యాప్నగరం

పవన్ కళ్యాణ్ కోసం ఆ ముగ్గురి మధ్య గట్టి పోటీ.. ఇదీ సంగతి!

రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఆయన 29వ మూవీ కోసం ఏకంగా ముగ్గురు డైరెక్టర్ల మధ్య పోటీ నెలకొందని సమాచారం.

Samayam Telugu 18 Aug 2020, 12:39 pm
అజ్ఞాతవాసి మూవీ తర్వాత జనసేనానిగా జనంలోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. ఆయన మళ్ళీ రాజకీయాలతో బిజీ అయితే కష్టం అని భావిస్తున్న డైరెక్టర్లు పవన్ కోసం సరికొత్త కథలను సిద్ధం చేస్తున్నారు. దీంతో పవన్ రూపంలో డైరెక్టర్ల మధ్య పోటీ వాతావరణం నెలకొనడం ఆసక్తికర పరిణామంగా మారింది.
Samayam Telugu పవన్ కళ్యాణ్ కోసం ఆ ముగ్గురి మధ్య గట్టి పోటీ.. ఇదీ సంగతి!
Pawan Kalyan 29


ఇప్పటికే వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన పవన్ కళ్యాణ్ మరికొన్ని కొత్త సినిమాలకు సైన్ చేసేందుకు రెడీ అయ్యారని టాక్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' మూవీ చేస్తున్న పవన్.. నవంబర్ నుంచి డైరెక్టర్ క్రిష్ సినిమాను ప్రారంభించబోతున్నారు. అది ఫినిష్ కాగానే తన 28వ సినిమాగా డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఈ క్రమంలోనే పవన్ 29వ మూవీ కోసం, ఆయన డేట్స్ కోసం ఏకంగా ముగ్గురు డైరెక్టర్లు పోటీపడుతున్నారని తెలుస్తోంది.

Also Read: జగన్.. ఈ సొసైటీలో ఆడదాని బతుకేంటో చెబుతావ్! కానీ ఇప్పటికీ.. మాధవీలత షాకింగ్ కామెంట్స్

పవన్ 29వ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించడం కోసం డైరెక్టర్ బాబీ, సురేందర్ రెడ్డి, గోపీచంద్ మలినేని పోటీ పడుతున్నారట. ఈ మేరకు పవన్‌కి కథ వినిపించి డేట్స్ పట్టేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కాగా ఈ ముగ్గురిలో ఎవరు మంచి కథ తీసుకువస్తే వారికే అవకాశమిస్తామని నిర్మాత రామ్ తాళ్లూరి కూడా భావిస్తున్నారని టాక్. సో.. చూడాలి మరి పవన్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడో!.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.