యాప్నగరం

Domkhar: లద్ధాఖ్‌ ట్రిప్ ప్లాన్ చేస్తే.. ఈ డోమ్‌ఖర్ గ్రామాన్ని అస్సలు మిస్సవ్వకండి..! దాని గురించి తెలిస్తే మీరు తప్పక వెళ్లిపోతారు..!

లేహ్ (Leh Ladakh) జిల్లాలో ఉన్న డోమ్‌ఖర్ (Domkhar Rock Art Sanctuary) అనే గ్రామం భారత దేశంలోని అతి పురాతన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ ఆదిమానవుని కాలం నాటి చిత్రాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆకట్టుకుంటున్నాయి.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 15 Feb 2023, 5:17 pm
లద్ధాఖ్‌లోని లేహ్ జిల్లాలో డోమ్‌ఖర్ అనే అరుదైన గ్రామం ఉంది. ఇది డోమ్‌ఖర్ రాక్ ఆర్ట్ శాంక్చురీకి నిలయం. దీని గురించి బహుశా మనలో ఎవరికీ తెలియకపోవచ్చు. డోమ్‌ఖర్ రాక్ ఆర్ట్ శాంక్చురీ అనేది ప్రీ హిస్టారిక్ కాలానికి చెందిన ఆధునిక శిలాజాత ఫలకాల నిలయం. శిలాజాత ఫలకాలంటే ఏంటని ఆశ్చర్యపోకండి. రాతి ఉపరితలంపై చెక్కిన చిత్రాలనే శిలాజాత ఫలకాలని అంటారు. ఇంగ్లీష్‌లో దీన్ని petroglyphs అని పిలుస్తారు. అయితే, ఆదిమానవుని కాలంలో చాలావరకు కళలన్నీ రాళ్లపై చెక్కిన చిత్రాలే ఉంటాయి. అందులో జంతువులు, మానవులు,వేటాడే దృశ్యాలు, వారు నివాసించే ప్రాంతాలను రాళ్లపై బొమ్మలుగా చిత్రీకరించినవి ఉంటాయి. అలాంటి రాతియుగ చిత్రాల నుండే మనం వారి గురించి, వారి జీవన శైలి గురించి తెలుసుకుంటాము. ఇంతకుముందు మనకు ఇలాంటి ప్రీ హిస్టారిక్ రాతి శిలాఫలకాలంటే మధ్య ప్రదేశ్‌లోని భీంబేట్కా, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాలే గుర్తొచ్చేవి. ఆ జాబితాలో ఈ డోమ్‌ఖర్‌ గ్రామాన్ని కూడా చేర్చవచ్చు. (Photo Credit: Unsplash/Representational Image)
Samayam Telugu rockart-thumb


కాగా, ఈ డోమ్‌ఖర్‌లోని శిలాజాత ఫలకాలు, లిపిలు భారతదేశంలో గొప్పగా సంరక్షించిన కొన్ని క్లస్టర్‌లని చెప్పొచ్చు. ఈ పెట్రోగ్లిఫ్‌లు అందమైన సింధూ నది పక్కనే ఉండటంతో మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటిని చూస్తే.. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే వారు ఇలా నది ఒడ్డున కూర్చొని ఇంత అందంగా రాతి చిత్రాలను ఎలా చెక్కి ఉంటారనే సందేహం కలుగక మానదు. దీంతో ఈ డోమ్‌ఖర్ రాక్ ఆర్ట్ శాంక్చురీని ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ప్రదేశం అని పేర్కొనవచ్చు.ఒకవేళ మీరు ఈ డోమ్‌ఖర్ గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంటే ఆ మార్గంలో అరుదైన దృశ్యాలు చూస్తారు. సింధూ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్లేటప్పుడు కొన్ని కళాకృతులను గమనించాలి.

అప్పుడు మీరు బండరాళ్లపై మతసంబంధిత దృశ్యాల నుండి జంతువుల వరకు, వారు పాటించే సాధనాలు, పనిముట్ల నుంచి జంతువులను వేటాడే చిత్రాల వరకు అన్నింటినీ చూడొచ్చు. అందులో కొన్ని తేలిగ్గా గుర్తించే చిత్రాలు ఉంటే మరికొన్ని గుర్తించలేనివి కూడా ఉన్నాయి. అయితే, అవన్నీ ఆదిమానవుని కాలం నాటికి చెందినవే కావు. కాలక్రమేణా ఈ ప్రాంతంలో బౌద్ధమతం వ్యాపించడంతో కొన్ని మతపరమైన చిత్రాలు కూడా గమనించవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆ రాతి చిత్రాలు సుమారు 5000 సంవత్సరాల కాలం నాటివని తెలిసింది. మరోవైపు ఇలాంటి చిత్రాలు కేవలం డోమ్‌ఖర్‌లోనే కాకుండా బ్రోక్‌పా వ్యాలీలోని దాహ్ గ్రామంలోనూ ఉన్నాయి. వాటిని బాగా గమనిస్తే కొన్ని శిలలు ప్రేమను, కొన్ని వ్యాపార ప్రకటనలను కూడా కలిగి ఉన్నాయి. వాటితో పాటు ఖల్ట్సే, నిమ్ము, ఆల్చి, స్టక్నా వంటి ఆఫ్‌బీట్ ప్రదేశాల్లోనూ ఇలాంటి శిలాజాత ఫలకాలు కనిపిస్తాయి. దీంతో మీరు లద్ధాఖ్ ట్రిప్‌కి వెళ్లాలనుకుంటే ఈ డోమ్‌ఖర్ రాక్ ఆర్ట్ శాంక్చురీని తప్పక సందర్శించండి.

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.