యాప్నగరం

Punjab Tour: అందమైన పంజాబ్ ఎప్పుడైనా సందర్శించారా.. లేకపోతే అక్కడ ఇవి చూడండి..!

భారత దేశంలోని అరుదైన రాష్ట్రాల్లో పంజాబ్ (Punjab) ఒకటి. మొత్తం ఐదు జీవ నదులతో నిత్యం వ్యవసాయ రంగంలో సుభిక్షంగా ఉండే ఈ అందమైన రాష్ట్రం పలు అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను కూడా కలిగి ఉంది. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్లాలనుకుంటే ఏయే ప్రదేశాలు చూడొచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 5 Jan 2023, 3:08 pm
పచ్చని పొలాలతో, అందమైన ప్రదేశాలతో నిత్యం ఆహ్లాదకరంగా ఉంటూ పర్యాటకుల్ని ఆకర్షించే అద్భుతమైన రాష్ట్రం పంజాబ్ (Punjab Tour). ఇది ఉత్తర భారత దేశంలోని వాయువ్య దిశలో పొరుగు దేశం పాకిస్థాన్కు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ ప్రవహించే సట్లెజ్, బియాస్, రావి, జేలం, చీనాబ్ నదుల కారణంగానే ఈ రాష్ట్రానికి పంజాబ్ అనే పేరొచ్చింది. ఇది దేశంలోని సంపన్నమైన రాష్ట్రాల్లో చిన్నదే అయినప్పటికీ ఉల్లాసవంతమైన, ఉత్కంఠభరితమైన ఆతిథ్యాన్ని అందిస్తుంది. సహజంగా సారవంతమైన నేలలు, సమృద్ధిగా నీటి వనరులు కలిగి ఉండటంతో వ్యవసాయ రంగంలో విశేషమైన గుర్తింపు పొందింది. దేశ ప్రజల ఆహార భద్రతకు తనవంతు సహకారం అందిస్తుంది. అలాంటి గొప్ప రాష్ట్రంలో విహరించాలనుకుంటే ఏయే ప్రదేశాలు సందర్శించవచ్చో చూడండి. (Photo Credit: Unsplash)
Samayam Telugu have you ever been to punjab the land of five rivers
Punjab Tour: అందమైన పంజాబ్ ఎప్పుడైనా సందర్శించారా.. లేకపోతే అక్కడ ఇవి చూడండి..!



స్వర్ణదేవాలయం..

పంజాబ్ అంటే వెంటనే గుర్తొచ్చేది అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం. ఇది సిక్కుల పరమపవిత్ర ప్రదేశం. పంజాబ్ చూడటానికి వచ్చిన వాళ్లు తప్పకుండా చూసేవాటిల్లో ఈ గోల్డెన్ టెంపుల్ ఒకటి.దీన్ని 15వ శతాబ్దంలో సిక్కు గురు రామ్ దాస్ నిర్మించారు. ఇక్కడికి నిత్యం ఎంతో మంది పర్యాటకులు కులమతాలకు అతీతంగా వస్తుంటారు. మీరు కూడా ఈసారి పంజాబ్ వెళితే తప్పక చూసి రావాల్సిందే. (Photo Credit: Unsplash)
Also Read: Tirupati to Ooty Tour: తిరుపతి నుంచి రూ.8,510కే ఊటీ ట్రిప్.. ఆలస్యం చేయకుండా బుక్ చేసుకోండి..!

జలియన్ వాలా బాగ్..

అలాగే అమృత్సర్లోనే స్వర్ణ దేవాలయం సమీపంలో ఉండే జలియన్ వాలా బాగ్ ప్రదేశం కూడా తప్పక సందర్శించాల్సిందే. ఇదో చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశం. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిన అత్యంత విచారకరమైన సంఘటనగా జలియన్ వాలా బాగ్ దురంతం జరిగింది ఇక్కడే. 1919 ఏప్రిల్ 13న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గుమిగూడిన వేలాది మంది ప్రజలపై బ్రిటీష్ జనరల్ డయ్యర్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వందలాది మంది మరణానికి కారకుడయ్యాడు. నాటి తూటాల గుర్తులు ఇప్పటికి అక్కడి గోడలపై కనిపిస్తాయి. (Photo Credit: Unsplash)
Also Read: International Destinations: జనవరిలో అంతర్జాతీయ ట్రిప్ వెళ్లాలనుకుంటే ఈ దేశాలను పరిశీలించండి..!

