యాప్నగరం

Madhya Pradesh Tour: మధ్య ప్రదేశ్ వెళ్లాలనుకుంటే ఇప్పుడే వెళ్లండి.. అక్కడ ఏం జరుగుతుందో చూడండి..!

మీరు స్నేహితులతో మధ్య ప్రదేశ్ పర్యటనకు (Madhya Pradesh Tour) వెళ్లాలనుకుంటే ఇప్పుడే వెళ్లిపోండి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రెండు వార్షిక ఉత్సవాలు జరుగుతుండగా వచ్చే నెల మరో వార్షిక వేడుక జరగనుంది. దీంతో మీరు ఆ రాష్ట్రాన్ని సందర్శించడానికి ఇదే మంచి సమయం.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 7 Jan 2023, 3:49 pm
దేశంలోని ఆఫ్బీట్ డెస్టినేషన్లలో ఒకటి మధ్య ప్రదేశ్. ఇక్కడ ప్రపంచ వారసత్వ ప్రదేశాల నుంచి సుప్రసిద్ధమైన దేవాలయాల వరకు అన్ని రకాల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.దీంతో ఇక్కడికి నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అలాగే ఇక్కడ పలు వార్షిక మహోత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయని పేరుంది. దీంతో వాటిని చూడటానికి కూడా టూరిస్టులు ఆసక్తిచూపుతారని అంటారు. ప్రస్తుతం మధ్య ప్రదేశ్లో రెండు వార్షిక మహోత్సవాలు జరుగుతుండగా ఫిబ్రవరిలో మరొకటి జరగనుంది. దీంతో మీరు మధ్య ప్రదేశ్ పర్యటనకు వెళ్లాలనుకుంటే ఇదే మంచి సమయం అని చెప్పొచ్చు. మరింత సమాచారం కోసం ఇది చదవండి. (Photo Credit: Unsplash)
Samayam Telugu if you want to visit madhya pradesh then this is the best time to go for
Madhya Pradesh Tour: మధ్య ప్రదేశ్ వెళ్లాలనుకుంటే ఇప్పుడే వెళ్లండి.. అక్కడ ఏం జరుగుతుందో చూడండి..!



రెండు నెలల్లో మూడు ఉత్సవాలు..

మధ్యప్రదేశ్లో ఈ నెలలో రెండు ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. అందులో ఒకటి మండు ఫెస్టివల్ కాగా రెండోది స్కైడైవింగ్ ఫెస్టివల్. అలాగే వచ్చేనెల ఫిబ్రవరిలో చందేరి మహోత్సవ్ కూడా జరగనుంది. దీంతో మీరు మధ్యప్రదేశ్కు విహారయాత్రలకు వెళ్లాలనుకుంటే ఇదే మంచి సమయం. (Photo Credit: Unsplash)
Also Read: Gurudongmar Lake: ఇదో ప్రత్యేకమైన సరస్సు.. ఏడాదిలో 6 నెలలు గడ్డకట్టుకుపోయినా..

ఇప్పటికే ఉజ్జయినిలో స్కైడైవింగ్..

ఇప్పటికే ఉజ్జయినిలో స్కైడైవింగ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. నేటి నుంచి 4 రోజుల పాటు మండు ఫెస్టివల్ కూడా జరగనుంది. దీంతో ఈ సమయంలో మధ్య ప్రదేశ్ని సందర్శిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇది మండు నాలుగో వార్షిక మహోత్సవం కావడం గమనార్హం. మండు చారిత్రక వారసత్వాన్ని ఆధునిక చైతన్యంతో మిళితం చేయడమే ఈ మండు ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం. (Photo Credit: Unsplash)

Also Read: North India: గజగజా వణికిపోతున్న ఉత్తర భారతం.. ఇప్పుడు అక్కడికి వెళ్లకపోవడమే మంచిది..!

పర్యాటకులకు కనుల విందే..

ఈ వార్షిక కార్యక్రమంలో పర్యాటకులు పలు ఆసక్తికరమైన ప్రదర్శనలు ఆస్వాదించే వీలుంటుంది. అందులో సాంస్కృతిక కార్యక్రమాలు, సాహస పోటీలు, కళల ప్రదర్శనలు, వర్క్షాప్లు, ఆర్ట్ గ్యాలరీలు, కవితా పఠనం వంటి వివిధ రకాల ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి. దీంతో టూరిస్టులు ఒకే ఫెస్టివల్లో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్లు ఎంజాయ్ చేయొచ్చు. (Photo Credit: Unsplash
Also Read: Vijayawada-Shirdi Package: ఐఆర్సీటీసీ 3 రాత్రులు, 4 రోజులు విజయవాడ - షిర్డి ప్యాకేజీ..

మండు కూడా ఓర్చా లాగే..

మరోవైపు మండు కూడా ఓర్చా లాగే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో తాత్కాలిక జాబితాలో షార్ట్లిస్ట్ అయ్యింది. దీంతో ఇదో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందనుంది. ఈ మండూ ఫెస్టివల్పై స్పందించిన మధ్య ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శియో శేఖర్ శుక్లా.. మండు ఫెస్టివల్కు 2000 మందికి పైగా సందర్శకులు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా మధ్య ప్రదేశ్ టూరిజం రంగాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయడానికి ఇదో మంచి అవకాశం అని చెప్పారు. (Photo Credit: Unsplash)

Also Read: IRCTC Hyderabad - Rajasthan Package: తక్కువ ధరకే హైదరాబాద్ - రాజస్థాన్ టూర్ విమాన ప్యాకేజీ..

ఎప్పటిలాగే ఈసారి కూడా..

ఎప్పటిలాగే ఈసారి కూడా పలువురు సంగీత విధ్వాంసులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారని, సుప్రసిద్ధ కళాకారులు సైతం ప్రదర్శనలు చేయబోతున్నారని తెలిసింది. ఇందులో స్థానిక తెగల కళాకారులు కూడా పాల్గోనున్నారు. అలాగే ఈ ఉత్సవాల్లో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, సాంస్కృతిక ప్రదర్శనలు, సైక్లింగ్ టూర్, సాహస క్రీడలు, గ్రామీణ పర్యాటకం, స్థానిక కళాకారులచే సాంప్రదాయ, జానపద నృత్య ప్రదర్శనలు ఉంటాయని సమాచారం. (Photo Credit: Unsplash)


రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.