యాప్నగరం

Year End Trips: ఈ దేశాలకు 5 గంటల్లోనే వెళ్లొచ్చు.. మీరెప్పుడైనా వెళ్లారా?

ఏడాది చివర్లో ఎక్కడికైనా అంతర్జాతీయ పర్యటనలకు (International Tours) వెళ్లాలనుకుంటే ఈ ప్రదేశాలను చుట్టేయండి. ఎందుకంటే ఇవి భారత్ నుంచి 5 గంటల్లోనే చేరుకునే అందమైన దేశాలు. దీంతో మీరు చాలా తక్కువ సమయంలో వెళ్లొచ్చే అవకాశాలు కలిగి ఉంటుంది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 1 Dec 2022, 2:30 pm
డిసెంబర్ నెల ప్రారంభమైంది. దీంతో మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగీయబోతోంది. మీరింకా ఏమైనా సెలవులు దాచుకొని ఉంటే వెంటనే బ్యాగ్‌లు సర్దుకొని ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇయర్ ఎండ్ ట్రిప్‌లు ఎవరికైనా ప్రత్యేకంగా నిలుస్తాయి. అలా ఈ ఏడాది చివర్లో మీరు కూడా మంచి హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తే కొత్త సంవత్సరాన్ని మరింత ఉత్సాహవంతంగా ప్రారంభించొచ్చు. మీరు కూడా అదే ఆలోచనతో ఉంటే ఈ సమాచారం మీకోసమే. తక్కువ సమయంలో విదేశీ పర్యటనలు చేయాలనుకునేవారికి ఇవే సరైన అంతర్జాతీయ గమ్యస్థానాలు. ఇక్కడికి కేవలం 5 గంటల్లోనే మీరు చేరుకోవచ్చు. ఆ ప్రదేశాలేవో తెలుసుకుందాం. (Photo Credit: Unsplash)
Samayam Telugu you can go to these countries within 5 hours of journey from india
Year End Trips: ఈ దేశాలకు 5 గంటల్లోనే వెళ్లొచ్చు.. మీరెప్పుడైనా వెళ్లారా?



​నేపాల్..

మీరు సురక్షితమైన, సులభతరమైన అంతర్జాతీయ విహారయాత్రకు వెళ్లాలనుకుంటే మరో ఆలోచన లేకుండా నేపాల్‌ని ఎంపిక చేసుకోవచ్చు. ఇది భారతదేశానికి అత్యంత సమీప గమ్యస్థానమే కాకుండా చాలా చౌకైన అంతర్జాతీయ పర్యటక ప్రదేశం కూడా. హిమాలయాల అందాలు, ప్రకృతి సోయగాలు ఎవర్నైనా ఇట్టే మంత్రముగ్ధులకు గురిచేస్తాయి. దిల్లీ నుంచి కేవలం రెండు గంటల్లోనే వెళ్లొచ్చు. (Photo Credit: Unsplash)

​దుబాయ్..

ఈ అందమైన గమ్యస్థానం కచ్చితంగా అసాధారణమైన, ఆకర్షణీయమైన విషయాలను కలిగి ఉంటుంది. ఇక్కడ సందర్శించడానికి, అనుభూతి చెందడానికి అనేక ఆసక్తికరమైన ప్రదేశాలున్నాయి. దుబాయ్ ఎలాంటి పర్యాటకులనైనా ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఇక్కడ ప్రైవేట్ ద్వీపాలు, ఎడారి సఫారీలు, మిచెలిన్-నక్షత్రాలతో కూడిన రెస్టారెంట్లు, భారీ ఆకాశహార్మ్యాలను కూడా ఆస్వాదించొచ్చు. ముంబయి నుంచి అక్కడికి కేవలం మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. (Photo Credit: Unsplash)

Also Read: Shanay Timpishka: సలాసలా మరిగే నది.. ఇందులో పడితే అంతే సంగతి..!

​మాల్దీవులు..

అందమైన సముద్ర జలాలకు, తెల్లని ఇసుక బీచ్‌లకు, అద్భుతమైన సముద్ర జీవులకు ప్రసిద్ధి చెందిన మాల్దీవ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూడాలనుకునే టాప్ ఫేవరెట్ డెస్టినేషన్. ఇటీవల ఈ ద్వీప దేశం విశేషమైన ఆదరణ పొందుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉండే టూరిస్టులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక సముద్ర జలాల్లోని రిసార్టులు, హెలీ రైడ్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌కు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. తిరువనంతపురం నుంచి అక్కడికి చేరుకోవడానికి 4 గంటలే సరిపోతుంది. (Photo Credit: Unsplash)

​సింగపూర్..

