‘వీరసింహారెడ్డి’ మూవీ రివ్యూ
నందమూరి బాలకృష్ణ,శృతిహాసన్,హనీ రోజ్,దునియా విజయ్,వరలక్ష్మీ శరత్కుమార్,లాల్
మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాలయ్య మాస్టర్ డిగ్రీ అనేట్టుగానే ఉంటుంది ఆయన నటనా విధ్వంసం. ఎవరికైనా కత్తి పడితే అలుపొస్తుంది.. ఈయనకి మాత్రం నరికే కొద్దీ ఊపొస్తుంది. బాబు నరుకుడు స్టార్ట్ చేస్తే బ్రేకుల్లేని బండే. ‘వీరసింహారెడ్డి’లోనూ అదే ఉతుకుడు.. అదే నరుకుడు. రక్తపాతం ఏరులైపారింది.
మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిరియానీ రుచి చూపించారు. ముఖ్యంగా అభిమానులకు. గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో.. తన అభిమాన హీరోని.. ప్రేక్షకులకు ఎలా చూపిస్తే నచ్చుతుందో అలా చూపించాడు స్క్రీన్పై. తాను ఫ్యాక్షనిజం బాట పట్టి తన చుట్టూ ఉన్న వాళ్లని దారి మళ్లించి మార్పుకి శ్రీకారం చుట్టడం బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల ఫార్ములా. ఇంచుమించు ‘వీరసింహారెడ్డి’ కూడా అలాంటి కథే.
అయితే ఈ కథలో వైరం ప్రత్యర్ధితో కాదు. సొంత చెల్లెలితో. వీరసింహారెడ్డి ‘పులిచర్ల’కి దేవుడు. అదే ఊరులో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడ్ని వీరసింహారెడ్డి మట్టుపెట్టడంతో.. గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డిని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి.. వీరసింహారెడ్డి (బాలయ్య) చెల్లెలు భానుమతి (వరలక్ష్మీ శరత్ కుమార్)తో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జయ్-జయ సింహారెడ్డి (చిన్న బాలకృష్ణ). ఇతను తన తల్లి మీనాక్షి (హనీ రోజ్)తో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటారు. జయ్ని తన తండ్రి ఎవరో తెలియకుండా.. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జయ్ అనూహ్య పరిస్థితుల్లో శృతిహాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జయ్.. తిరిగి పులిచర్లకు వెళ్లడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీర సింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి.. భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి-మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి? తన తండ్రి చావుకి కారణమైన శత్రువుల్ని జయ సింహారెడ్డి ఎలా అంతమొందించాడు అన్నదే మిగిలిన కథ.
ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనకం అనేట్టుగానే విజృభిస్తారు.. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ల కోసం అందించిన ఊర మాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్టాఫ్లో జై పాత్ర పరిచయం.. ఈషా (శ్రుతిహాసన్)తో ప్రేమాయణం.. వాళ్ల పెళ్లికి దారి తీసిన పరిస్థితులు.. పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోతుంది. అయితే ఎప్పుడైతే జై.. తన తండ్రి వీరశివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో... అక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. వీరసింహారెడ్డి ఎంట్రీ తరువాత కథ వేగం పుంజుకుని అసలు కథలోకి వెళ్తుంది. ఆకలితో ఉన్న సింహాన్ని కొన్నాళ్లు బోనులో బంధించి.. ఒక్కసారిగా వేటకి వదిలితే ఎలా ఉంటుందో.. ‘వీరసింహారెడ్డి’ విశ్వరూపం అలా ఉంది. ఫ్యాన్స్తో ఈలలు కొట్టించే ఎలివేషన్ సన్నివేశాలు అడుగడుగునా ఉంటాయి. హీరోయిజం ఎలివేషన్ సీన్లలో బాలయ్య వీరంగం చేశాడు.
