These Places In Uttarakhand Are Also In Danger Know Whats The Reason
Joshimath Sinking: జోషిమఠ్ ఒక్కటే కాదు.. ఉత్తరాఖండ్లోని మరిన్ని ప్రాంతాలు కూడా..!
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) జోషీమఠ్తో (Joshimath Sinking)పాటు ఇంకా కొన్ని ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నాయి. అందులోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూడా బీటలు వారాయి. దీంతో అక్కడి ప్రాంతాల్లోని స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్లోని (Uttarakhand Tourist Places) ప్రముఖ పర్యాటక క్షేత్రమైన జోషిమఠ్ (Joshimath Sinking) మునిగిపోయే ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ పట్టణంలోని సుమారు 678 భవనాలు సురక్షితంగా లేవని తేలింది. దీంతో అధికారులు స్థానికులను తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు తరలించారు. ఇలా ఊరంతా మునిగిపోవడానికి సంబంధించిన సాటిలైట్ వీడియోను సైతం భారత అంతరిక్ష సంస్థ తాజాగా బయటపెట్టింది. అందులో గత 12 రోజులుగా జోషీమఠ్ 5.4 సెంటిమీటర్లు మునిగిందని తెలిసింది. మానవ తప్పిదాల కారణంగానే ఇలా జరుగుతోందని స్థానికులు నిందిస్తుండగా.. అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఇలాంటి వాటికి కారణమవుతాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే కేవలం జోషీమఠ్ ఒక్కటే కాకుండా ఉత్తరాఖండ్లోని మరిన్ని ప్రాంతాలు సైతం ఇలాంటి ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. (Photo Credit:Unsplash)
ఉత్తరకాశీ..
ఉత్తరకాశీ జిల్లాలోని భట్వాడి, మస్తాడి అనే గ్రామాల్లోనూ ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఉంది. 1991లో ఇక్కడ భూకంపం సంభవించిన తర్వాత మస్తాడి అనే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి.ఆపై జిల్లాలోని అనేక ప్రాంతాల్లోని ఇళ్ళలోనూ పగుళ్లు కనిపించడం ప్రారంభించాయి. మొదట్లో అక్కడి ఇళ్లలో నుండి నీరు రావడం కూడా కొంతమంది గమనించారని అంటారు. అది ఇప్పుడు ప్రకృతి విపత్తుగా మారే అవకాశం ఉంది. (Photo Credit: Unsplash) Also Read: Himachal Pradesh: మంచు అందాలు రమ్మంటున్నా.. రహదారులు వద్దంటున్నాయి..!
రుద్రప్రయాగ..
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న మరోడా గ్రామం కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది. నివేదికల ప్రకారం.. గ్రామంలోని కొన్ని ఇళ్లల్లో ఇప్పటికే పగుళ్లు ఏర్పడ్డాయని, రిషికేశ్-కరణ్ప్రయాగ్ రైలు మార్గంలో సొరంగం నిర్మించడమే అందుకు కారణం అని అంటారు. మరోవైపు కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలిసింది.అయితే ప్రస్తుతం చాలా ఇళ్లు కూడా నేలమట్టమయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ గ్రామస్థులను త్వరగా ఖాళీ చేయించకపోతే పెను ప్రమాదం సంభవించినా ఆశ్చర్యంలేదని తెలుస్తోంది. (Photo Credit: Unsplash) Also Read: Kerala 7 Days 7 Places Tour: కేరళ ట్రిప్.. 7 రోజుల్లో 7 ప్రాంతాలు ఇలా చుట్టేయండి..!
పౌరి..
అలాగే పౌరీ గర్వాల్ జిలాల్లోని పౌరీ అనే ప్రాంతంలోనూ కొన్ని ఇళ్లు బీటలు వారాయని స్థానికులు అంటున్నారు. ఆ ఊరికి సమీపంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు పనుల వల్ల తమ ఇళ్లకు సైతం ప్రమాదాలు పొంచి ఉన్నాయని వాపోతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పగుళ్లు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఒక స్థానికుడు మాట్లాడుతూ.. పగలూ, రాత్రీ తేడా లేకుండా సాగుతున్న రైల్వే పనుల కారణంగా అక్కడ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయని, దాంతో భూ ప్రకంపనల కారణంగా తమ ఇళ్లలో పగుళ్లు కనిపిస్తున్నాయని చెప్పాడు. తమకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. (Photo Credit: Unsplash) Also Read: Alternate Tourist Destinations: ఎప్పుడూ అవేనా.. ఈసారి అక్కడికెళ్లి కొత్తగా ట్రై చేయండి..!
నైనిటాల్..
కుమావోన్ పర్వత శ్రేణుల్లో ఉండే అందమైన టూరిస్ట్ డెస్టినేషన్ నైనిటాల్. ఉత్తర భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడికి ఏడాది పొడవునా సుదూర ప్రాంతాల నుండి సందర్శకులు వస్తూనే ఉంటారు. అయితే, అక్కడ లభించిన నివేదికల ప్రకారం.. ఈ నైనిటాల్లోని సగం విస్తీర్ణం మొత్తం కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడిన శిధిలాలదే. దీంతో ఆ అందమైన పట్టణంలోని కొన్ని ప్రాంతాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. (Photo Credit: Unsplash) Also Read: Thailand Tourism Fee: థాయ్లాండ్ అనూహ్య నిర్ణయం.. త్వరలో టూరిజం ఫీజు వసూలు!
బాగేశ్వర్..
బాగేశ్వర్ జిల్లాలోని కాప్కోట్లోని ఖర్బగడ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడుతుండటంతో సొరంగాల నుండి నీటి ప్రవాహం కొనసాగుతోంది. అయితే, అక్కడి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం పైన కొండలో ఏర్పడిన గుంతల కారణంగానే ఈ లీకేజీ జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రదేశం చాలా కాలంగా సొరంగం నుండి నీటి సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో ఇలాంటి సమస్యలు కూడా భవిష్యత్తులో ఆ ప్రాంతాన్ని ప్రమాదంలో పడేస్తాయి. (Photo Credit: Unsplash) Also Read: Indian Passport: 2023 పవర్ఫుల్ పాస్పోర్ట్స్ జాబితా.. భారత పాస్పోర్ట్తో మీరెన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చంటే?
తెహ్రీ గర్వాల్..
ఇక తెహ్రీగర్వాల్ జిల్లాలోని నరేంద్రనగర్ నియోజకవర్గంలోని అటాలి అనే గ్రామం గుండా వెళుతున్న రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ కూడా ఈ ప్రాంతాన్ని ప్రమాదంలో నెట్టేసే అవకాశం ఉంది. అటాలీకి ఒకవైపు భారీ కొండచరియలు విరిగిపడటంతో పాటు సొరంగంలో బ్లాస్టింగ్ పనుల కారణంగా ఈ ప్రాంతంలోని చాలా ఇళ్ళు పగుళ్లకు గురయ్యాయని తెలిసింది. దీంతో ఈ ప్రాంతాలన్నీ మానవ లేదా ప్రకృతి వైపరీత్యాల కారణాలతో ప్రమాదంలో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఈ ప్రాంతాలకు వెళ్లినట్లయితే మరిన్ని విషయాలు తెలుసుకొని వెళ్లడం మంచిది. (Photo Credit:Unsplash) Also Read: Maldives: మాల్దీవ్స్ ట్రిప్లో ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే అంతే సంగతి
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.