యాప్నగరం

Foreign Tourist Attractions: ఫారినర్లు తాజ్‌మహల్‌ను కాదని తమిళనాడుకు వెళ్తున్నారు.. అక్కడ అవే ప్రత్యేకం

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహాల్‌ను చూడటానికి ఎంతో మంది పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. అందులో విదేశీయులు సైతం ప్రధాన సంఖ్యలో ఉంటారు. కానీ, గతేడాది ఎక్కువ మంది విదేశీయులు తాజ్‌మహాల్‌ను కాకుండా మహబలేశ్వరంలోని చారిత్రక కట్టడాలను సందర్శించారు.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 20 Oct 2022, 4:21 pm
భారత్‌లో టూరిస్టులు మెచ్చె అన్ని రకాల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. సహజసిద్ధమైన ప్రకృతి అందాల నుంచి ఆశ్చర్యపరిచే ఆహ్లాదకరమైన వాతావరణాల వరకు ఎన్నో చూడముచ్చటైన కేంద్రాలున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చారిత్రక కట్టడాల గురించే. మన దేశంలో వందల ఏళ్ల చరిత్ర ఉండటంతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో కాలంలో ఒక్కో విధమైన నిర్మాణాలు చేపట్టారు. అవన్నీ ఇప్పటికీ టూరిస్టులను ఆకర్షిస్తుంటంతో వాటిని చూడటానికి పెద్ద ఎత్తున ఆసక్తిచూపుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది చాలా మంది విదేశీయులు సైతం భారత్‌లోని పలు చారిత్రక స్థలాలను సందర్శించారు. అందులో ఎక్కువ మంది సందర్శించిన ప్రదేశాలేవో ఇక్కడ తెలుసుకుందాం. (Photos: Unsplash)
Samayam Telugu do you know that most foreigners come to india to visit mahabalipuram monuments than taj mahal
Foreign Tourist Attractions: ఫారినర్లు తాజ్‌మహల్‌ను కాదని తమిళనాడుకు వెళ్తున్నారు.. అక్కడ అవే ప్రత్యేకం



​మహాబలేశ్వరం కట్టడాలు..

తమిళనాడులోని మహాబలేశ్వరానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడి పురాతనమైన రాతి కట్టడాలు, ఆలయాలు, గుహలు, చారిత్రక ప్రదేశాలు ఎవర్ని అయినా ఇట్టే కట్టిపడేస్తాయి. ఈ క్రమంలోనే కరోనా లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత 2021-22 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.45 లక్షల మంది విదేశీ టూరిస్టులు ఈ మహాబలేశ్వరాన్ని సందర్శించారని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల వెల్లడించింది. ‌తాజ్ మహాల్‌ కన్నా లక్ష మందికి పైగా ఇక్కడికే వచ్చారు. (Photo Credit: Unsplash)

​ఆగ్రా తాజ్‌మహల్ అందాలు..

ఇక ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్‌ను గతేడాది చూడటానికి వచ్చిన విదేశీయుల సంఖ్య కేవలం 38,922 మంది మాత్రమేనని తేలింది. అంటే భారత్‌కు వచ్చిన మొత్తం విదేశీ టూరిస్టుల్లో కేవలం 12.21 శాతం మంది మాత్రమే తాజ్‌ను సందర్శించారని స్పష్టంగా అర్థమవుతోంది. అంతకుముందు విదేశీయులు ఎక్కువగా తాజ్‌ను సందర్శించడానికే ఆసక్తి చూపేవారు. (Photo Credit: Unsplash)

​టైగర్ హెడ్ రాక్-కట్ కేవ్..

తమిళనాడులోనే సలవంకుప్పుంలోని టైగర్ హెడ్ రాక్-కట్ టెంపుల్‌ కాంప్లెక్స్‌ను కూడా విదేశీయులు ఎక్కువగా చూశారు. ఇది మహాబలిపురానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అక్కడికి వచ్చిన వారు ఈ టైగర్ హెడ్ రాక్ టెంపుల్ కేవ్‌ను తప్పకుండా సందర్శిస్తారు. ఇవన్నీ ప్రపంచ వారసత్వత సంపదలుగా యునెస్కో గుర్తించడం విశేషం. ఈ కేవ్స్ ఎంట్రన్స్‌లో పులుల తలలు చెక్కడంతో టైగర్ హెడ్ రాక్-కట్ అనే పేరొచ్చింది. (Photo Credit: Ksaravanakumar/Wikipedia)

​విల్లుపురం జింజీ కోట..

తమిళనాడులోని విల్లుపురం జింజీ కోటను కూడా ఎక్కువ మంది సందర్శించారు. 1190 ADలో అనంత కోన్ అనే కోనార్ సంస్థానాధీశులు ఈ కోటను నిర్మించగా తర్వాతి కాలంలో ఇది ఎన్నో పాలకులను చూసింది. ఒకానొక సమయంలో దీన్ని మరాఠా కింగ్ శివాజీ సైతం అద్భుతమైన కోటగా మెచ్చుకున్నారు. అలాంటి ఘన చరిత్ర కలిగిన ఈ కోట ప్రస్తుతం తమిళనాడులోని టాప్ టూరిస్ట్ చారిత్రక కట్టడాల్లో ఒకటిగా నిలిచింది. (Photo Credit: PlaneMad/Wikipedia)

​కన్యాకుమారి వట్టకొట్టాయ్ కోట..

కన్యాకుమారి సముద్ర తీరంలో ఉన్న ఈ వట్టకొట్టాయ్ కోట కూడా ప్రముఖ టూరిస్ట్ స్పాట్లలో ఒకటి. 18వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్ సంస్థానాధీశులు ఈ కోటను నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణంలో బంగాళా ఖాతం, హిందూ మహా సముద్రం, అరేబియన్ సముద్రం కలగలిసిన సంగమంలో ఉంటుంది. (Photo Credit: Kondephy/Wikipedia)

​తిరుమాయం కోట..

తమిళనాడులోని పుదుకొట్టాయ్ జిల్లాలో ఉన్న తిరుమాయం కోటను కూడా ఎంతో మంది సందర్శిస్తుంటారు. దీంతో ఇదీ టాప్ టూరిస్ట్ ప్రదేశంగా పేరు తెచ్చుకుంది. 1687లో విజయ రుఘనాథ సేతుపతి ఈ కోటను నిర్మించారు. ఈ కోటలో పలు హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే, కాలక్రమేణ ఇది కాస్త దెబ్బతినడంతో 2012లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని రినోవేషన్ చేసింది. (Photo Credit: Thiyagarajan/Wikipedia)

​ఆగ్రా ఎర్రకోట..

తర్వాతి స్థానాల్లో ఆగ్రాలోని ఎర్రకోట, దిల్లీలోని కుతుబ్ మినార్, రెడ్‌ఫోర్ట్ ఉన్నాయి. విదేశీ టూరిస్టులు వీటిని చూడటానికి కూడా ఆసక్తి చూపారు. కాకపోతే తమిళనాడులోని చారిత్రక కట్టడాలను సందర్శించిన వారికంటే ఇక్కడికి వచ్చిన పర్యాటకుల సంఖ్య కాస్త తక్కువని తెలిసింది. (Photo Credit: Unsplash)

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.