విచ్చలవిడిగా సిమ్కార్డులు కొనేయడం, నకిలీ ధ్రువపత్రాలతో సిమ్కార్డులు సొంతం చేసుకోవడం లాంటి పనులకు టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇకపై కళ్లెం వేయనుంది. ఈ మేరకు టెలీకాం శాఖకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న మొబైల్ సబ్స్క్రైబర్లను గుర్తించడానికి సర్వీస్ ప్రొవైడర్లతో కలసి పనిచేయడానికి టెలీకాం శాఖ నడుం బిగించింది.
ఈ మేరకు ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ ద్వారా మొబైల్ సబ్స్క్రైబర్లను వెరిఫై చేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ పని పూర్తిచేయాలని ట్రాయ్ యోచిస్తోంది. దీనివల్ల ఒక ఆధార్ నంబర్పై ఎన్ని సిమ్లు తీసుకున్నారనే విషయాన్ని సులభంగా గుర్తించొచ్చు. అంతేకాకుండా నకిలీ ధ్రువపత్రాలతో సిమ్కార్డులు కొనే అవకాశం కూడా ఉండదు.
పోలీసుల నుంచి తమకు చాలా ఫిర్యాదులు అందాయని, వందల కొద్దీ సిమ్కార్డులు నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్నవేనని ట్రాయ్ వెల్లడించింది. ప్రస్తుతం ఇలాంటి సిమ్కార్డులను చాలా మంది వాడుతున్నారని, వాటన్నింటినీ గుర్తించడం చాలా కష్టమని చెప్పింది. ఇకపై సిమ్కార్డులను ఈ ఇ-కేవైసీ పద్ధతి ద్వారానే ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ ద్వారా మొబైల్ సబ్స్క్రైబర్లను వెరిఫై చేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ పని పూర్తిచేయాలని ట్రాయ్ యోచిస్తోంది. దీనివల్ల ఒక ఆధార్ నంబర్పై ఎన్ని సిమ్లు తీసుకున్నారనే విషయాన్ని సులభంగా గుర్తించొచ్చు. అంతేకాకుండా నకిలీ ధ్రువపత్రాలతో సిమ్కార్డులు కొనే అవకాశం కూడా ఉండదు.
పోలీసుల నుంచి తమకు చాలా ఫిర్యాదులు అందాయని, వందల కొద్దీ సిమ్కార్డులు నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్నవేనని ట్రాయ్ వెల్లడించింది. ప్రస్తుతం ఇలాంటి సిమ్కార్డులను చాలా మంది వాడుతున్నారని, వాటన్నింటినీ గుర్తించడం చాలా కష్టమని చెప్పింది. ఇకపై సిమ్కార్డులను ఈ ఇ-కేవైసీ పద్ధతి ద్వారానే ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది.