యాప్నగరం

Bimbisara's Jail: గౌతమ బుద్ధుని స్నేహితుడైన బింబిసారుడిని తన కుమారుడే జైళ్లో పెట్టిన ప్రదేశం ఇది..!

బిహార్‌లోని (Bihar Tourist Places) ప్రముఖ పర్యాటక ప్రదేశం రాజ్‌గిర్ ఎంతో చారిత్రక నేపథ్యం కలిగింది. అది గౌతమ బుద్ధుడు, మహావీర్ జైన్, బింబిసారుడు స్వయంగా నడియాడిన ప్రదేశం. దీంతో ఇది తప్పక సందర్శించాల్సిన వాటిల్లో ఒకటిగా నిలిచింది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 30 Nov 2022, 6:33 pm
Samayam Telugu do you know about the place where bimbisara kept in jail by his own son
Bimbisara's Jail: గౌతమ బుద్ధుని స్నేహితుడైన బింబిసారుడిని తన కుమారుడే జైళ్లో పెట్టిన ప్రదేశం ఇది..!
బీహార్‌లోని నలంద జిల్లాలో ఉన్న రాజ్‌గిర్ (Rajgir) భారతదేశంలోనే అత్యంత చారిత్రక విశేషాలున్న గొప్ప ప్రదేశం. ఇది హర్యాంక నుండి మౌర్యుల కాలం వరకు పలు సామ్రాజ్యాలకు రాజధానిగా విశిష్ఠ సేవలు అందించింది. ఇక్కడ బౌద్ధ, జైనుల, హిందువులకు సంబంధించిన అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. దీంతో రాజ్‌గిర్ దేశంలో తప్పక సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. అక్కడ చూడాల్సిన కొన్ని ప్రధాన స్థలాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. (Photo Credit: Unsplash)


​రాబందు శిఖరం..

గ్రిద్ధకూట లేదా రాబందుల శిఖరం రాజ్‌గిర్‌లోని అత్యంత ముఖ్యమైన మతపరమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ పర్వత శిఖరం రాబందును పోలి ఉండటంతో ఆప్రాంతానికి ఆ పేరొచ్చింది. ఇక్కడ గౌతమ బుద్ధుడు అనేక సంవత్సరాలు నివసించి ప్రజలకు బోధనలు చేసేవారని ప్రసిద్ధి. ఈ కొండపైకి చేరాలంటే కాలినడక చేయాల్సిందే. (Photo Credit: Photo Dharma/Wikipedia)

​బింబిసారుడి జైలు..

ప్రాచీన కాలంలో భారత దేశంలోని అత్యంత శక్తిమంతమైన పాలకుల్లో ఒకరైన మగధ సామ్రాజ్య రాజు బింబిసారుడు. క్రీస్తు పూర్వం 545- 493 కాలంలో ఆయన ఈ రాజ్‌గిర్ ప్రాంతాన్ని పాలించాడు. కాలక్రమంలో తన కుమారుడు అజాతశత్రువు చేతనే చెరసాలలో బంధించబడ్డాడు. అదే ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. బింబిసారుడు గౌతమ బుద్ధుని స్నేహితుడు. దీంతో ఈ ప్రాంతంలో బౌద్ధమతానికి చెందిన అనేక ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. (Photo Credit: Venkygrams/Wikipedia)

​సోన భందార్..

ఇక రాజ్‌గిర్ చుట్టు పక్కల ఉండే వైభవ కొండలపై ఉన్న సోన భందార్ గుహలు కూడా మంచి పర్యాటక ప్రదేశం. ఆ గుహల్లో బింబిసారుడు తన ఖజానాను దాచి ఉంచాడని స్థానికులు విశ్వసిస్తారు. అక్కడ ఇప్పటికీ ఆ నిధి ఉందని, దాన్ని పొందే మార్గం కూడా అక్కడి గోడలపై ఉన్న పురాతన శాసనాల్లో ఉంటుందని చాలా మంది నమ్ముతారు. (Photo Credit: Aryan paswan/Wikipedia)

​సప్తపర్ణి గుహలు..

వైభవ కొండలపైనే ఉన్న మరో అందమైన ప్రదేశమే సప్తపర్ణి గుహలు. ఇవి చాలా ముఖ్యమైన గుహలుగా పేరొందాయి. ఎందుకంటే ఇక్కడే గౌతమ బుద్ధుడు మొదటిసారి బౌద్ధ మతానికి సంబంధించిన సమావేశం జరిగింది. అలాగే బుద్ధుడు ఇక్కడ ధ్యానం కూడా చేశాడని ప్రసిద్ధి. ఇవి రాజ్‌గిర్ నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. (Photo Credit : myself/Wikipedia)

​సప్తర్షి, బ్రహ్మాకుండ్..

రాజ్‌గిర్‌లోని మరో ముఖ్యమైన ప్రదేశం సప్తర్షి, బ్రహ్మాకుండ్ అనే వేడి నీటి కొలనులు. ఏడు చిన్న కొలనులనే సప్తర్షి అని పిలుస్తారు. అవన్నీ ఒక పెద్ద కొలనులో కలిసే ప్రదేశాన్ని బ్రహ్మాకుండ్ అంటారు. ఈ కొలనుల్లో స్నానాలు చేస్తే రోగాలు నయమవుతాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. వీటిని గౌతమ బద్ధుడు, మహావీర్ జైనుడు తరచూ సందర్శించేవారని అంటారు. దీంతో ఇవి పవిత్రమైన స్థలాలుగా ప్రసిద్ధిచెందాయి. (Photo Credit: Unsplash)

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.