మహమ్మారిలా వ్యాపించిన వాన్నాక్రై మాల్ వేర్ భారత్ సహా 100 దేశాల్లో సృష్టించిన కలకలం ఓ కొలిక్కి రాకముందే, సోమవారం నాడు మరో భారీ సైబర్ దాడి జరగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడం 'వాన్నా క్రై'ని ఎదుర్కొన్నంత సులువు కాదని యూకేకు చెందిన సైబర్ నిపుణుడు డారెన్ హుస్ తెలియజేశారు. పాత వైరస్ల కోడింగ్లో మార్పులు చేసిన హ్యాకర్లు, ప్రపంచ సైబర్ సిస్టమ్ను సర్వనాశనం చేసేందుకు సిద్ధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
దాదాపు 100 దేశాలను వణికించిన 'వాన్నా క్రై' నుంచి ఇప్పుడిప్పుడే పలు సంస్థలు కోలుకుంటున్నాయి. అమెరికా జాతీయ భద్రత సంస్థ నుంచి దొంగిలించిన సైబర్ ఆయుధం సాయంతో నేరగాళ్లు ఈ దాడికి పాల్పడినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్రిటన్లోని 48 సంస్థల కంప్యూటర్లు హ్యాకింగ్ చేస్తే, ఆరు కంపెనీలు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ దాడుల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన 102 సిస్టమ్స్ కూడా ప్రభావితమయ్యాయి.
మాల్వేర్ను తొలగించడానికి ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు శ్రమిస్తున్నారు. మరోవైపు తమ అధీనంలోకి వచ్చిన డేటాను వెనక్కు ఇచ్చేందుకు ఒక్కో కంప్యూటర్ నుంచి 300 డాలర్లు వసూలుచేస్తున్న 'వాన్నా క్రై' సృష్టికర్తలు, ఇప్పటికే 22 వేల డాలర్ల ఆదాయాన్ని పొందినట్లు సమాచారం. దీన్ని బిట్ కాయిన్ల రూపంలో మాత్రమే చెల్లించాలని షరతులు విధించిన సంగతి తెలిసిందే.
దాదాపు 100 దేశాలను వణికించిన 'వాన్నా క్రై' నుంచి ఇప్పుడిప్పుడే పలు సంస్థలు కోలుకుంటున్నాయి. అమెరికా జాతీయ భద్రత సంస్థ నుంచి దొంగిలించిన సైబర్ ఆయుధం సాయంతో నేరగాళ్లు ఈ దాడికి పాల్పడినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్రిటన్లోని 48 సంస్థల కంప్యూటర్లు హ్యాకింగ్ చేస్తే, ఆరు కంపెనీలు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ దాడుల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన 102 సిస్టమ్స్ కూడా ప్రభావితమయ్యాయి.
మాల్వేర్ను తొలగించడానికి ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు శ్రమిస్తున్నారు. మరోవైపు తమ అధీనంలోకి వచ్చిన డేటాను వెనక్కు ఇచ్చేందుకు ఒక్కో కంప్యూటర్ నుంచి 300 డాలర్లు వసూలుచేస్తున్న 'వాన్నా క్రై' సృష్టికర్తలు, ఇప్పటికే 22 వేల డాలర్ల ఆదాయాన్ని పొందినట్లు సమాచారం. దీన్ని బిట్ కాయిన్ల రూపంలో మాత్రమే చెల్లించాలని షరతులు విధించిన సంగతి తెలిసిందే.