Best Places To Visit And Have Memorable Holidays In Odisha
Odisha Tourist Places: ఒడిశాలో ఇలాంటి అందమైన ప్రదేశాలు ఉంటే వెళ్లకుండా ఎలా ఉంటారు?
మీరు 2023ని ఉత్తేజకరమైన సంవత్సరంగా మలచుకోవాలనుకుంటే మరో ఆలోచన లేకుండా ఒడిశాకు (Odisha Tourist Places) వెళ్లండి. అక్కడ చాలా అందమైన నగరాలు, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అక్కడి ఆలయాలు, వన్యప్రాణి అభయారణ్యాలు, బీచ్లు, దట్టమైన అడవులు ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతాయి.
దేశంలోని అందమైన సముద్ర తీర రాష్ట్రాల్లో ఒకటి ఒడిశా (Odisha). ఇక్కడ అనేక పర్యాటకపరమైన ప్రదేశాలున్నా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అంతగా ప్రాచుర్యం పొందలేదు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ (Bhuvaneshwar) నుండి పూరీలోని (Puri Jagannath Temple) జగన్నాథ్ ఆలయం వరకు ఎన్నో చారిత్రక, అరుదైన ఆలయాలు ఉన్నాయి. అలాగే గహిర్మాత ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పొదుగు స్థావరం నుండి చిలికా సరస్సులోని వలస పక్షుల వీక్షణ వరకు పలు రకాల అరుదైన వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు ఉన్నాయి. దీంతో 2023లో మీరు పరిపూర్ణమైన హాలిడేని ఎంజాయ్ చేయాలనుకుంటే ఒడిశాకు (Odisha tour) వెళితే సరిపోతుంది. అక్కడ ప్రధానంగా చూడాల్సిన పలు అద్భుతమైన పర్యాటక ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. (Photo Credit: Unsplash)
భువనేశ్వర్..
ఒడిశా రాజధాని భువనేశ్వర్ అద్భుతమైన నగరం. ఇది ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. దీంతో మీరు భువనేశ్వర్ను సందర్శిస్తే మంచి ఆధ్యాత్మిక పర్యటన చేసినవారవుతారు. అక్కడ లింగరాజ ఆలయం, పురశురామేశ్వర ఆలయం, ఇస్కాన్ టెంపుల్, హీరాకుండ్ డ్యామ్, రాజరాణి టెంపుల్, బిందు సరోవర్, బ్రహ్మేశ్వర టెంపుల్, ముక్తేశ్వర టెంపుల్ వంటివి చూడొచ్చు. దీంతో మీరు గొప్ప ఆధ్యాత్మిక భావనలోకి వెళ్లొచ్చు. (Photo Credit: Unsplash) Also Read: Vande bharat Interesting Facts: వందేభారత్ రైళ్లకు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
డియోమాలి..
కోరాపుట్ జిల్లాలోని డియోమాలి తూర్పు కనుమల్లోని అత్యుత్తమ హిల్ స్టేషన్లలో ఒకటి. ఇదో మంచి పిక్నిక్ స్పాట్ కావడంతో ఫ్యామిలీ పర్యటనలకు, వీకెండ్ ట్రిప్లకు అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ అందమైన అటవీ ప్రాంతం ట్రెక్కింగ్ చేసేవారికి, ప్రకృతి దృశ్యాలు ఇష్టపడేవారికి గొప్పగా ఉంటుంది. ఇక్కడ పలు వన్యప్రాణులను కూడా చూసే అవకాశం ఉంటుంది. (Photo Credit: Unsplash) Also Read: No Visa Countries for Indians: భారతీయులకు వీసాలు అక్కర్లేని 10 దేశాలు ఇవే.. 2023లో ప్లాన్ చేయండి..!
పూరి..
ఒడిశా అంటేనే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ్ ఆలయం. ఏటా జరిగే వార్షిక ఉత్సవాల్లో ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ ఆలయం దేశంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి కావడంతో నిత్యం భక్తులతో నిండి ఉంటుంది. అలాగే అక్కడున్న పూరీ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ గుర్తింపు దక్కింది. అర్థవంతమైన ఆధ్యాత్మిక ట్రిప్ లేదా ఆహ్లాదకరమైన హాలిడేని ఎంజాయ్ చేయాలనుకుంటే పూరీని సందర్శించవచ్చు. (Photo Credit: Unsplash/Representational Image) Also Read: Valentines Day Destinations: ఈ వాలెంటైన్స్ డేకి మీ ప్రియమైన వారికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఈ ప్రదేశాలకు తీసుకెళ్లండి..!
