యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: ముంబైలో మూతపడిన సిద్ధివినాయక్ ఆలయం

కరోనావైరస్ ప్రభావం దేశంలోని అన్ని ఆలయాలను తాకింది. దక్షిణ భారతదేశంలో ఇప్పటికే చాలా ఆలయాల్లో భక్తుల రాకను నిషేధించగా తాజాగా ఆ జాబితాలోకి ముంబైలో ప్రముఖ సిద్ధి వినాయక్ ఆలయం కూడా చేరింది.

Samayam Telugu 18 Mar 2020, 6:15 pm
రోజు రోజుకూ భారత్ లో కూడా కరోనావైరస్ కేసులు అధికంగా వెలుగు చూస్తున్న నేపధ్యంలో ముంబైలో ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని కూడా మూసివేసారు. ప్రజలు అత్యధికంగా సందర్శించే ఆలయాల్లో ఇది ఒకటి. ప్రతి రోజూ అనేక మంది సందర్శకులను ఆకర్షించే ఈ ఆలయంలో భక్తుల సమూహాలను నిరోధించేందుకు, తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu సిద్ధి వినాయక ఆలయం


దీనికి ముందు ఆలయ పరిపాలన విభాగం వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలను కూడా తీసుకుంది. కానీ ఇప్పుడు తదుపరి నోటీసు ఇచ్చే వరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

సిద్ధి వినాయక్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఆదేశ్ బండేకర్ మీడియాతో మాట్లాడుతూ... ఆలయాన్ని సందర్శించే భక్తులందరికీ శానిటైజర్లు అందిస్తున్నామని, ప్రతి 30 నిమిషాలకు ప్రజలు క్యూలలో ఉన్నప్పుడు పట్టుకునే రైలింగ్ లు కూడా శుభ్రం చేయబడుతున్నాయని చెప్పారు. కరోనావైరస్ వ్యాప్తి జరగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, సెక్యూరిటీ గార్డులకు కూడా మాస్క్ లు అందించామని ఆయన అన్నారు. సిద్ధి వినాయక్ ను దర్శించుకునేందుకు ప్రతి రోజూ వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తారు కాబట్టి ఈ సమయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆలయ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read Also: ఇండియాలో 52 కరోనావైరస్ టెస్టింగ్ సెంటర్ల జాబితా

కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా మత ప్రదేశాలలో రద్దీ లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఇదివరకే జిల్లా కలెక్టర్లకు సూచించారు. అయితే ఆరాధన మాత్రం కొనసాగించవచ్చు. అదే విధంగా ముంబైలో జరిగిన సమీక్ష సమావేశం తరువాత కూడా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అనేక సార్లు ప్రకటించారు. సమావేశాలు లేదా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించవద్దని ప్రజలను ఆదేశించారు.

ప్రస్తుతానికి మహారాష్ట్ర గరిష్ట సంఖ్యలో కరోనావైరస్ కేసులను వ్యవహరిస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి మరియు ప్రజలు భయపడకుండా ఉండడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంటువ్యాధి చట్టాన్ని కూడా ప్రారంభించింది.

కరోనావైరస్ తో పొంచి ఉన్న ముప్పు కారణంగా సిద్ధి వినాయక్ ఆలయాన్ని తాజాగా మూసి వేసారు. అదే విధంగా మహారాష్ట్రలోని ప్రముఖ ప్రదేశమైన షిర్డీ, కేరళలోని శబరిమల వద్ద కూడా ఆలయ అధికారులు భక్తులను తమ సందర్శనలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు.

Read Also: కరోనావైరస్ లేని దేశాలు ఇవే... ఓ లుక్కెయ్యండి

తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకూ కరోనా వైరస్ కేసులు 2 లక్షలు దాటగా, అందులో 8 వేలకు పైగా మరణాలు సంభవించాయి. 82 వేల మంది వరకూ కోలుకున్నారు. భారత్ లో మొత్తం 152 కేసులు నమోదు కాగా అందులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. 14 మంది కోలుకున్నారు. ఈ నేపధ్యంలో ప్రజలు సమూహాలుగా ఏర్పడవద్దని, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.