గురుదాస్‌పూర్..

పంజాబ్లోని మరో ప్రధాన పర్యాటక ప్రదేశం గురుదాస్పూర్. ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనవి డేరా బాబా నానక్, గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్, తడా సాహిబ్, సార్జీ సాహిబ్,ఫతేగర్హ్ చురియాన్, మహాకాళేశ్వర్ టెంపుల్, అచలేశ్వర్ టెంపుల్ ఉన్నాయి. వీటిల్లో ప్రధాన సిక్కు మత గురువులకు సంబంధించిన ఆధ్యాత్మక కేంద్రాలే ఉంటాయి. అవన్నీ చూడటానికి, ప్రశాంతంగా గడపడాటినికి, ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలడానికి బాగుంటాయి. (Photo Credit: Punjab Tourism.gov.in)
Also Read: Jawai: మీ పార్ట్నర్తో జవాయి వెళ్లినప్పుడు.. ఈ విషయాలు అస్సలు మిస్సవ్వద్దు..!

పఠాన్‌కోట్..

పంజాబ్లో చూడాల్సిన మరో పేరుమోసిన నగరం పఠాన్కోట్. ఇది కాంగ్రా, డల్హౌసీ వంటి ప్రముఖ పర్వత శ్రేణుల అంచున ఉండే అందమైన జిల్లా కేంద్రం. మరోవైపు జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ప్రధాన నగరం కూడా ఇదే. పఠాన్కోట్లో అనేక విద్యాసంస్థలు ఉండటంతో జమ్మూ కశ్మీర్తో పాటు హిమాచల్ రాష్ట్రాల్లోని చాలా మంది విద్యార్థులు ఇక్కడే చదువుకుంటారు. దీంతో ఇదో ఎడ్యూకేషనల్ హబ్గానూ పేరుగాంచింది. ఇక్కడ చూడాల్సిన వాటిల్లో చారిత్రక నేపథ్యం ఉన్న నుపుర్ కోట, ముక్తేశ్వర్ ఆలయం, రంజిత్ సాగర్ డ్యామ్, షాపుర్కండి కోట ఉన్నాయి. (Photo Credit: Unsplash)
Also Read: Lakshadweep Islands: లక్షద్వీప్లోని ఆ 17 దీవులకు వెళ్లడం ఇకపై నిషేధం

బాతిండా..

పంజాబ్లోని బాతిండా కూడా అద్భుతమైన నగరం. ఇది పలు చారిత్రక కోటలకు నెలవు. దేశంలోని పురాతన నగరాల్లో ఇదీ ఒకటి. కాలక్రమేణా ఇది అనేక సంస్థానాల్లో భాగమైంది. చివరికి 1754లో పాటియాలా మహారాజ్ దీన్ని చేజిక్కించుకోవడంతో ఆ సామ్రాజ్యంలో కలిసిపోయింది. అయితే, ఇప్పుడు ఇది ఉత్తర భారత దేశంలోని ప్రధాన పారిశ్రామిక నగరంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఆహార ధాన్యాలు, పత్తి ఉత్పత్తులు ప్రధానమైనవి. ఇక పర్యాటక కేంద్రాల విషయానికి వస్తే కిలా ముబారక్, రోజ్గార్డెన్, చేతక్ పార్క్, లాఖీ జంగిల్, బాహియా కోట వంటివి చూడొచ్చు. (Photo Credit: Punjab Tourism.gov.in)
Also Read: Most Beautiful Water Falls: జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన జలపాతాలు ఇవి.. ఎక్కడో తెలుసా?

అట్టారీ-వాఘా-బోర్డర్..

  • ఇక భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉండే అట్టారీ-వాఘా-బార్డర్ పరేడ్ కూడా తప్పక చూడాల్సిందే. అమృత్సర్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశం భారత్-పాకిస్థాన్ మధ్య ప్రధాన సరిహద్దు ప్రాంతం. దీంతో రోజూ సాయంత్రం ఇక్కడ ఇరు దేశాల సైనికాధికారులు అద్భుతమైన పరేడ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి నిత్యం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. మీరు అమృత్సర్కు వెళ్లినప్పుడే ఈ అట్టారీ-వాఘా-బార్డర్ని సందర్శించడం మంచిది. (Photo Credit: Unsplash)

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.