ప్రపంచంలోని అత్యంత అందమైన దేశాల్లో ఒకటి సింగపూర్. ఈ ద్వీప దేశాన్ని సందర్శిస్తే ఎవరైనా ఇట్టే ఫిదా అయిపోతారు. అయితే, ఇదో మేటి పర్యాటక ప్రదేశం కావడంతో చాలా మంది భారీ ఖర్చు అవుతుందని అనుకుంటారు. కానీ, సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సింగపూర్‌ను తక్కువ ఖర్చులోనే చుట్టిరావచ్చు. ఇది అన్ని రకాల పర్యాటకులకు తప్పక నచ్చే ప్రదేశంగా ఉంటుంది. దీంతో ఇయర్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి కూడా వెళ్లొచ్చు. చెన్నై నుంచి నాలుగున్నర గంటల్లో వెళ్లొచ్చు. (Photo Credit: Unsplash)

Also Read: Goa Romantic Beaches: గోవాలో మీ పార్ట్‌నర్‌తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే, ఈ బీచ్‌లకు వెళ్లండి..!

​సీషెల్స్..

అద్భుతమైన పగడపు దిబ్బలు, అందమైన బీచ్‌లు ప్రకృతి సహజసిద్ధ అందాలతో నిండిన ప్రదేశం సీషెల్స్. ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టులను ఆకర్షించడంలో ముందుంటుంది. మీరు ఈ డిసెంబర్ చివర్లో వెళ్లడానికి సరైన అద్భుతమైన గమ్యస్థానం. అక్కడ ప్రధానంగా చూడాల్సిన వాటిల్లో మాహే ఐలాండ్స్ ఉంటుంది. అక్కడ అదే అతిపెద్ద ద్వీపం. మరోవైపు ఈ ప్రదేశం నుండి ఇతర దీవులకు వళ్లడం కూడా చాలా తేలికే. తిరువనంతపురం నుండి అక్కడికి నాలుగున్నర గంటల్లో చేరుకోవచ్చు. (Photo Credit: Unsplash)

​థాయ్‌లాండ్..

భారతీయ ప్రయాణికులు ఎల్లప్పుడూ కోరుకునే అంతర్జాతీయ గమ్యస్థానాల్లో ఒకటి థాయ్‌లాండ్. ఇది అద్భుతమైన నైట్‌లైఫ్‌కు, అందమైన బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్. అలాగే పలు బౌద్ధ ఆలయాలు, అరుదైన కట్టడాలు సందర్శకులను తప్పక మెప్పిస్తాయి. ఇక ఏడాది చివర్లో అక్కడికి పర్యాటకులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. దీంతో మీరు కూడా వెళ్లాలనుకుంటే ఇప్పుడే ఏర్పాట్లు ప్రారంభించండి. చెన్నై నుంచి బ్యాంకాక్‌కు 4 గంటల్లో వెళ్లొచ్చు. (Photo Credit: Unsplash)

Also Read: Bimbisara's Jail: గౌతమ బుద్ధుని స్నేహితుడైన బింబిసారుడిని తన కుమారుడే జైళ్లో పెట్టిన ప్రదేశం ఇది..!

​ఒమన్..

ఒమన్ కూడా భారతీయులకు బడ్జెట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్. ఇది అక్కడికి వచ్చే పర్యాటకులను విభిన్నమైన ఆకర్షణలతో ఆకట్టుకుంటుంది. అలాగే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఏకాంత ప్రదేశాలు సైతం అక్కడ వీక్షించొచ్చు. అక్కడ సందర్శకుల తాకిడిని తప్పించుకోవాలంటే లగ్జరీ రిసార్ట్‌లు సైతం అందుబాటులో ఉంటాయి. దీంతో మీరు హ్యాపీగా ఒమన్‌ను చుట్టిరావడానికీ ప్రయత్నించండి. ముంబయి నుంచి అక్కడికి వెళ్లడానికి సుమారు మూడున్నర గంటలే పడుతుంది. (Photo Credit: Unsplash)

​లావోస్..

భారత్ నుంచి ఇయర్ ఎండ్‌ ట్రిప్‌కు లావోస్ పర్యటన కూడా గొప్పగా ఉంటుంది. అక్కడికెళితే ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించొచ్చు. అలాగే అక్కడి రుచికరమైన వంటకాలు, అందమైన లొకేషన్లు రమ్య మనోహరంగా ఉంటాయి. సందర్శించడానికి పురాతన గుహలు, అద్భుతమైన దేవాలయాలు, సుందర జలపాతాలు, గంభీరమైన పర్వతాలు ఉంటాయి. దీంతో ఇది కూడా ఫ్యామిలీ ట్రిప్‌కు అనుకూలంగా ఉంటుంది. చెన్నై నుంచి లావోస్‌కు సుమారు నాలుగున్నర గంటల సమయం పడుతుంది. (Photo Credit: Unsplash)

Also Read: USA R-1 Visa: మీకు ఈ అర్హతలుంటే అమెరికా బంపర్ ఆఫర్.. R-1 వీసా జారీ

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.