 7:45 pm

ప్రధానాంశాలు:

  • OG మూవీపైనే పవన్ ఫుల్ కాన్సంట్రేషన్
  • త్వరలోనే నాల్గో షెడ్యూల్‌ ప్రారంభం
  • స్పీడప్‌ వెనకున్న కారణంపై రూమర్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pawan Kalyan
Pawan Kalyan: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) నటిస్తున్న నాలుగు సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. వీటిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ఒకటి. అలాగే హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh), సముద్రఖని ‘బ్రో’, సుజిత్ (Sujith) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘OG’ సినిమాలు ఉన్నాయి. అయితే ఇందులో క్రిష్, హరీష్ సినిమాల షూటింగ్‌ విషయంలో జాప్యం జరుగుతోంది. ఎందుకంటే పవన్ ప్రస్తుతం OG షూటింగ్‌కే ఎక్కువ డేట్స్ కేటాయిస్తున్నాడు. అయితే, చివరగా మొదలుపెట్టిన సినిమాకు పవన్ ఎందుకంత ప్రియారిటీ ఇస్తున్నారన్న సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అందుకు గల కారణాలేంటో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
OG మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అంతేకాదు పవన్ లేకుండానే మూడో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. త్వరలోనే ప్రారంభమయ్యే నాల్గో షెడ్యూల్‌లో ఆయన జాయిన్ అవుతారని సమాచారం.
అయితే ఈ జెట్ స్పీడ్‌కు నిర్మాత డివీవీ దానయ్య (DVV Danayya) కారణమని తెలుస్తోంది. కీలక సమయంలో ఆయన పవన్ కళ్యాణ్‌కు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశాడట. కాబట్టి ప్రాజెక్ట్ ఆలస్యమైతే లోన్లు, EMIలు తడిసి మోపెడయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే OG మూవీని ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలని పవన్ భావిస్తున్నాడట.

ఇదిలా ఉంటే, ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఆయనతో పాటు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ సైతం పవన్‌కు భారీగా అడ్వాన్స్‌లు ఇచ్చారనేది ఇండస్ట్రీలో టాక్. నిజానికి ‘వీరమల్లు’ చిత్రం ఈపాటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ నిర్మాత ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యమైనట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్‌లో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌గా కొనసాగుతోంది. ఏక కాలంలో నాలుగైదు సినిమాలను నిర్మిస్తూ బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేస్తోంది. కాబట్టి వీరికి పెద్దగా సమస్య ఎదురయ్యే అవకాశం లేదు.

ఇక పవన్ నటిస్తున్న నాలుగు చిత్రాల్లో ముందుగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి చేసిన ‘బ్రో’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ జులై 28న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత OG లేదా ‘హరి హర వీరమల్లు’ ఏది ముందుగా రిలీజ్ అవుతుందో తెలియాల్సి ఉంది. అయితే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ ఈ మధ్యే మొదలైనందున ఆలస్యం కావచ్చు.



రచయిత గురించి
సంతోష్ దామెర
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమా, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.