సినిమాల్లో అవకాశాలు రాక తమిళ హీరోయిన్ శృతి మాయలేడి అవతారం ఎత్తింది. ఫేస్బుక్ ద్వారా తన అందమైన ఫొటోలను ఎరగా పెట్టి పలువురి దగ్గర ఏకంగా 1.50 కోట్లు కాజేసింది. " ఆడి పోనాల్ ఆవణి " అనే చిత్రంలో హీరోయిన్గా నటించినప్పటికీ ఆ చిత్రం ఇంకా విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ శృతి తన తల్లి సహకారంతో డబ్బున్న యువకులకు ఎరవేసింది. ఇలా ఏకంగా 8 మంది యువకులను ప్రేమ పేరుతో మోసం చేసింది. శృతి మోజులో పడి లక్షలు పోగొట్టుకున్న ఒక యువకుడు ధైర్యంగా పోలీసుల ముందుకు రావడంలో విషయం బయటకు పొక్కింది. మ్యారేజ్ పోర్టల్స్ లో వధువు కావాలని తాను ఇచ్చిన ప్రకటన చూసి శృతి తనకు ఫోన్ చేసిందని పరిచయం స్నేహంగా మారిన తర్వాత తనే పెళ్లి ప్రపోజ్ చేసిందని చెప్పారు. ఇక ఆతర్వాత ఇంటిఖర్చులు, హాస్పిటల్ ఖర్చుల పేరుతో లక్షల్లో డబ్బు గుంజిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
విదేశాల్లో స్థిరపడ్డ వారిని కూడా శృతి వదల లేదు. శృతి అందాల మోజులో పడి మోసపోయిన వారిలో అమెరికాలో ఉంటున్న ఓ ఇంజనీయర్ కూడా ఉన్నాడు. పెళ్లి ఆశ చూపి ఏకంగా 15 లక్షల రూపాయలు శృతి తీసుకుంది. విదేశాల్లో స్థిరపడ్డ సేలం జిల్లా ఎడపాడికి చెందిన బాలకృష్ణన్ (29)ను ప్రేమ పేరుతో మచ్చిక చేసుకుంది. ఆతర్వాత తన తల్లి చిత్రకు ఆపరేషన్ అని చెప్పి 5 లక్షలు కాజేసింది. ఇక ఆతర్వాత ఇంటిపై ఉన్న అప్పు తీర్చేందుకంటూ 45 లక్షలు తీసుకుంది. ఇదే విధంగా చిదంబరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరుళ్కుమార్ గురురాజా నుంచి రూ.50లక్షలు, నామక్కల్ జిల్లా పరమత్తివేలూరుకు చెందిన సంతోష్కుమార్ అనే సాప్ట్వేర్ ఇంజినీరు నుంచి రూ.43 లక్షలు దండుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో తమిళనాడు సైబర్ క్రైం అధికారులు శృతితో పాటు ఆమెకు సహకరించిన తల్లి చిత్ర (48), సోదరుడు సుభాష్ (18), బంధువు వెంకటేష్ (38), స్నేహితుడు శబరినాథ్ (23)లను అరెస్ట్ చేశారు.
విదేశాల్లో స్థిరపడ్డ వారిని కూడా శృతి వదల లేదు. శృతి అందాల మోజులో పడి మోసపోయిన వారిలో అమెరికాలో ఉంటున్న ఓ ఇంజనీయర్ కూడా ఉన్నాడు. పెళ్లి ఆశ చూపి ఏకంగా 15 లక్షల రూపాయలు శృతి తీసుకుంది. విదేశాల్లో స్థిరపడ్డ సేలం జిల్లా ఎడపాడికి చెందిన బాలకృష్ణన్ (29)ను ప్రేమ పేరుతో మచ్చిక చేసుకుంది. ఆతర్వాత తన తల్లి చిత్రకు ఆపరేషన్ అని చెప్పి 5 లక్షలు కాజేసింది. ఇక ఆతర్వాత ఇంటిపై ఉన్న అప్పు తీర్చేందుకంటూ 45 లక్షలు తీసుకుంది. ఇదే విధంగా చిదంబరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరుళ్కుమార్ గురురాజా నుంచి రూ.50లక్షలు, నామక్కల్ జిల్లా పరమత్తివేలూరుకు చెందిన సంతోష్కుమార్ అనే సాప్ట్వేర్ ఇంజినీరు నుంచి రూ.43 లక్షలు దండుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో తమిళనాడు సైబర్ క్రైం అధికారులు శృతితో పాటు ఆమెకు సహకరించిన తల్లి చిత్ర (48), సోదరుడు సుభాష్ (18), బంధువు వెంకటేష్ (38), స్నేహితుడు శబరినాథ్ (23)లను అరెస్ట్ చేశారు.