యాప్నగరం

Maha Shivarathri 2023: మహా శివరాత్రికి ఈ ఆలయాలను సందర్శించడానికి చూడండి.. ఇవన్నీ చారిత్రక నేపథ్యం కలిగినవి..!

మహా శివరాత్రి (Maha Shivarathri 2023) సందర్భంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న పలు శివాలయాల గురించి తెలుసుకుందాం. వీలైతే వెళ్లి ఆయా ఆలయాల్లోని స్వామి వారిని దర్శించుకోడానికి చూడండి.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 17 Feb 2023, 12:07 pm
అన్ని పండుగల్లాగే మహా శివరాత్రి (Maha Shivarathri 2023) కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. రోజంతా ఉపవాస దీక్షలు పాటించి పరమశివుని భక్తితో కొలుస్తారు. ఆ పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి పండ్ల రూపంలో నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రంతా జాగారం చేసి ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతారు. ఇక ఆలయాలన్నీ తెల్లవారుజాము నుంచే శివనామస్వరణంతో మార్మోగిపోతాయి. అలా రోజంతా ఎటు చూసినా పండుగ వాతావరణంతో సందడిగా ఉంటుంది. అయితే, ఈ శివరాత్రికి మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఈ ఆలయాలను సందర్శించండి. అక్కడ శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. (Photo Credit: Unsplash)
Samayam Telugu shiva temples which are famous and should be visited on mahashivarathri
Maha Shivarathri 2023: మహా శివరాత్రికి ఈ ఆలయాలను సందర్శించడానికి చూడండి.. ఇవన్నీ చారిత్రక నేపథ్యం కలిగినవి..!


ఉమామహేశ్వర ఆలయం..

నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ గ్రామ శివారులో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయం తప్పక సందర్శించాల్సిన శైవక్షేత్రం. ఇది హైదరాబాద్-శ్రీశైలం వెళ్లే రహదారిలో ఘాట్‌ రోడ్డుపైకి వెళ్లే సమయంలో అచ్చంపేట వైపు ఉండే రహదారిలో ఉంటుంది. ఈ ఆలయాన్ని మౌర్య చంద్ర గుప్తుల పాలనలో నిర్మించారు. అలాగే ఇక్కడ కొండల నుండి వచ్చే నీరు చల్లగా, మధరంగా ఉంటాయి. ఏడాది పొడవునా ఇక్కడ నీరు ప్రవహించడం విశేషం. దీంతో ఇది తప్పక చూడాల్సిన శివాలయంగా ప్రత్యేకత సాధించింది. (Photo Credit: Naidugari Jayanna/Creative Commons Attribution)

రాజన్న ఆలయం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడలోని రాజన్న దేవాలయం తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి. ఇది తెలంగాణ వారికి దక్షిణ కాశీగా పేరొందింది. ఇక్కడ శివరాత్రి సందర్భంగా సుమారు 3 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం గమనార్హం. ఈ ఆలయాన్నిచాళుక్యుల కాలంలో నిర్మించారు. అలాగే శివరాత్రికి ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీరు ఈసారి ఈ ఆలయాన్ని సందర్శించడానికి చూడండి. (Photo Credit: rajannasircilla.telangana.gov.in)

రామప్ప ఆలయం..

కాకతీయుల కాలంలో నిర్మించిన అతిగొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒకటి ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం. దీన్ని కాకతీయుల పాలకుడైన గణపతి దేవుడు క్రీస్తు శకం 1,213లో నిర్మించారు. 2021లో ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా దక్కడం విశేషం. దీంతో ఇది చారిత్రకమైన ప్రదేశంగా గుర్తింపు దక్కించుకుంది. ఈ ఆలయంలో శివారత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. మీరు ఈసారి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. (Photo Credit: Creative Commons Attribution)

ఛాయా సోమేశ్వర ఆలయం..

నల్గొండ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాన్‌గల్‌లోని ఛాయా సోమేశ్వరాలయం కూడా చారిత్రక నేపథ్యం కలిగింది. పదో శతాబ్దంలో కందూరు చోడులు అనే రాజ వంశస్థులు ఈ ప్రాంతాన్ని పాలించిన సందర్భంలో సోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. అయితే, ఇక్కడొక ప్రత్యేకత ఉంది. గర్భగుడిలోని శివలింగం వెనుక సూర్యరష్మితో సంబంధం లేకుండా లింగాకార నీడ దర్శనమిస్తుంది. అది ప్రత్యక్షంగా చూస్తే ఆశ్చర్యమేస్తుంది. (Photo Credit: P.Madhusudan/Creative Commons Attribution)

కీసర గట్టు శివాలయం..

హైదరాబాద్ నగరంలోని ఈసీఐఎల్‌‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీసర గుట్ట కూడా తప్పక చూడాల్సిన శివాలయాల్లో ఒకటి. ఇక్కడ రావణుడిని సంహరించిన ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ కొండపై అనేక శివలింగాలు కూడా దర్శనమిస్తాయి. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా వేలాది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. మీరూ ఈసారి సందర్శించడానికి చూడండి. (Photo Credit: J.M.Garg/Creative Commons Attribution)

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.