యాప్నగరం

ఏపీలో వరదలు: ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు!

‘గాడ్స్ ఓన్ కంట్రీ’గా పేరొందిన కేరళ ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. ఊహించని స్థాయిలో కురిసిన భారీ వర్షాల వల్ల ఊళ్లు ఏరులను తలపిస్తున్నాయి.

Samayam Telugu 17 Aug 2018, 3:47 pm
‘గాడ్స్ ఓన్ కంట్రీ’గా పేరొందిన కేరళ ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. ఊహించని స్థాయిలో కురిసిన భారీ వర్షాల వల్ల ఊళ్లు ఏరులను తలపిస్తున్నాయి. నిత్యం పర్యాటకులతో కళకల్లాడే కేరళ.. కన్నీటితో సాయం కోసం చేతులు చాస్తోంది. ఈ పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌నూ కలవరపెడుతోంది. నదీ తీర ప్రాంతాలను వరదలు వణికిస్తున్నాయి.
Samayam Telugu Untitled23


ఈ నేపథ్యంలో పర్యాటకులు ఏపీలోని తీర ప్రాంతాల్లో పర్యటించకపోవడమే ఉత్తమం. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదిలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఈ సమయంలో పడవలు లాంచీల్లో ప్రయాణించడం సురక్షితం కాదు. ముఖ్యంగా భవానీ ఐలాండ్‌‌లోకి నీరు ప్రవేశించే అవకాశాలున్నాయి. అలాగే, ప్రకాశం బ్యారేజీ దిగువునకు కూడా వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

గోదావరిలో సైతం వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో గోదావరిలో లాంచీల్లో పర్యటించడం ప్రమాదకరం. భారీ వర్షాల వల్ల విశాఖ జిల్లా అరకు, లంబసింగిలో సైతం వాగులు, జలపాతాలు వద్ద ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. అలాగే, కొండ చరియలు కూడా విరిగిపడుతున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు పర్యాటకులు ఆయా ప్రాంతాలను సందర్శించకపోవడం ఉత్తమం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.