అయితే ఎంత మాస్ బిర్యానీ అయినా సరే.. చూసిన కథనే మళ్లీ మళ్లీ చూడాలంటే ఎవరికైనా బోరింగ్ అనిపిస్తుంది. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్యని వీరలెవల్లో చూపించాలనే ప్రయత్నంలో కథని గాడి తప్పించాడు దర్శకుడు. కేవలం ఫైట్లు.. యాక్షన్.. ఎలివేషన్స్పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు దర్శకుడు గోపీచంద్. ఫ్యాక్షన్ నేపథ్యంలో సిస్టర్ సెంటిమెంట్ని సరిగా ఎలివేట్ చేయలేకపోయారు. బాలయ్యని ఒకప్పటి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు గెటప్లో చూపించినా.. ఆ సినిమాల స్థాయి కథని అయితే అందించలేకపోయాడు గోపీచంద్. బాలయ్యకి కత్తి ఇచ్చి నరికిస్తే ప్రేక్షకులే చూసుకుంటారని అనుకున్నారో ఏమో కానీ.. అవసరం ఉన్న లేకపోయినా ఫైట్లు పెట్టి.. రక్తపాతం సృష్టించారు.
ప్రతినాయకుడు ఎన్ని వేట్లు వేసినా అడ్డదిడ్డంగా నరుక్కుంటూ పోయినా.. లెక్కచెప్పాల్సిన పని ఉండదు. ఎందుకంటే అతను విలన్ కాబట్టి.. కానీ కథలో నాయకుడు అనేవాడు వేసే ప్రతి వేటుకి ప్రేక్షకుడికి లెక్క చెప్పాల్సిందే. కానీ ‘వీరసింహారెడ్డి’లో లెక్కచెప్పలేనన్ని వేట్లు పడ్డాయి. ‘బాధ్యతగా చంపుతా.. మళ్లీ పుట్టడానికి మళ్లీ భయపడేట్టు చంపుతా’.. అంటూ బాలయ్య ఊచకోత కోస్తూనే ఉన్నాడు. అవసరం లేని చోట కూడా ఫైట్లు పెట్టి రక్తపాతం సృష్టించారు. కుర్చీలో కూర్చుని తాపీగా చుట్టకాలుస్తూ.. తలకాయల్ని తెగ తరిగేశాడు బాలయ్య. ఎలివేషన్లు అయితే మామూలుగా ఉండవు. గోపీచంద్ బాలయ్య అభిమాని కావడంతో.. ఎలాగైనా చూస్తారు అనుకున్నారో ఏమో కానీ.. తొడ కొట్టించే సీన్లు.. గాల్లో గిరగిరా ఎగిరేసీన్లు.. కత్తి విసిరితే తల తెగిపడి.. మళ్లీ కత్తి బాలయ్య చేతిలోకి వచ్చి చేరటాలు.. అబ్బో మామూలు మాస్ ఎలిమెంట్స్ కాదు.
ఎంత పంచ్ డైలాగ్ అయినా కథని.. కథాంశాన్ని డిమాండ్ చేస్తేనే ఆ డైలాగ్ పండుతుంది. ఈ సినిమాలో బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్లు బాలయ్య నోట బుల్లెట్స్లా దూసుకుని వచ్చాయి. అయితే కొన్ని డైలాగ్లు మాత్రం కథతో సంబంధం లేకుండా బాలయ్య పొలిటికల్ అజెండాని దృష్టిలో పెట్టుకుని రాసినట్టే అనిపిస్తాయి. ఓ మినిస్టర్ని ఉద్దేశించి చెప్పే సందర్భంలో.. ‘వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు.. గౌరవించడం మన బాధ్యత’ అని డైలాగ్ కొడతాడు బాలయ్య. ఇలా ప్రభుత్వాన్ని గిల్లే డైలాగ్లు సినిమాలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి చెప్పిన డైలాగ్. ‘‘ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి.. ప్రజల్ని వేధించడం కాదు., జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమేయడం కాదు., పని చేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు., నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు., పరిశ్రమలను తీసుకుని రావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలను మూయడం కాదు. బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో.. వాడు దోచుకోవడానికి వచ్చాడు.. నాట్ అలౌడ్..’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ అధికార పార్టీ కెలికినట్టే ఉంటుంది.
‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు. బలం చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువా..’ లాంటి డైలాగ్లు కూడా అధికార పార్టీపై ఎక్కుపెట్టిన బాణాల్లాగే అనిపిస్తుంది.
ఇక వీరసింహారెడ్డిలో లీడ్ రోల్స్ ఎంపిక కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. బాలయ్య సరసన శ్రుతిహాసన్ సెట్ కాలేదు. మరీ చిన్నగా అనిపిస్తుంది. అనిపించడం ఏంటి? అదే నిజం. బాలయ్య వయసు 62 అయితే.. శ్రుతి హాసన్కి 36. వీళ్లిద్దర్నీ జంటగా పెట్టారు కానీ.. బాలయ్యకి సరైన జోడీగా శ్రుతిని చూపించలేకపోయారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ పెద్ద బాలయ్యకి చెల్లి అయితే.. చిన్న బాలయ్యకి అత్త.. ప్లీ క్లైమాక్స్లో ‘ఎలా ఉన్నావ్ అత్తా’ అని అడిగే సీన్లో బాలయ్య ఏంటి? వరలక్ష్మీ శరత్ కుమార్కి అత్త ఏంటి? అనేట్టుగా ఉంటుంది. ఇక హనీ రోజ్ బాలయ్యకి జోడీగా పర్లేదు కానీ.. చిన్న బాలయ్యకి తల్లిగా అస్సలు కుదర్లేదు. జుట్టుకి తెలుపు రంగు వేసినా.. హనీ రోజ్ నవ యవ్వనం కనిపిస్తూనే ఉంది.
శ్రుతి హాసన్ పాత్రకి పెద్దగా స్కోప్ లేదు కానీ.. గ్లామర్ షోతో కాకరేపింది. కార్ గ్యారేజ్ సీన్లో ఆమె డాన్స్ పెర్ఫామెన్స్ బాగుంటుంది.. అందాల ఆరబోత కూడా అదే రేంజ్లో ఉంటుంది. వీరసింహారెడ్డి జోడీగా హనీరోజ్ ఉన్నంతలో పర్వలేదు. ఆమెకి స్కోప్ ఉన్న పాత్రే పడింది. అయితే బాలయ్య పక్కన సరి జోడిగా అనిపించలేదు. అన్నపై పగతీర్చలేదని.. పక్క ఎక్కని పెళ్లం పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ క్రూరంగా కనిపించింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. సప్తగిరి రెండు సీన్లకే పరిమితం అయితే.. బ్రహ్మానందం, అలీ.. ఒక్క సీన్లోకనిపించి మాయం అవుతారు. ప్రతినాయకుడిగా దునియా విజయ్.. బాలయ్యతో తన్నులు తినడానికేనా అనేట్టుగా ఉంది. వెళ్లడం బాలయ్యతో తన్నులు తినడం రావడం. ఇదే అతని పాత్ర. అజయ్ ఘోష్ పంచ్లు పేలాయి. మురళీ శర్మకి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు.
తమన్ నేపథ్య సంగీతం హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేశాయి. అయితే రన్ టైం ఎంత కుదిస్తే అంత మంచిది అనేట్టుగా ఉంటుంది. తరువాత ఏం జరుగుతుందన్నది ముందే తెలిసిపోతూ ఉంటుంది. దాదాపు సెకండాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ నెక్స్ట్ ఏంటి అన్నది రివీల్ అయిపోతూనే ఉంటుంది కాబట్టి.. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు మరింత పని చెప్పాల్సిందే. బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్లు పేలడం కాదు.. తూటాల్లా దూసుకుని వచ్చాయి. ‘మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా’.. లాంటి డైలాగ్లు అడుగడుగునా వినపడుతూనే ఉంటాయి. మాస్ ఆడియన్స్తో విజిల్ వేయించేలా డైలాగ్స్ చాలానే ఉన్నాయి. వీరసింహారెడ్డిలో బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ హైలైట్ అయ్యాయి.
