యాప్నగరం

Siwa Oasis: ఇక్కడ ఈత రాకున్నా మునిగిపోరు.. కావాలంటే మీరూ వెళ్లి చూడండి..!

శివా ఓయాసిస్ (Siwa Oasis) అనే ప్రాంతంలో వందలాది అందమైన నీటి కొలనులు ఉన్నాయి. వాటి లోపలికి దిగితే మనుషులు మునిగిపోకుండా ఉంటారు. ఎలాంటి లైఫ్ జాకెట్లు అవసరం లేకున్నా నీటిపై తేలిపోతారు.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 4 Feb 2023, 10:19 am
పర్యాటక ప్రపంచంలో ఈజిప్ట్ అరుదైన దేశం. మనందరికీ ఈజిప్ట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పిరమిడ్లు, మమ్మీలు, ఎడారి ప్రాంతాలు, పురాతన కట్టడాలే. అయితే, అక్కడ మరో అందమైన ప్రపంచం కూడా ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. దాని పేరే శివా ఒయాసిస్. ఈ శివా ఒయాసిస్ అనే పట్టణం కట్టారా డిప్రెషన్ (భౌగోళిక పరిభాషలో డిప్రెషన్ అంటే సముద్ర మట్టం కన్నా తక్కువ స్థాయిలో ఉండే ప్రదేశం, లేదా నీటి వనరులు), గ్రేట్ సాండ్ సీ మధ్యన ఉంటుంది. ఈజిప్ట్ రాజధాని కైరోకి 560 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే, దీని ప్రత్యేకత ఏంటని అంటారా..? అదే ఇక్కడ చెప్పుకుందాం. (Photo Credit: Unsplash/Representational Image)
Samayam Telugu deadsea-thumb

Also Read: 2023 Best Wedding Destinations: ఈ ఏడాది బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్లు ఇవే.. మీరు పెళ్లికి సిద్ధంగా ఉంటే వీటిని చూడండి..!

ఈ శివా ఒయాసిస్ అనే పట్టణం ఈజిప్ట్‌కు పశ్చిమ దిక్కున లిబియా అంతర్జాతీయ సరిహద్దుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ మంది జనాభా నివసించినా చూడటానికి మంచి పర్యాటక ఆకర్షణీయమైన ప్రాంతాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఉప్పు నీటి కొలనుల గురించి. అవి అక్కడ వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే, వాటికి ఉన్న ఒక లక్షణమే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అసలైన విషయం. అదేంటంటే ఆ ఉప్పునీటి కొలనుల్లోకి ఎవరైనా దిగితే అస్సలు మునిగిపోరు. లైఫ్ జాకెట్స్ వంటి సాయం లేకున్నా, ఈత రాకున్నా హాయిగా నీటిపై తేలియాడొచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఎలాంటి దిగులు లేకుండా నీటిపైనే సేదతీరొచ్చు. కావాలంటే అలా నీటిపై తేలియాడుతూనే పుస్తకాలు కూడా చదవచ్చు. ఒకవేళ ఎవరైనా కావాలని మునిగిపోవాలని చూసినా కుదరదు. దీంతో హ్యాపీగా ఆ నీటి కొలనుల్లో రిలాక్స్ అవ్వొచ్చు.
Also Read: Irctc Tripura Package: ఐఆర్సీటీసీ హైదరాబాద్-త్రిపుర టూర్ ప్యాకేజీ ఎంతంటే..?

అయితే, ఇక్కడ మనుషులెందుకు మునిగిపోరనే సందేహం వస్తే దానికి ఒక కారణం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా నీళ్లలో పడితే, వారికి ఈత రాకపోతే సహజంగానే మునిగిపోతుంటారు. కానీ, ఇక్కడున్న నీటి కొలనుల్లో అధిక ఉప్పు సాంద్రత ఉంటుంది. దీంతో మనుషులు మునిగిపోరు. సహజంగా సముద్ర జలాల్లో ఉండే ఉప్పు శాతం కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో నీటిలో జరిగే ప్రతి చర్యల కారణంగా ఆయా కొలనుల్లో పైకి విడుదలయ్యే శక్తి ఒకటి ఉంటుంది. దీంతో మనుషులు అందులోకి దిగినా మునిగిపోకుండా తేలియాడుతుంటారు. ఇలాంటి దృశ్యాలు మనం డెడ్ సీలోనూ చూడొచ్చు. అలాగే అక్కడ ఉండే నీరు కూడా చాలా స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్‌గా ఉండటంతో ఎంతసేపైనా అలాగే ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు మీకూ అక్కడికి వెళ్లాలనే కోరిక ఉంటే ఈజిప్ట్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకోండి.
Also Read: 2023 Beautiful Countries:ఈ ఏడాది ఈ దేశాలు తిరిగి రావాల్సిందే.. ఎందుకంటే ?

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.