యాప్నగరం

ఈ భవనంలో ఎంతో మంది ప్రజలు చనిపోవాలని కోరుకుంటారు... ఎందుకంటే?

మరణం ప్రతి ఒక్కరికీ సర్వ సాధారణం. కానీ ఎంతో మంది ప్రజలు ఒక భవనంలో మరణించాలని కోరుకోవడం మాత్రం సాధారణ విషయం కాదు. ఇక్కడ చావు కోసం ఎదురు చూస్తుంటారు. ఈ భవనం ఇంతకీ ఎక్కడ ఉందంటే?

Samayam Telugu 11 Feb 2020, 6:52 am
ఆధ్యాత్మికతతో నిండిన పవిత్ర నగరం వారణాసి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు పవిత్ర నగరం. ఈ నగరంలో మరణించడం మోక్షం (జనన మరణ చక్రాల నుండి బయట పడడం) పొందడానికి ఖచ్చితమైన మార్గంగా చెప్పబడింది. అందుకే దేశ వ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి తమ జీవిత కాలంలో చివరి రోజులను గడిపేందుకు వెళ్తుంటారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోక్ష భవన్ ను ఆశ్రయిస్తుంటారు.
Samayam Telugu మోక్ష భవన్ వారణాసి


ఒక పాత ఎర్ర భవనం లోపల ఉన్న మోక్ష భవన్ మరణం కోసం ఎదురు చూస్తున్న అనేక మంది ప్రజలతో నిండి ఉంటుంది. ఈ భవనం లోపల 12 తక్కువ కాంతితో ఉన్న గదులు ఉంటాయి. కాస్త అలంకరణతో పాటు అవసరమైన వస్తువులను మాత్రమే ఈ గదుల్లో ఉంచుతారు. ఈ గదుల్లో సమయం మాత్రమే చెడ్డది. వీటిలో నివసించే ప్రజలు తాత్కాలికంగా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు. దీని కోసం వారికి కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉంటుంది. ఈ రెండు వారాల్లో వారికి చావు రాకపోతే వారిని మర్యాదగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతారు. అవును, ప్రతి ఒక్కరూ వారణాసిలో చనిపోయే అదృష్టవంతులు కాలేరు కదా.


Read Also: ఈ దేశాల్లో బికినీ నిషేధం... అతిక్రమిస్తే తప్పదు భారీ మూల్యం

మోక్ష భవన్ లో మరణం ఎవరికీ విరోధి కాదు. నిజానికి ప్రతి ఒక్కరూ తమ జీవితపు చివరి క్షణాల్లో తెలుసుకునే అంతిమ సత్యం ఇది. భూమిపై తాము జీవించే స్వల్ప జీవితంలో తుది విజయం సాధించాలనే ఆశతో ప్రతి ఏటా వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. వారణాసిలో పవిత్రమైన గంగా నది ప్రవాహంకు సమీపంలో చనిపోవడం ఒక గౌరవంగా భక్తులు భావిస్తుంటారు. దీనికి మోక్ష భవన్ కంటే మంచి ప్రదేశం మరొకటి లేదని నమ్ముతారు.

1958లో ప్రముఖ పారిశ్రామిక వేత్త విష్ణు హరి దాల్మియా కాశీలో చనిపోవాలని కోరుకునే వారి కోసం మోక్ష భవన్ ను నిర్మించారు. ఈ భవనం యొక్క మేనేజర్ భైరవ్ నాథ్ శుక్లా 48 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజల మోక్షం కోసం ప్రార్ధిస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోయే అవకాశం ఉందో లేదో ఆయన ముందే ఊహించగలడు. శుక్లా, అతని కుటుంబం నిత్యం మృతదేహాలు, వారి బంధువుల రోధనలకు అలవాటు పడింది. ఓ వైపు శుక్లా అక్కడ ఉన్న వారి మోక్షం కోసం ప్రార్ధిస్తుంటే మరో వైపు ఆయన పిల్లలు ఆ సముదాయంలోనే ఆడుతూ పాడుతూ కనిపిస్తారు. ఇక్కడ మరణం అంటే ఒక పవిత్రమైన ప్రక్రియ. ఇక్కడ నివసించే చాలా మంది మోక్షాన్ని పొందగా, ఇతరులు మరణించలేక నిరాశతో వెనుతిరుగుతుంటారు.

Read Also: ఇండియాలో చీకటి గతంతో నిండిన పర్యాటక ప్రదేశాలు

గంగా నది మెట్లపై మీరు ఎప్పుడు చూసినా మరణించిన వారి దేహాలు ఎప్పుడూ చితిపై కాలుతూ, బూడిద రంగు పొగ ఆకాశం మొత్తం అలముకుని కనిపిస్తుంది. వారణాసిలో దేశ, విదేశీ పర్యాటకులు, అన్వేషకులు, యాత్రికులు ఉన్నా వీరందరూ ఒక అడుగు వెనుకలో ఉంటారు. జీవితం, మరణం యొక్క తత్వాలు ముందంజలో ఉంటాయి. దీనిని మరణం పొందే ప్రదేశంగా కాకుండా విముక్తి కల్పించే స్థలంగా, పాపాలను కడిగే పవిత్ర ప్రదేశంగా ప్రజలు భావిస్తారు. స్వచ్ఛతకు కేంద్రంగా, జీవితానికి కేంద్రంగా, భూమిపై ఎక్కడా కలగని విధంగా మరణం ఇక్కడ లభిస్తుందని నమ్ముతారు.

Read Also: భారతీయులు ఈ దేశాలకు వెళ్లాక వీసా పొందవచ్చు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.