ఇక తమన్ మ్యూజిక్ సినిమాకి మరో ప్లస్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే పూనకాలే. యాక్షన్ ఎపిసోడ్స్లో తమన్ నేపథ్య సంగీతం హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేశాయి. మా బావ మనోభావాలు.. జై బాలయ్య.. సుగుణ సుందరి సాంగ్స్ బాగున్నాయి. ఐటమ్ సాంగ్లో అయితే ఐటమ్ భామ చంద్రిక రవి (chandrika ravi) అందాల జాతర చేసింది. పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ని గుర్తు చేసింది . రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి కానీ.. ఇన్ని ఫైట్స్ అవసరమా? అనేట్టుగా అనిపిస్తాయి. బీభత్సమై హింస.. ఒకటే నరుకుడు బోరింగ్గా అనిపిస్తాయి. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాగుంది.. బాలయ్య ఎలివేషన్ షాట్స్ అదిరిపోయాయి. హీరోయిన్స్ని చాలా అందంగా చూపించాడు.
మొత్తంగా.. ‘వీరసింహారెడ్డి’ ఫ్యాన్స్కి పూనకాలే కానీ.. కామన్ ఆడియన్స్కి మాత్రం రొటీన్ ఫ్యాక్షన్ డ్రామా.
మాస్ నాడి బాగా పట్టిన గోపీచంద్ మలినేని బాలయ్యని మాస్ ఆఫ్ గాడ్గా చూపించి మసాలా ప్రియులకు మాస్ బిరియానీ రుచి చూపించారు. ముఖ్యంగా అభిమానులకు. గోపీచంద్ కూడా బాలయ్య అభిమానే కావడంతో.. తన అభిమాన హీరోని.. ప్రేక్షకులకు ఎలా చూపిస్తే నచ్చుతుందో అలా చూపించాడు స్క్రీన్పై. తాను ఫ్యాక్షనిజం బాట పట్టి తన చుట్టూ ఉన్న వాళ్లని దారి మళ్లించి మార్పుకి శ్రీకారం చుట్టడం బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల ఫార్ములా. ఇంచుమించు ‘వీరసింహారెడ్డి’ కూడా అలాంటి కథే.
అయితే ఈ కథలో వైరం ప్రత్యర్ధితో కాదు. సొంత చెల్లెలితో. వీరసింహారెడ్డి ‘పులిచర్ల’కి దేవుడు. అదే ఊరులో రంగిరెడ్డి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడ్ని వీరసింహారెడ్డి మట్టుపెట్టడంతో.. గంగిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) పగ పెంచుకుంటాడు. వీరసింహారెడ్డిని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రతాప్ రెడ్డి.. వీరసింహారెడ్డి (బాలయ్య) చెల్లెలు భానుమతి (వరలక్ష్మీ శరత్ కుమార్)తో చేతులు కలిపి వీరసింహారెడ్డిని అంతమొందిస్తాడు. వీరసింహారెడ్డి కొడుకే జయ్-జయ సింహారెడ్డి (చిన్న బాలకృష్ణ). ఇతను తన తల్లి మీనాక్షి (హనీ రోజ్)తో కలిసి ఇస్తాంబుల్లో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉంటారు. జయ్ని తన తండ్రి ఎవరో తెలియకుండా.. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచుతుంది మీనాక్షి. జయ్ అనూహ్య పరిస్థితుల్లో శృతిహాసన్తో ప్రేమలో పడతాడు. అయితే జయ్.. తిరిగి పులిచర్లకు వెళ్లడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు వీరసింహారెడ్డికి తన చెల్లెలు భానుకి వైరం ఏంటి? వీర సింహారెడ్డి శత్రువు అయిన ప్రతాప్ రెడ్డి.. భానుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? వీరసింహారెడ్డి-మీనాక్షి విడిపోవడానికి కారణం ఏంటి? తన తండ్రి చావుకి కారణమైన శత్రువుల్ని జయ సింహారెడ్డి ఎలా అంతమొందించాడు అన్నదే మిగిలిన కథ.