ఉదయగిరి, ఖందగిరి గుహలు..
భువనేశ్వర్ నుండి కేవలం 15 నిమిషాల దూరంలో ఉండే ఉదయగిరి, ఖండగిరి గుహల అద్భుతమైన గుహ సముదాయాలు. ఇవి ఒకటో శతాబ్దానికి చెందిన అరుదైన గుహలుగా పేరుగాంచాయి. ఇందులో సహజసిద్ధంగా ఏర్పడినవి కొన్నైతే, మరికొన్ని మానవ నిర్మితాలు. దీంతో ఇవి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. చుట్టూ పచ్చని ప్రకృతి దృశ్యాల నడుమ ఉండే ఈ గుహలను అప్పట్లో జైనుల మతస్థులు నివాస ప్రాంగణాలుగా ఉపయోగించుకున్నారు. (Photo Credit: Unsplash) Also Read: Goa Trip: ఫిబ్రవరిలో గోవాకు ఎందుకు వెళ్లాలంటే.. ఇవే కారణాలు.. తెలిస్తే మీరూ వెళతారు..!
కోణార్క్ సూర్య దేవాలయం..
పూరి జిల్లాలోని కోణార్క్ సన్ టెంపుల్ కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం. ఇదో అరుదైన, అద్భుతమైన మానవ నిర్మాణం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ సూర్య భగవానుడి ఆలయం భారతదేశంలోనే రెండోది. మరో సూర్య దేవాలయం గుజరాత్లోని మోధేరా నగరంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం గుర్రాలతో కూడిన భారీ రథం వలే ఉంటుంది. మొత్తం రాయిని ఇలా మలచడం చూడటానికి గొప్పగా అనిపిస్తుంది. (Photo Credit: Unsplash) Also Read: Lalbagh Gardens Flower Exhibition: ఈ ఫ్లవర్ షోను చూసేందుకు జనం లక్షలాదిగా ఎగబడతారు.. ఇంతకీ ఎందుకంత ప్రత్యేకత..?
చిలికా సరస్సు..
చిలికా సరస్సు ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సులలో ఒకటి. అలాగే భారతదేశంలోనే అతిపెద్దది కూడా. పూరీ, ఖుర్దా, గంజాం వంటి మూడు జిల్లాల్లో విస్తరించిన ఈ సరస్సు భారతదేశంలోని ఉత్తమ పక్షుల నిలయం కూడా. ఇక్కడికి ఏటా శీతాకాలంలో వేలాది వలస పక్షులు వచ్చి అలరిస్తుంటాయి. దీంతో మీరు ఇక్కడ పలు రకాల అద్భుతమైన పక్షులను కూడా చూడొచ్చు. (Photo Credit: Unsplash) Also Read: February Destinations: ఫిబ్రవరిలో విహారయాత్రలకు వెళ్లాలంటే ఇవే సరైన గమ్యస్థానాలు.. ఎప్పుడైనా ఇక్కడికి వెళ్లారా?
గహిర్మత, రుషికుల్య..
ఒడిశాలోని అరుదైన ప్రదేశాల్లో ఒకటి గహిర్మాత తాబేళ్ల అభయారణ్యం. ఇక్కడికి ఏటా లక్షలాది ఆలివ్ రిడ్ అనే అరుదైన తాబేళ్లు వచ్చి గుడ్లు పెడతాయి. మళ్లీ అవి కొద్ది రోజులయ్యాక సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఆ సమయంలో ఈ గహిర్మాత సముద్ర తీర ప్రాంతాన్ని చూస్తే చాలా అందంగా ఉంటుంది. బీచ్ అంతా తాబేళ్లతో నిండిపోతుంది. రుషికుల్య కూడా అలాంటి ప్రాంతమే. దీంతో ఈ రెండు ప్రదేశాలను కూడా చూడొచ్చు. (Photo Credit: Unsplash) Also Read: Republic Day 2023: ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలు చూస్తే జీవితంలో మర్చిపోలేరు.. అవి ఎక్కడంటే..!
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.