యాప్నగరం

Offbeat Destinations: ఈ ఆఫ్‌బీట్ డెస్టినేషన్స్‌కు ఎప్పుడైనా వెళ్లారా..? అవేంటో చూడండి..!

రాజస్థాన్ (Rajasthan Tourism) మంచి పర్యాటక రాష్ట్రం. అక్కడ ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. కానీ, చాలా మంది ప్రముఖ పర్యాటక ప్రదేశాలనే చూస్తారు. అవి కాకుండా ఆఫ్‌బీట్ డెస్టినేషన్స్ కూడా ప్రముఖంగా ఆకట్టుకుంటాయి. మీరెప్పుడైనా వెళితే వీటిని చూసి తరించండి.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 26 Nov 2022, 5:50 pm
రాజస్థాన్‌ను (Rajasthan Offbeat Destinations) చూడాలనుకుంటే చాలా మంది జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, జైసల్మేర్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకే వెళతారు. అవన్నీ చారిత్రక కట్టడాలకు, అద్భుతమైన కోటలకు ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ కేంద్రాలు. దీంతో ఎవరైనా రాజస్థాన్‌కు వెళ్లాలనుకుంటే వాటినే సందర్శించి వస్తారు. అయితే మీరు ఈసారి ఎప్పుడైనా రాజస్థాన్‌కు వెళ్లాలనుకుంటే వాటితో పాటు ఈ ఆఫ్‌బీట్ డెస్టినేషన్లను కూడా సందర్శించి రండి. ఇవి మీకు ఇంకా బాగా నచ్చుతాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. (Photo Credit: Unsplash)
Samayam Telugu these are the offbeat destinations one must visit during rajasthans tour
Offbeat Destinations: ఈ ఆఫ్‌బీట్ డెస్టినేషన్స్‌కు ఎప్పుడైనా వెళ్లారా..? అవేంటో చూడండి..!



​కుంభాల్‌ఘర్..

ఉదయపూర్ నుండి 85 కి.మీ దూరంలో ఉన్న కుంభాల్‌ఘర్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇదొక ప్రత్యేకమైన ఆఫ్‌బీట్ ప్రదేశం. ఇక్కడ అద్భుతమైన స్మారక చిహ్నాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రఖ్యాత రాజభవనాలు, కుంభాల్‌ఘర్ కోట వంటివి ఉన్నాయి. ఇది మహారాణా ప్రతాప్ జన్మస్థలం కాబట్టి చరిత్రలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. అలాగే ఇక్కడ వన్యప్రాణుల అభయారణ్యం కూడా పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. (Photo Credit: Unsplash)

​బుండి..

రాజస్థాన్‌లోని మరో అద్భుతమైన ఆఫ్‌బీట్ డెస్టినేషన్ బుండి. ఇది కోటా అనే ప్రదేశం నుండి 40 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశం గురించి చాలా మందికి తెలియకపోవడంతో అంత రద్దీగా ఉండదు. ఈ ఊరు చుట్టూ అరావళి కొండలు ఉండటంతో ఉండటంతో చూడటానికి వైవిధ్యంగా ఉంటుంది. గతంలో ఈ బుండి అనే ప్రాంతం రాజస్థాన్‌లోని అనేక రాచరిక రాష్ట్రాలకు రాజధానిగా ఉండేది. ఇక్కడి ప్యాలెస్‌లు, బావోలీలకు ప్రసిద్ధి చెందింది. వాటిని కోటలు, మెట్ల బావులు అని కూడా పిలుస్తారు. ఇదో చిన్న అందమైన పట్టణం కాబట్టి చూడటానికి కూడా పెద్ద సమయం పట్టదు. (Photo Credit: Unsplash)

Also Read: South India: సౌత్ ఇండియాలో ఈ వింటర్ డెస్టినేషన్లకు ఎప్పుడైనా వెళ్లారా.. ఇవి చాలా తక్కువ మందికే తెలిసిన ప్రదేశాలు

​నార్లాయ్..

మరో అందమైన ఆఫ్‌బీట్ పర్యాటక ప్రదేశం నార్లాయ్. ఇది కూడా అద్భుతమైన అరావళి కొండల మధ్య ఉంటుంది. ఇదో అభివృద్ధి చెందిన గ్రామమే కాకుండా పర్యాటకులకు చాలా విశేషమైన సేవలను అందిస్తోంది. ఈ గ్రామంలో అనేక గుళ్లతో పాటు ఒక హెరిటేజ్ హోటల్ కూడా ఉంది. దాన్ని రావా నార్లాయ్ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ ఝరోకా కేఫ్ వద్ద రాజస్థాన్ వంటకాల రుచులను కూడా ఆస్వాదించొచ్చు. మరోవైపు ఈ ప్రదేశం ఒకప్పుడు రాజవంశస్థులకు వేటాడే ప్రాంతంగా ఉండేది. నార్లాయ్‌లో చిరుతపులుల సఫారీ కూడా చేసే అవకాశం ఉంటుంది. (Photo Credit: Unsplash)

​ఝలావర్..

