యాప్నగరం

Haunted Places: మీరు ధైర్యవంతులైతే ఈ స్పూకీ ప్రదేశాలకు వెళ్లండి..!

చాలా మంది ధైర్యవంతులకు భయంకరమైన ప్రదేశాలకు వెళ్లాలనే ఆశ ఉంటుంది. అలాంటివారికోసమే ఈ సమాచారం. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కొన్ని చిత్రవిచిత్రమైన ప్రదేశాల గురించి వివరించాం.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 7 Dec 2022, 1:48 pm
మరికొద్ది రోజుల్లో 2022 ముగియబోతోంది. కొత్త సంవత్సరం వేళ ఏదైనా ఆసక్తికరమైన ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నట్లు అయితే ఇక్కడ చెప్పిన విచిత్రమైన ప్రదేశాలను చుట్టేయండి. అవి మీకు ఆసక్తికరంగా ఉండటమే కాకుండా భయంకరమైన కథలను కూడా అందిస్తాయి. దాంతో మీ ట్రిప్ ఎప్పటికీ మర్చిపోలేని ప్రత్యేక అనుభూతికి గురి చేసే అవకాశం ఉంది. అయితే, ఆయా ప్రదేశాలకు వెళ్లేముందు వాటి గురించి కొంత సమాచారం తెలుసుకోవడం మంచిది. వీటి గురించి చాలా కాలంగా ప్రచారంలో ఉన్న కథలను తెలుసుకోవడం ద్వారా మీకు కాస్త అయినా అవగాహన ఉంటుంది. (Photo Credit: Unsplash)
Samayam Telugu if you are interested to visit hauted places in india here you go
Haunted Places: మీరు ధైర్యవంతులైతే ఈ స్పూకీ ప్రదేశాలకు వెళ్లండి..!



​లంబి దేహార్ మైన్స్, ముస్సోరి..

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి సమీపంలో ఉండే లంబి దేహార్ మైన్స్‌ ఆసక్తికరమైన ప్రదేశం. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ మైనింగ్ చేసేటప్పుడు సుమారు 50 వేల మంది ప్రమాదవ శాత్తూ మరణించారని అంటారు. అది నిజమో కాదో కచ్చితమైన సమాచారం లేకపోయినా స్థానికులు మాత్రం ఈ లంబి మైన్స్‌కు వెళ్లొద్దని అంటారు. అక్కడ చినిపోయిన వారి ఆత్మలు తిరుగుతాయని, పలు యాక్సిడెంట్లు కూడా అయ్యాయని చెబుతారు. (Photo Credit: Unsplash)

​కుల్ధారా, జైసల్మేర్..

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న కుల్ధారా అనే గ్రామం కూడా విచిత్రమైన ప్రదేశంగా పేరుగాంచింది. ఒకప్పుడు ఇక్కడ సిరి సంపదలతో బాగా బతికిన ప్రజలు రెండు శతాబ్దాల క్రితం ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయారట. అలా ఎందుకు చేశారనేదానికి ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. కానీ, ఆ గ్రామంలోని ఇళ్లని శిథిలాలుగా మారిపోయి ఇప్పుడు హాంటెడ్‌ ప్లేస్‌గా ప్రసిద్ధి చెందింది. (Photo Credit: Unsplash)

Also Read: Ladakh: -30 డిగ్రీల చలిని అనుభవించాలంటే .. లద్ధాఖ్‌లో ఈ ప్రదేశాలు తెరిచే ఉంటాయి

​డుమాస్ బీచ్, సూరత్..

గుజరాత్‌లోని సూరత్‌ నగరానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న డుమాస్ బీచ్ దేశంలోని హాంటెడ్ ప్రదేశాల్లో ఒకటి. ఈ బీచ్‌కు వచ్చే చాలా మంది పర్యాటకులు చుట్టూ ఎవరూ లేకపోయినా తమకు గుసగుసలు వినిపించాయని అంటారు. అయితే, ఒకప్పుడు ఈ బీచ్ హిందూ శ్మశాన వాటిక అని, ఇక్కడ క్షుద్రపూజలు కూడా చేస్తారని అంటారు. అందుకే ఆ బీచ్ కూడా నల్లగా ఉంటుందని స్థానికులు వివరిస్తారు. (Photo Credit: Unsplash)

​అలియా లైట్స్, సుందర్బన్..

ఒక్కోసారి వెలుతురు కూడా మనుషుల్ని భయపెడుతుందంటే నమ్ముతారా? అలాంటి ప్రదేశమే పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్స్ మడ అడవులు. ఇది మొత్తం చిత్తడి నేల కావడంతో అటు వైపు వెళ్లే మత్స్యకారులు ఒక్కోసారి ఎక్కడి నుంచో వచ్చే వెలుతురును చూసి భయపడుతుంటారు. వీటిని ఘోస్ట్ లైట్లు లేదా అలేయా లైట్లు అని పిలుస్తారు. (Photo Credit: Unsplash)

Also Read: Tips for Women: మహిళా పర్యాటకులు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..!

​రూప్‌కుండ్, ఉత్తరాఖండ్..

ఉత్తరాఖండ్‌ హిమాలయాల్లో ఉన్న రూప్‌కుండ్ అనే అందమైన సరస్సు కూడా భయంకరమైనదిగా పేరుగాంచింది. సముద్రమట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉండే ఈ సరస్సుకు అస్థిపంజరాల సరస్సు అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ సరస్సు అడుగుభాగంలో అనేక శవాలు ఉన్నాయని గతంలో కనుగొనడం గమనార్హం. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ అస్థిపంజరాలన్నీ ఒకే కాలానికి చెందినవి కావని అంటారు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల వారు ఆ సరస్సును మిస్టరీగా భావిస్తారు. (Photo Credit: Unsplash)

​రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్..

ఇక హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం రామోజీ ఫిల్మ్ సిటీకి కూడా హాంటెడ్ ప్లేస్ అనే పేరుంది. నిజాంల కాలంలో ఇది యుద్ధ భూమిగా ఉండేదని, దీంతో ఇక్కడ అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెబుతారు. ఆ ప్రదేశంలోనే ఫిల్మ్ సిటీ నిర్మాణం చేపట్టారని అంటారు. దీంతో ఒక్కోసారి అక్కడ వింత సంఘటనలు జరుగుతుంటాయనే ప్రచారం కూడా ఉంది. (Photo Credit: Unsplash)

నోట్: ఇక్కడ చెప్పిన కథలన్నీ నిజమో కాదో స్పష్టమైన సమాచారం లేదు. కేవలం ప్రచారంలో ఉన్న విషయాలను మాత్రమే ప్రస్తావించడం జరిగింది. దయచేసి పాఠకులు ఈ విషయం గుర్తించగలరు.

Also Read: Chandipur Beach: ఈ బీచ్ గురించి తెలిస్తే వెళ్లకుండా ఉండలేరు.. కళ్లముందే మాయమైపోతుంది..!

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.