ఫ్యాక్షన్ కథ అంటే బాలయ్యకి పూనకం అనేట్టుగానే విజృభిస్తారు.. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాల్లో కథలే బలం. కానీ ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో కథకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ని, మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ల కోసం అందించిన ఊర మాస్ బిర్యానీలా అనిపిస్తుంది. ఫస్టాఫ్లో జై పాత్ర పరిచయం.. ఈషా (శ్రుతిహాసన్)తో ప్రేమాయణం.. వాళ్ల పెళ్లికి దారి తీసిన పరిస్థితులు.. పరిచయ కార్యక్రమాలతో కథ చకచకా సాగిపోతుంది. అయితే ఎప్పుడైతే జై.. తన తండ్రి వీరశివారెడ్డి బతికే ఉన్నాడనే నిజం తల్లి ద్వారా తెలుసుకుంటాడో... అక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. వీరసింహారెడ్డి ఎంట్రీ తరువాత కథ వేగం పుంజుకుని అసలు కథలోకి వెళ్తుంది. ఆకలితో ఉన్న సింహాన్ని కొన్నాళ్లు బోనులో బంధించి.. ఒక్కసారిగా వేటకి వదిలితే ఎలా ఉంటుందో.. ‘వీరసింహారెడ్డి’ విశ్వరూపం అలా ఉంది. ఫ్యాన్స్తో ఈలలు కొట్టించే ఎలివేషన్ సన్నివేశాలు అడుగడుగునా ఉంటాయి. హీరోయిజం ఎలివేషన్ సీన్లలో బాలయ్య వీరంగం చేశాడు.
అయితే ఎంత మాస్ బిర్యానీ అయినా సరే.. చూసిన కథనే మళ్లీ మళ్లీ చూడాలంటే ఎవరికైనా బోరింగ్ అనిపిస్తుంది. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్యని వీరలెవల్లో చూపించాలనే ప్రయత్నంలో కథని గాడి తప్పించాడు దర్శకుడు. కేవలం ఫైట్లు.. యాక్షన్.. ఎలివేషన్స్పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు దర్శకుడు గోపీచంద్. ఫ్యాక్షన్ నేపథ్యంలో సిస్టర్ సెంటిమెంట్ని సరిగా ఎలివేట్ చేయలేకపోయారు. బాలయ్యని ఒకప్పటి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు గెటప్లో చూపించినా.. ఆ సినిమాల స్థాయి కథని అయితే అందించలేకపోయాడు గోపీచంద్. బాలయ్యకి కత్తి ఇచ్చి నరికిస్తే ప్రేక్షకులే చూసుకుంటారని అనుకున్నారో ఏమో కానీ.. అవసరం ఉన్న లేకపోయినా ఫైట్లు పెట్టి.. రక్తపాతం సృష్టించారు.
