Best Places To Watch Out Republic Day Parades In India
Republic Day 2023: ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలు చూస్తే జీవితంలో మర్చిపోలేరు.. అవి ఎక్కడంటే..!
మరికొద్ది రోజుల్లో భారత (India) దేశం గణతంత్ర దినోత్సవం (Republic Day Celebrations 2023) జరుపుకోనుంది. ఆ రోజు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతాయి. అలాంటి వేడుకలు చూడాలంటే మీరు ఈ సారి ఈ ప్రాంతాలను సందర్శించడం అద్భుతంగా ఉంటుంది. వీలైతే వెళ్లి చూడండి.
భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చాక రెండున్నరేళ్లకు రాజ్యంగ బద్ద దేశంగా గుర్తింపు పొందింది. 1950 జనవరి 26న రాజ్యంగం అమల్లోకి రావడంతో ఏటా ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా (Republic Day 2023) జరుపుకుంటున్నాం. ఆ రోజు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, విద్యా సంస్థలు ఘనంగా వేడుకలు జరుపుకుంటాయి. విద్యార్థులు, పోలీసులు, జవాన్లు గొప్ప పరేడ్లు నిర్వహించి ఆకట్టుకుంటారు. దిల్లీ నుంచి గల్లీ వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ భక్తి చాటుకుంటారు. ఈ క్రమంలోనే ఆ రోజు దేశంలోని పలు ప్రాంతాల్లో అద్భుతమైన వేడుకలు జరుగుతాయి. అక్కడికెళ్లి చూడటం చాలా గొప్పగా ఉంటుంది. ఈసారి మీరు రిపబ్లిక్ డే రోజు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఈ ప్రదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేయండి. మీరు జీవితంలో మర్చిపోలేని అనుభూతి పొందుతారు. (Photo Credit: Unsplash/Representational Image)
దిల్లీలోని రాజ్పథ్..
దేశ రాజధాని దిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులు, అత్యున్నత స్థాయి వ్యక్తులు పాల్గొంటారు. రాష్ట్రపతి నిలయం నుండి ఇండియాగేట్ వరకు జరిగే ఈ వేడుకలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు తరలివస్తారు. సుమారు 3 గంటల పాటు జరిగే ఈ వేడుకలను కళ్లారా చూడటం అద్భుతంగా ఉంటుంది. ఇందులో అన్ని రాష్ట్రాల వారు పాల్గొంటారు. ఇక అక్కడ నిర్వహించే పరేడ్లు చూడటం మరింత గొప్పగా ఉంటుంది. దీంతో మీరూ తప్పక దిల్లీకి వెళ్లాల్సిందే. (Photo Credit: Unsplash/Representational Image) Also Read: Bharat Gaurav Special Tour: భారత్ గౌరవ్ స్పెషల్ టూర్.. 8 రోజులు, 5 జ్యోతిర్లింగాల సందర్శన..
పంజాబ్లోని అమృత్సర్..
పంజాబ్లోని అమృత్సర్లోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతాయి. అక్కడ ఈ వేడుకలు చూడటం గొప్పగా ఉంటుంది. ఎందుకంటే దేశ స్వాతంత్రోద్యమంలో కీలక ఘట్టంగా భావించే జలియన్ వాలా బాగ్ హత్యాకాండ ఇక్కడే జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నాటి హత్యాకాండలో ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది దేశ భక్తులకు నివాళులు అర్పించే అవకాశం ఉంటుంది. అలాగే అమృత్సర్ సమీపంలోని వాఘా బార్డర్ వద్ద సాయంత్రం నిర్వహించే సైనిక పరేడ్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. (Photo Credit: Unsplash/Representational Image) Also Read: Incredible India: దేశం గర్వించదగ్గ అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు.. ఇవి జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..!
గుజరాత్లోని గాంధీనగర్..
గుజరాత్లోని గాంధీనగర్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. జాతిపిత మహాత్మాగాంధీ సొంతూరు అయిన గాంధీనగర్కు దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉందని సంగతి తెలిసిందే. అలాంటి చోట దేశ ప్రతీకకు సంబంధించిన ప్రతి విషయంలోనూ స్థానికులు గాంధీకి నివాళులర్పించడం గొప్ప విశేషం. ఈ క్రమంలోనే అక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మీరు కూడా ఒకసారి అక్కడికెళితే ఎలా ఉంటుందో చూడొచ్చు. (Photo Credit: Unsplash/Representational Image) Also Read: Travel With Pets: మీ పెంపుడు జంతువులను కూడా ట్రైన్లో వెంట తీసుకెళ్లొచ్చు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..!
ముంబయిలోని శివాజీ పార్క్..
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ముంబయిలోని శివాజీ పార్క్లో స్వాతంత్రోద్యమ నాయకులు తరచూ సమావేశాలు నిర్వహించే వారు. దీంతో ఆ స్థలంలోనే ముంబయిలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. అక్కడ వివిధ పాఠశాలల చెందిన విద్యార్థులు, ఎన్సీసీ స్కౌట్స్, పోలీసు విభాగాల, త్రివిధ దళాల సైనికులు అద్భుతమైన పరేడ్లు నిర్వహిస్తారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చూడటానికి గొప్పగా ఉంటాయి. దీంతో మీరు ముంబయి వెళ్లినా బాగుటుందనడంలో సందేహం లేదు. (Photo Credit: Unsplash/Representational Image) Also Read: Bengaluru Helicopter Service: బెంగళూరు వారికి గుడ్న్యూస్.. త్వరలో హెలికాఫ్టర్ సర్వీస్ అందుబాటులోకి..!
కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్..
ఇక కర్ణాటకలోని మైసూర్లోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతాయి. అక్కడున్న మైసూర్ ప్యాలెస్లో ఈ వేడుకలు చూడటం అద్భుతంగా ఉంటుంది. అక్కడ పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ స్కౌట్లు, పోలీసు సిబ్బంది చేసే పరేడ్లు చూడముచ్చటగా అనిపిస్తాయి. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకుంటాయి. మైసూర్ ప్యాలెస్ వద్ద ఈ వేడుకలు చూడటానికి చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఆసక్తి చూపుతారు. దీంతో మీరూ ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు చూడాలంటే మైసూర్కి వెళ్లొచ్చు. (Photo Credit: Unsplash/Representational Image) Also Read: Varanasi: ఆలస్యం చేయకుండా వారణాసికి వెళ్లండి.. నాలుగు రోజులు అక్కడే ఉండి ఆ పండుగను ఆస్వాదించండి..!
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.