యాప్నగరం

లాక్ డౌన్ ఎఫెక్ట్: లైవ్ లోనే అమ్మవారి నవరాత్రి దర్శనాలు

పవిత్ర చైత్ర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారత దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో అమ్మవారి ఆరాధనలను భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆన్ లైన్ ప్రసారాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు.

Samayam Telugu 28 Mar 2020, 2:14 pm
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా అన్ని దేవి శక్తి పీఠాలు మూసివేయబడినందున ప్రస్తుతం జరుగుతున్న చైత్ర నవరాత్రి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా మారాయి. దేవత యొక్క ప్రత్యేక నవరాత్రి ఆచార ఆరాధనలను అంతర్గతంగా ఆలయంలో పూజారులు నిర్వహిస్తున్నప్పటికీ, అమ్మవారి దర్శనాన్ని ఆశించిన భక్తులు మాత్రం తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
Samayam Telugu చైత్ర నవరాత్రి


నవ, రాత్రి అనే రెండు పదాల సమ్మేళనం 'నవరాత్రి'. అమ్మవారికి ఎంతో వైభవంగా నిర్వహించే 9 రాత్రుల వేడుక ఇది. సిద్ధాంతపరంగా ప్రతి ఏటా కాలానుగుణంగా నాలుగు నవరాత్రులు వస్తాయి. వాటిలో చైత్ర నవరాత్రి, శరద్ నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మిగతా రెండూ గుప్త నవరాత్రులు.

చైత్ర నవరాత్రి సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ మాసాల్లో వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల చైత్రం. అందుకే ఈ మాసంలో వచ్చే నవరాత్రిని చైత్ర నవరాత్రి అని పిలుస్తారు. నవరాత్రి సమయంలో మొత్తం తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. శరద్ నవరాత్రి సమయంలో అనుసరించే చాలా ఆచారాలు చైత్ర నవరాత్రి సమయంలో కూడా అనుసరించబడతాయి. ఈ సంవత్సరం చైత్ర నవరాత్రి 2020 మార్చి 25 నుండి ప్రారంభమై 2020 ఏప్రిల్ 2 తో ముగుస్తుంది.

Read Also: ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర ఆసక్తికర విషయాలు

అయితే దేశంలో లాక్ డౌన్ కారణంగా ఆలయాలను దర్శించే అవకాశం ప్రస్తుతం ప్రజలు లేదు. అమ్మవారి దర్శనానికి భక్తులు రాలేనందున, అమ్మవారినే భక్తుల వద్దకు తీసుకు వెళ్లేందుకు ఇప్పుడు అనేక దేవాలయాలు దేవత ఆరాధన, దర్శనం యొక్క ప్రత్యక్ష్య ప్రసారలను అందిస్తున్నాయి. కనీసం ఇలా అయినా అమ్మవారి దర్శనం జరగడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

భారత దేశంలో భక్తులు అత్యధికంగా సందర్శించే జమ్మూలోని కత్రా త్రికూట పర్వతంపై ఉన్న ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి గుహాలయంలో రోజు వారీ ఆరాధన, ప్రత్యేక ఆచారాలు, అక్కడి దేవతా విగ్రహాలను ప్రత్యక్ష్య ప్రసారం ద్వారా భక్తులకు చూపిస్తున్నారు.

మరో వైపు మైహార్ పట్టణంలో ఉన్న దేవి శారదా ఆలయంలో కూడా అమ్మవారిని మొబైల్స్ లేదా ల్యాప్ టాప్ లలో దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. కరోనా వైరస్ వ్యాప్తిన నియంత్రించడానికి మైహార్ ఆలయ పరిపాలన విభాగం ఈ సీజన్లో నిర్వహించాల్సిన నవరాత్రి ఉత్సవాన్ని రద్దు చేసింది.

Read Also: తిరుమల వెళ్లాక ఇవి చూసే వస్తున్నారా?

మైహార్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మీడియాతో మాట్లాడుతూ... అమ్మవారి దర్శనం భక్తులకు లభించేలా చూసేందుకు ప్రత్యక్ష్య ప్రసారాన్ని అనుమతించినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ సుమార 2000 మంది ఆలయ అధికారిక వెబ్ సైట్ లో ఈ ప్రసారాన్ని చూసినట్లు వివరించారు. ఇప్పటి వరకూ మైహార్ జిల్లాలో ఏ వ్యక్తికి కరోనావైరస్ పాజిటివ్ గా నమోదు కాలేదు.

అదే విధంగా ఉనా జిల్లాలోని అధికారులు కూడా దేవి చింతపూర్ణికు చైత్ర నవరాత్రి మేళా సందర్భంగా నిర్వహించే హారతిని ఆన్ లైన్ లో భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 9 ప్రధాన శక్తిపీఠాల్లో చింతపూర్ణి ఆలయం ఒకటి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.