ప్రతినాయకుడు ఎన్ని వేట్లు వేసినా అడ్డదిడ్డంగా నరుక్కుంటూ పోయినా.. లెక్కచెప్పాల్సిన పని ఉండదు. ఎందుకంటే అతను విలన్ కాబట్టి.. కానీ కథలో నాయకుడు అనేవాడు వేసే ప్రతి వేటుకి ప్రేక్షకుడికి లెక్క చెప్పాల్సిందే. కానీ ‘వీరసింహారెడ్డి’లో లెక్కచెప్పలేనన్ని వేట్లు పడ్డాయి. ‘బాధ్యతగా చంపుతా.. మళ్లీ పుట్టడానికి మళ్లీ భయపడేట్టు చంపుతా’.. అంటూ బాలయ్య ఊచకోత కోస్తూనే ఉన్నాడు. అవసరం లేని చోట కూడా ఫైట్లు పెట్టి రక్తపాతం సృష్టించారు. కుర్చీలో కూర్చుని తాపీగా చుట్టకాలుస్తూ.. తలకాయల్ని తెగ తరిగేశాడు బాలయ్య. ఎలివేషన్లు అయితే మామూలుగా ఉండవు. గోపీచంద్ బాలయ్య అభిమాని కావడంతో.. ఎలాగైనా చూస్తారు అనుకున్నారో ఏమో కానీ.. తొడ కొట్టించే సీన్లు.. గాల్లో గిరగిరా ఎగిరేసీన్లు.. కత్తి విసిరితే తల తెగిపడి.. మళ్లీ కత్తి బాలయ్య చేతిలోకి వచ్చి చేరటాలు.. అబ్బో మామూలు మాస్ ఎలిమెంట్స్ కాదు.
ఎంత పంచ్ డైలాగ్ అయినా కథని.. కథాంశాన్ని డిమాండ్ చేస్తేనే ఆ డైలాగ్ పండుతుంది. ఈ సినిమాలో బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్లు బాలయ్య నోట బుల్లెట్స్లా దూసుకుని వచ్చాయి. అయితే కొన్ని డైలాగ్లు మాత్రం కథతో సంబంధం లేకుండా బాలయ్య పొలిటికల్ అజెండాని దృష్టిలో పెట్టుకుని రాసినట్టే అనిపిస్తాయి. ఓ మినిస్టర్ని ఉద్దేశించి చెప్పే సందర్భంలో.. ‘వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు.. గౌరవించడం మన బాధ్యత’ అని డైలాగ్ కొడతాడు బాలయ్య. ఇలా ప్రభుత్వాన్ని గిల్లే డైలాగ్లు సినిమాలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి చెప్పిన డైలాగ్. ‘‘ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి.. ప్రజల్ని వేధించడం కాదు., జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమేయడం కాదు., పని చేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు., నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు., పరిశ్రమలను తీసుకుని రావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలను మూయడం కాదు. బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో.. వాడు దోచుకోవడానికి వచ్చాడు.. నాట్ అలౌడ్..’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ అధికార పార్టీ కెలికినట్టే ఉంటుంది.
‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు. బలం చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువా..’ లాంటి డైలాగ్లు కూడా అధికార పార్టీపై ఎక్కుపెట్టిన బాణాల్లాగే అనిపిస్తుంది.
ఇక వీరసింహారెడ్డిలో లీడ్ రోల్స్ ఎంపిక కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. బాలయ్య సరసన శ్రుతిహాసన్ సెట్ కాలేదు. మరీ చిన్నగా అనిపిస్తుంది. అనిపించడం ఏంటి? అదే నిజం. బాలయ్య వయసు 62 అయితే.. శ్రుతి హాసన్కి 36. వీళ్లిద్దర్నీ జంటగా పెట్టారు కానీ.. బాలయ్యకి సరైన జోడీగా శ్రుతిని చూపించలేకపోయారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ పెద్ద బాలయ్యకి చెల్లి అయితే.. చిన్న బాలయ్యకి అత్త.. ప్లీ క్లైమాక్స్లో ‘ఎలా ఉన్నావ్ అత్తా’ అని అడిగే సీన్లో బాలయ్య ఏంటి? వరలక్ష్మీ శరత్ కుమార్కి అత్త ఏంటి? అనేట్టుగా ఉంటుంది. ఇక హనీ రోజ్ బాలయ్యకి జోడీగా పర్లేదు కానీ.. చిన్న బాలయ్యకి తల్లిగా అస్సలు కుదర్లేదు. జుట్టుకి తెలుపు రంగు వేసినా.. హనీ రోజ్ నవ యవ్వనం కనిపిస్తూనే ఉంది.
