యాప్నగరం

రామ్‌చరణ్, ఎంపీ కవిత చేతుల మీదుగా దర్శకుడి రెస్టారెంట్ లాంచ్

టాలీవుడ్‌లో చాలా మంది సినీ ప్రముఖులు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ బిజీగా వున్నారు. వారిబాటలోనే...

TNN 17 Aug 2017, 7:29 pm
టాలీవుడ్‌లో చాలా మంది సినీ ప్రముఖులు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ బిజీగా వున్నారు. వారిబాటలోనే ప్రయాణిస్తూ తాజాగా మరో దర్శకుడు కూడా బిజినెస్‌మేన్‌గా మారారు. అతడు ఎవరో కాదు.. తెలుగులో అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, ధృవ వంటి చిత్రాల్నితెరకెక్కించి టాలీవుడ్‌లో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న సురేందర్ రెడ్డి. అవును సురేందర్ రెడ్డి హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు.
Samayam Telugu ram charan and mp kavitha launches surender reddys ulavacharu restaurant at gachibowli
రామ్‌చరణ్, ఎంపీ కవిత చేతుల మీదుగా దర్శకుడి రెస్టారెంట్ లాంచ్


జూబ్లీహిల్స్‌లో వున్న ఉలవచారు రెస్టారెంట్ అనే హోటల్‌కి సంబంధించిన మరో ఫ్రాంఛైజీని తాజాగా సురేందర్ రెడ్డి గచ్చిబౌలిలో స్థాపించారు. ఈ లాంచింగ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథులుగా హాజరైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, టీఆర్ఎస్ ఎంపీ కవిత చేతుల మీదుగా గచ్చిబౌలిలో ఈ ఉలవచారు రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇప్పటివరకు దర్శకుడిగా వున్న సురేందర్ రెడ్డి నేటితో బిజినెస్‌మేన్‌గా మారుతున్న నేపథ్యంలో రామ్ చరణ్, కవిత అతడికి తమ అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల రుచులు, ఆయా ప్రాంతాల ప్రత్యేకత వంటకాలు ఈ రెస్టారెంట్‌లో లభించనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.