యాప్నగరం

Tilting Trains: త్వరలో భారత్‌లో 100 టిల్టింగ్ ట్రైన్లు.. వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

భారత్‌లో త్వరలో టిల్టింగ్ ట్రైన్లు (Tilting Trains in India) రానున్నట్లు ఓ రైల్వే అధికారి వెల్లడించారు. ప్రస్తుతం 100 వందే భారత్ రైళ్లు తయారీ దశలో ఉన్నాయని వాటిల్లో ఈ టిల్టింగ్ ట్రైన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని చెప్పారు.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 29 Nov 2022, 5:23 pm
అన్నీ అనుకున్నట్లు జరిగితే భారతదేశంలో త్వరలో టిల్టింగ్ ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. మరో మూడు, నాలుగేళ్లలో అవి పట్టాలపై పరుగులు తీసే అవకాశం ఉంది. భారతీయ రైల్వేస్‌కు చెందిన ఓ అధికారి ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం 100 వందేభారత్ రైళ్లు తయారీ దశలో ఉన్నాయని, వాటిల్లో టిల్టింగ్ ట్రైన్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
Samayam Telugu Train-thumb


Also Read: Sri Lanka: శ్రీలంకను చూడాలంటే ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు.. ఒకే ట్రిప్‌లో అరుదైన ప్రదేశాలు

టిల్టింగ్ ట్రైన్లు అంటే పట్టాలు వంపులు తిరిగినప్పుడు కూడా వేగంగా దూసుకెళ్లే రైళ్లు. సహజంగా రైళ్ల పట్టాలు చాలా చోట్ల వంపులు తిరిగి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి చోట్ల రైళ్లు ప్రయాణించేటప్పుడు వేగాన్ని తగ్గించుకొని నెమ్మదిగా వెళ్తుంటాయి. అలా కాకుండా వంపులు తిరిగిన చోట కూడా రైలు వేగంగా వెళితే ప్రయాణికులు ఇబ్బందులు పడతారు. ఒక్కోసారి అది రైలు ప్రమాదాలకు కూడా దారితీయొచ్చు. అయితే, ఈ టిల్టింగ్ ట్రైన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పట్టాలు వంపులు తిరిగినా రైళ్లు అదే వేగంతో దూసుకెళ్లే వీలుంటుంది. దీంతో ఆ రైళ్ల ప్రయాణం సగటు వేగం తగ్గకుండా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకుంటారు. తద్వారా చాలా సమయం ఆదా అవుతుంది.

Also Read: Romantic Wedding Destinations: ఇవి రొమాంటిక్ వెడ్డింగ్ డెస్టినేషన్స్.. అక్కడ మీ సోల్‌మేట్‌తో కొత్త జీవితం ప్రారంభించొచ్చు..!

2025 నాటికి ఆ టిల్టింగ్ రైళ్లు పట్టాలపై తిరుగుతాయని, అందుకోసం 100 వందే భారత్ రైళ్లను తయారు చేస్తున్నామని ఆ అధికారి పేర్కొన్నారు. భారతీయ రైల్వేస్‌లో ఇదివరకే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినా అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ స్పానిష్ రైల్వే తయారీదారి సంస్థ టాల్గోతో పాటు స్విట్జర్లాండ్ ప్రభుత్వంతోనూ ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ టిల్టింగ్ ట్రైన్ టెక్నాలజీ ద్వారా పట్టాలు ఎలా ఉన్నా రైళ్లు వేగంగా ప్రయాణించే యంత్రంగా కలిగి ఉంటుందని వివరించారు.

Read All Latest Telugu News and Travel News
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.