లద్ధాఖ్లోని లేహ్ జిల్లాలో డోమ్ఖర్ అనే అరుదైన గ్రామం ఉంది. ఇది డోమ్ఖర్ రాక్ ఆర్ట్ శాంక్చురీకి నిలయం. దీని గురించి బహుశా మనలో ఎవరికీ తెలియకపోవచ్చు. డోమ్ఖర్ రాక్ ఆర్ట్ శాంక్చురీ అనేది ప్రీ హిస్టారిక్ కాలానికి చెందిన ఆధునిక శిలాజాత ఫలకాల నిలయం. శిలాజాత ఫలకాలంటే ఏంటని ఆశ్చర్యపోకండి. రాతి ఉపరితలంపై చెక్కిన చిత్రాలనే శిలాజాత ఫలకాలని అంటారు. ఇంగ్లీష్లో దీన్ని petroglyphs అని పిలుస్తారు. అయితే, ఆదిమానవుని కాలంలో చాలావరకు కళలన్నీ రాళ్లపై చెక్కిన చిత్రాలే ఉంటాయి. అందులో జంతువులు, మానవులు,వేటాడే దృశ్యాలు, వారు నివాసించే ప్రాంతాలను రాళ్లపై బొమ్మలుగా చిత్రీకరించినవి ఉంటాయి. అలాంటి రాతియుగ చిత్రాల నుండే మనం వారి గురించి, వారి జీవన శైలి గురించి తెలుసుకుంటాము. ఇంతకుముందు మనకు ఇలాంటి ప్రీ హిస్టారిక్ రాతి శిలాఫలకాలంటే మధ్య ప్రదేశ్లోని భీంబేట్కా, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాలే గుర్తొచ్చేవి. ఆ జాబితాలో ఈ డోమ్ఖర్ గ్రామాన్ని కూడా చేర్చవచ్చు. (Photo Credit: Unsplash/Representational Image)
కాగా, ఈ డోమ్ఖర్లోని శిలాజాత ఫలకాలు, లిపిలు భారతదేశంలో గొప్పగా సంరక్షించిన కొన్ని క్లస్టర్లని చెప్పొచ్చు. ఈ పెట్రోగ్లిఫ్లు అందమైన సింధూ నది పక్కనే ఉండటంతో మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటిని చూస్తే.. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే వారు ఇలా నది ఒడ్డున కూర్చొని ఇంత అందంగా రాతి చిత్రాలను ఎలా చెక్కి ఉంటారనే సందేహం కలుగక మానదు. దీంతో ఈ డోమ్ఖర్ రాక్ ఆర్ట్ శాంక్చురీని ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ప్రదేశం అని పేర్కొనవచ్చు.ఒకవేళ మీరు ఈ డోమ్ఖర్ గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంటే ఆ మార్గంలో అరుదైన దృశ్యాలు చూస్తారు. సింధూ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్లేటప్పుడు కొన్ని కళాకృతులను గమనించాలి.
