యాప్నగరం

IRCTC Tourism: వారణాసికి కొత్త రైలు ప్రారంభిస్తున్న ఐ‌ఆర్‌సి‌టి‌సి... ఎక్కడి నుంచి అంటే

ఐ‌ఆర్‌సి‌టి‌సి ప్రయాణికులకు మరో ఆసక్తికరమైన రైలు ప్రయాణాన్ని అందిస్తుంది. ఇందులో మీకు నచ్చిన ప్యాకేజీను ఎంపిక చేసుకుని వారణాసికి ఓ అందమైన రైలు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

Samayam Telugu 15 Feb 2020, 8:44 am
భారతదేశ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఐ‌ఆర్‌సి‌టి‌సి మూడవ కొత్త రైలును ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనికి కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్ అని నామకరణం చేసారు. ఇది కాశీ (వారణాసి) - మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ నగరం మధ్య నడుస్తుంది. ఫిబ్రవరి 16, 2020న ఈ రైలును వారణాసి నుండి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 20 నుంచి కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్ నిరంతర సేవలు ప్రారంభమవుతాయి.
Samayam Telugu irctc to launch kashi mahakal express from varanasi and indore on feb 16
IRCTC Tourism: వారణాసికి కొత్త రైలు ప్రారంభిస్తున్న ఐ‌ఆర్‌సి‌టి‌సి... ఎక్కడి నుంచి అంటే


వార్తా నివేదికల ప్రకారం... ఐ‌ఆర్‌సి‌టి‌సి లక్నో - న్యూ ఢిల్లీ మధ్య, అహ్మదాబాద్ - ముంబై మధ్య రెండు కార్పొరేట్ తేజస్ రైళ్లను నడుపుతుంది. తాజాగా ఈ జాబితాలోకి కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్ కూడా చేరనుంది.

Read Also: రూ.15320కే ఐ‌ఆర్‌సి‌టి‌సి మహాశివరాత్రి నవ జ్యోతిర్లింగాల యాత్ర

కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్ ఓంకారేశ్వర్ (ఇండోర్ దగ్గర), మహాకాలేశ్వర్ (ఉజ్జయిని), కాశీ విశ్వనాథ్ (వారణాసి) జ్యోతిర్లింగాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. ఇది ఇండోర్ & భోపాల్ లను కూడా కలుపుతుంది. ఈ రైలు వారణాసి - ఇండోర్ మధ్య వారానికి మూడు రోజులు ఉజ్జయిని, సంత్ హిరద్ నగర్ (భోపాల్), కాన్పూర్, బినా, ఝాన్సి, లక్నో/ప్రయాగ్ రాజ్ & సుల్తాన్ పూర్ ల గుండా ప్రయాణిస్తుంది.

ఐ‌ఆర్‌సి‌టి‌సి వెబ్ సైట్, అలాగే దాని అధికారిక రైల్ యాప్ ద్వారా కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్ కు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. మీరు ప్రయాణించాలనుకునే తేదీకు 120 రోజుల ముందుగా కూడా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో కేవలం జనరల్ & విదేశీ టూరిస్ట్ కోటా మాత్రమే ఉంటాయి. మొదటి ట్రిప్ బుకింగ్ ను చార్ట్ సిద్ధమైన తరువాత (4 గంటల నుంచి 5 నిమిషాలు) రైలు బయలు దేరడానికి ముందు ప్లాట్ ఫామ్ పైనే బుక్ చేసుకునే అవకాశం ఉంది.

Read Also: సంగీతం వినిపించే హంపి విట్టల ఆలయ స్తంభాలు

ఇందులో ప్రయాణికులకు మరో అవకాశం కూడా ఉంది. మీరు ఏదైనా కారణాలతో మీ టిక్కెట్ ను రద్దు చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులకు, కన్ఫార్మ్ టిక్కెట్ కలిగిన ప్రయాణికులు ఇద్దరికి కూడా పూర్తి డబ్బు ఆటోమేటిక్ గా రిఫండ్ చేయబడుతుంది.

ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికుల మత పరమైన మనోభావాలకు గౌరవమిస్తూ కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్ ద్వారా వివిధ మతపరమైన ప్రదేశాలను, పర్యాటక ప్రదేశాలను కూడా అదనంగా కవర్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం ఓంకారేశ్వర్, మహాకాలేశ్వర్, సాంచి, ఉజ్జయిని, భీంబెట్కా, అయోధ్య, ప్రయాగ్ సహా రైలు పరిధిలో ఉన్న నగరాలు, మతరపరమైన ప్రదేశాల టూర్ ప్యాకేజీలను కూడా ఐ‌ఆర్‌సి‌టి‌సి తయారు చేస్తుంది.

ఉత్తర్ ప్రదేశ్ - మధ్య ప్రదేశ్ మధ్య అనేక పర్యాటక, మతపరమైన, వాణిజ్య ప్రదేశాలకు అద్భుతమైన టూర్ ప్యాకేజీ ఎంపికలను ప్రయాణికులకు అందిస్తూ... పూర్తి సేవలతో ఓవర్ నైట్ ట్రిప్ ను కల్పించే మొదటి ప్యాసింజర్ రైలు గా కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్ తనదైన రికార్డును నమోదు చేసేందుకు సిద్ధమవుతుంది.

Read Also: ఈ భవనంలో ఎంతో మంది చనిపోవాలని కోరుకుంటారు... ఎందుకంటే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.