యాప్నగరం

5000 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం

దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పించేందుకు కేంద్రం సరికొత్త పథకం.

Samayam Telugu 14 Nov 2018, 9:53 pm
రైలు ప్రయాణికులకు శుభవార్త. మరికొద్ది రోజుల్లో దాదాపు అన్ని రైల్వే స్టేషన్లో వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రైల్వే శాఖ పనులు ఆరంభించింది. దేశంలో ఇప్పటివరకు 711 రైల్వే స్టేషన్లో వైఫై సదుపాయం ఉంది. త్వరలో మరో 5000 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ అశ్వినీ లొహానీ వెల్లడించారు.
Samayam Telugu 11r


ఈ వైఫై ప్రాజెక్టులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) సహకారంతో చేపట్టనున్నామని తెలిపారు. ఇందుకు ‘రైల్ సహయోగ్’ పేరుతో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చే కార్పొరేట్ సంస్థలు ‘రైల్ సహయోగ్’ ద్వారా రైల్వేను సంప్రదించవచ్చని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.