ఝలావర్ ఒకప్పుడు రాజస్థాన్‌లోని పూర్వపు రాచరిక రాష్ట్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏ మూల చూసినా గతకాలపు అవశేషాలు అలాగే దర్శనమిస్తాయి. మరోవైపు ఈ ప్రాంతంలో 50 కన్నా ఎక్కువ గుహలు ఉన్నాయని తెలిసింది. అవన్నీ 5 నుంచి 8 శతాబ్దాల కాలంలో నిర్మించినవి. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండి పర్యాటకులను అలరిస్తున్నాయి. ఈ అందమైన పట్టణం చుట్టూ సువాసనగల తోటలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఓ పురాతన మ్యూజియం, భవానీ నాట్యశాల, గర్ ప్యాలెస్, పృథ్వీ విలాస్, బౌద్ధ కావెసిన్ కొల్వి వంటివి కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. (Photo Credit: Unsplash)

Also Read: December Vacations: 2022ని మెమరబుల్‌గా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని ఓ లుక్కేయండి

​పుష్కర్..

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఉన్న మరో అందమైన ప్రదేశం పుష్కర్. ఇక్కడ వందల దేవాలయాలు ఉండటం విశేషం. మరోవైపు సహజసిద్ధంగా ఏర్పడిన సరస్సు కూడా పుష్కర్‌లో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇందులో 52 ఘాట్‌లు ఉన్నాయి. దీంతో పుష్కర్‌కు వచ్చే భక్తులు అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి దేవాలయాలను సందర్శిస్తారు. అలాగే ఇక్కడ తప్పకుండా చూడాల్సిన వాటిల్లో ఒకటి బ్రహ్మ దేవుడి ఆలయం. దీంతో ఈ పుష్కర్ ప్రాంతం ఎప్పుడు చూసినా భక్తులతో కిటకిటలాడుతుంటుంది. (Photo Credit: Unsplash)

​లోంగేవాలా సరిహద్దు

ఇది భారతదేశ యుద్ధ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది జైసల్మేర్ నుండి 120 కి.మీ దూరంలో ఉంటుంది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య 1971లో ఇక్కడే యుద్ధం మొదలైంది. ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే ఆ యుద్ధంలో జరిగిన అనేక సంఘటనల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అప్పటి నుంచీ ఈ ప్రాంతం యుద్ధ శిధిలాలతో నిండి ఉంది. అప్పుడు పాకిస్తాన్ సైనికులు కొందరు మన భూభాగంలోకి చొరబడటంతో యుద్ధం చోటుచేసుకుంది. అలాంటి గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కలిగిన ఈ లోంగేవాలాను తప్పక సందర్శించాల్సిందే. ఇక్కడ మీరు ఆ యుద్ధంలో పాల్గొన్న ఎయిర్‌క్రాఫ్ట్, యుద్ధ ట్యాంక్‌లను చూడొచ్చు. (Photo Credit: Unsplash)

Also Read: Safe Places for Unmarried Couples: భారతదేశంలోని ఈ ప్రదేశాలు పెళ్లికాని జంటల పర్యటనలకు సురక్షితం.. !

​బార్మర్..

జైసల్మేర్ నుండి 150 కి.మీ దూరంలో ఉండే బార్మర్ కూడా రాజస్థాన్‌లో అద్భుతమైన ఆఫ్‌బీట్ డెస్టినేషన్. ఇది ఎక్కువభాగం థార్ ఎడారిలోనే ఉంటుంది. ఇక్కడ దేవాలయాలు, కోటల రూపంలో అనేక చిన్న గ్రామాలు చారిత్రక అవశేషాలను కలిగి ఉన్నాయి. ఈ పట్టణం సంస్కృతి, సంప్రదాయాలకు, పండుగలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని 13వ శతాబ్దంలో రాజస్థాన్ చరిత్రలో గొప్ప పాలకుల్లో ఒకరైన బహదో రావ్ పర్మార్ కనుగొన్నారు. ఇక్కడ తప్పక చూడాల్సిన వాటిల్లో శివనా కోట, కిరాడు దేవాలయాలు ఉన్నాయి. ఇలా మీరు రాజస్థాన్‌లో సందర్శించాలే కానీ చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. (Photo Credit: Unsplash)

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.