అప్పుడు మీరు బండరాళ్లపై మతసంబంధిత దృశ్యాల నుండి జంతువుల వరకు, వారు పాటించే సాధనాలు, పనిముట్ల నుంచి జంతువులను వేటాడే చిత్రాల వరకు అన్నింటినీ చూడొచ్చు. అందులో కొన్ని తేలిగ్గా గుర్తించే చిత్రాలు ఉంటే మరికొన్ని గుర్తించలేనివి కూడా ఉన్నాయి. అయితే, అవన్నీ ఆదిమానవుని కాలం నాటికి చెందినవే కావు. కాలక్రమేణా ఈ ప్రాంతంలో బౌద్ధమతం వ్యాపించడంతో కొన్ని మతపరమైన చిత్రాలు కూడా గమనించవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆ రాతి చిత్రాలు సుమారు 5000 సంవత్సరాల కాలం నాటివని తెలిసింది. మరోవైపు ఇలాంటి చిత్రాలు కేవలం డోమ్ఖర్లోనే కాకుండా బ్రోక్పా వ్యాలీలోని దాహ్ గ్రామంలోనూ ఉన్నాయి. వాటిని బాగా గమనిస్తే కొన్ని శిలలు ప్రేమను, కొన్ని వ్యాపార ప్రకటనలను కూడా కలిగి ఉన్నాయి. వాటితో పాటు ఖల్ట్సే, నిమ్ము, ఆల్చి, స్టక్నా వంటి ఆఫ్బీట్ ప్రదేశాల్లోనూ ఇలాంటి శిలాజాత ఫలకాలు కనిపిస్తాయి. దీంతో మీరు లద్ధాఖ్ ట్రిప్కి వెళ్లాలనుకుంటే ఈ డోమ్ఖర్ రాక్ ఆర్ట్ శాంక్చురీని తప్పక సందర్శించండి.
కాగా, ఈ డోమ్ఖర్లోని శిలాజాత ఫలకాలు, లిపిలు భారతదేశంలో గొప్పగా సంరక్షించిన కొన్ని క్లస్టర్లని చెప్పొచ్చు. ఈ పెట్రోగ్లిఫ్లు అందమైన సింధూ నది పక్కనే ఉండటంతో మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటిని చూస్తే.. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే వారు ఇలా నది ఒడ్డున కూర్చొని ఇంత అందంగా రాతి చిత్రాలను ఎలా చెక్కి ఉంటారనే సందేహం కలుగక మానదు. దీంతో ఈ డోమ్ఖర్ రాక్ ఆర్ట్ శాంక్చురీని ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ప్రదేశం అని పేర్కొనవచ్చు.ఒకవేళ మీరు ఈ డోమ్ఖర్ గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంటే ఆ మార్గంలో అరుదైన దృశ్యాలు చూస్తారు. సింధూ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్లేటప్పుడు కొన్ని కళాకృతులను గమనించాలి.
అప్పుడు మీరు బండరాళ్లపై మతసంబంధిత దృశ్యాల నుండి జంతువుల వరకు, వారు పాటించే సాధనాలు, పనిముట్ల నుంచి జంతువులను వేటాడే చిత్రాల వరకు అన్నింటినీ చూడొచ్చు. అందులో కొన్ని తేలిగ్గా గుర్తించే చిత్రాలు ఉంటే మరికొన్ని గుర్తించలేనివి కూడా ఉన్నాయి. అయితే, అవన్నీ ఆదిమానవుని కాలం నాటికి చెందినవే కావు. కాలక్రమేణా ఈ ప్రాంతంలో బౌద్ధమతం వ్యాపించడంతో కొన్ని మతపరమైన చిత్రాలు కూడా గమనించవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆ రాతి చిత్రాలు సుమారు 5000 సంవత్సరాల కాలం నాటివని తెలిసింది. మరోవైపు ఇలాంటి చిత్రాలు కేవలం డోమ్ఖర్లోనే కాకుండా బ్రోక్పా వ్యాలీలోని దాహ్ గ్రామంలోనూ ఉన్నాయి. వాటిని బాగా గమనిస్తే కొన్ని శిలలు ప్రేమను, కొన్ని వ్యాపార ప్రకటనలను కూడా కలిగి ఉన్నాయి. వాటితో పాటు ఖల్ట్సే, నిమ్ము, ఆల్చి, స్టక్నా వంటి ఆఫ్బీట్ ప్రదేశాల్లోనూ ఇలాంటి శిలాజాత ఫలకాలు కనిపిస్తాయి. దీంతో మీరు లద్ధాఖ్ ట్రిప్కి వెళ్లాలనుకుంటే ఈ డోమ్ఖర్ రాక్ ఆర్ట్ శాంక్చురీని తప్పక సందర్శించండి.
- Read All Latest Telugu News and Travel News