యాప్నగరం

Wild Life Sanctuaries: అక్టోబర్‌లో ఈ పులుల సంరక్షణ కేంద్రాలకు వెళ్లిరండి..!

పర్యాటక ప్రపంచంలో ఎన్ని ప్రదేశాలు చూసినా వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలకు వెళ్లడంలో ఉండే అంత మజా మరెందులోనూ ఉండదు. అక్కడ క్రూర మృగాలు, అడవి జంతువులను చూస్తే ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. అయితే, అక్టోబర్‌లో పలు జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు తిరిగి తెరుచుకోనున్నాయి. వీలైతే దసరా హాలిడేస్‌లో వెళ్లిరండి.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 20 Sep 2022, 10:02 pm
గజిబిజి షెడ్యూల్‌లో మనకు మనం కాస్తంత టైమ్ ఇచ్చుకోవాలి. ఎప్పుడూ ఆఫీస్, ఇల్లు అనేవే కాకుండా మనసుకు ప్రశాంతత కలిగించే పనులు కూడా చేస్తుండాలి. దాంతో మనకు మానసిక ఉల్లాసం కలగడమే కాకుండా నూతనోత్తేజం లభిస్తుంది. దాంతో మళ్లీ మన పనుల్లో వేగం పెరుగుతుంది. అలా కావాలంటే ఎవరైనా విరామం దొరికితే ఏదైనా పర్యాటక ప్రదేశాలకు వెళితే సరి. అందులోనూ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేదా టైగర్ రిజర్వ్ ఏరియాలకు వెళ్లొస్తే ఇంకాస్త రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్‌లో కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో అవేంటో మనం ఓ లుక్కేద్దాం.
Samayam Telugu safariride


కాన్హా టైగర్ రిజర్వ్..
మధ్య ప్రదేశ్‌లోని కాన్హా టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. స్వచ్ఛమైన అటవీ వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే. ఇది టైగర్ రిజర్వ్ కావడంతో పులులను కూడా దగ్గరి నుండి చూసే వీలు కలుగుతుంది. అలాగే ఇక్కడ అందమైన పక్షులు కూడా చూడొచ్చు. ఈ కన్హా జాతీయ పార్క్ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ కొన్ని గోండు జాతి గ్రామాలుంటాయి. అవి కూడా చూస్తే బాగుంటుంది.

బంధవ్‌గర్హ్ నేషనల్ పార్క్..
మధ్యప్రదేశ్‌లోనే మరో జాతీయ పార్క్ బంధవ్గర్హ్ నేషనల్ పార్క్. ఇది విస్తీర్ణంలో చాలా చిన్నదే అయినా ఇక్కడ పులుల సంఖ్య గణనీయంగా ఉంది. కాబట్టి మీరు ఇక్కడికి వెళ్తే పులులను చూసే అవకావం మెండుగా ఉంటుంది. ఈ పార్క్‌లో అధిక భాగం రాతి భూభాగం ఉంటుంది. కాబట్టి మీరు ప్రయాణించేటప్పుడు కాస్త శ్రమ పడక తప్పదు.

రణతంబోర్ నేషనల్ పార్క్..
రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌ గతంలో రాజులకు వేట ప్రదేశంగా ఉండేది. ఇప్పుడది జాతీయ పార్క్‌గా కొనసాగుతోంది. ఇక్కడ మీరు పులులను కూడా చూడొచ్చు. అలాగే సమీపంలోని రణతంబోర్
కోట, పదమ్ తలావ్ సరస్సును కూడా చూసి రావచ్చు. ఈ జాతీయ ఉద్యానవనంలో సఫారీ రైడ్ చేస్తే మంచి అనుభూతి పొందుతారు. ఇక్కడ కచ్చితంగా పులలను చూసే అవకాశం ఉంటుంది.

మనాస్ నేషనల్ పార్క్..
అస్సాంలోని మనాస్ నేషనల్ పార్క్ సైతం మంచి పర్యాటక ప్రదేశం. ఇక్కడ కూడా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉండటంతో పర్యాటకులు బాగానే వస్తుంటారు. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడ అరుదైన జంతువులతో పాటు పులులు, ఇండియన్ రైనోలను కూడా చూడొచ్చు. ఇక్కడకు వివిధ రకాల అందమైన పక్షులు కూడా వస్తాయి.

పెంచ్ నేషనల్ పార్క్..
మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెంచ్ నేషనల్ పార్క్ కూడా అందమైందే. ఇక్కడ పులులు, ఇతర జంతువుల సంఖ్య గణనీయంగానే ఉంటుంది. ఇదో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అనేక అరుదైన జంతువులకు నిలయంగా ఉంది. ఇక్కడ వన్యప్రాణులను చూడటానికి చాలా మంది జంతు ప్రేమికులు వస్తుంటారు.

Read all Latest Telugu News and Travel News
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.