శ్రుతి హాసన్ పాత్రకి పెద్దగా స్కోప్ లేదు కానీ.. గ్లామర్ షోతో కాకరేపింది. కార్ గ్యారేజ్ సీన్లో ఆమె డాన్స్ పెర్ఫామెన్స్ బాగుంటుంది.. అందాల ఆరబోత కూడా అదే రేంజ్లో ఉంటుంది. వీరసింహారెడ్డి జోడీగా హనీరోజ్ ఉన్నంతలో పర్వలేదు. ఆమెకి స్కోప్ ఉన్న పాత్రే పడింది. అయితే బాలయ్య పక్కన సరి జోడిగా అనిపించలేదు. అన్నపై పగతీర్చలేదని.. పక్క ఎక్కని పెళ్లం పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ క్రూరంగా కనిపించింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. సప్తగిరి రెండు సీన్లకే పరిమితం అయితే.. బ్రహ్మానందం, అలీ.. ఒక్క సీన్లోకనిపించి మాయం అవుతారు. ప్రతినాయకుడిగా దునియా విజయ్.. బాలయ్యతో తన్నులు తినడానికేనా అనేట్టుగా ఉంది. వెళ్లడం బాలయ్యతో తన్నులు తినడం రావడం. ఇదే అతని పాత్ర. అజయ్ ఘోష్ పంచ్లు పేలాయి. మురళీ శర్మకి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు.
తమన్ నేపథ్య సంగీతం హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేశాయి. అయితే రన్ టైం ఎంత కుదిస్తే అంత మంచిది అనేట్టుగా ఉంటుంది. తరువాత ఏం జరుగుతుందన్నది ముందే తెలిసిపోతూ ఉంటుంది. దాదాపు సెకండాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ నెక్స్ట్ ఏంటి అన్నది రివీల్ అయిపోతూనే ఉంటుంది కాబట్టి.. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు మరింత పని చెప్పాల్సిందే. బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్లు పేలడం కాదు.. తూటాల్లా దూసుకుని వచ్చాయి. ‘మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా’.. లాంటి డైలాగ్లు అడుగడుగునా వినపడుతూనే ఉంటాయి. మాస్ ఆడియన్స్తో విజిల్ వేయించేలా డైలాగ్స్ చాలానే ఉన్నాయి. వీరసింహారెడ్డిలో బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ హైలైట్ అయ్యాయి.
ఇక తమన్ మ్యూజిక్ సినిమాకి మరో ప్లస్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే పూనకాలే. యాక్షన్ ఎపిసోడ్స్లో తమన్ నేపథ్య సంగీతం హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేశాయి. మా బావ మనోభావాలు.. జై బాలయ్య.. సుగుణ సుందరి సాంగ్స్ బాగున్నాయి. ఐటమ్ సాంగ్లో అయితే ఐటమ్ భామ చంద్రిక రవి (chandrika ravi) అందాల జాతర చేసింది. పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ని గుర్తు చేసింది . రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి కానీ.. ఇన్ని ఫైట్స్ అవసరమా? అనేట్టుగా అనిపిస్తాయి. బీభత్సమై హింస.. ఒకటే నరుకుడు బోరింగ్గా అనిపిస్తాయి. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాగుంది.. బాలయ్య ఎలివేషన్ షాట్స్ అదిరిపోయాయి. హీరోయిన్స్ని చాలా అందంగా చూపించాడు.
మొత్తంగా.. ‘వీరసింహారెడ్డి’ ఫ్యాన్స్కి పూనకాలే కానీ.. కామన్ ఆడియన్స్కి మాత్రం రొటీన్ ఫ్యాక్షన్ డ్రామా.