యాప్నగరం

Madhya Pradesh Trip: మధ్య ప్రదేశ్‌ ట్రిప్.. అక్కడ ఇలాంటి పర్యాటక అందాలు చూడొచ్చా..?

దేశంలో పలు అందమైన పర్యాటక రాష్ట్రాలున్నా వేటికవే ప్రత్యేకం. అలాగే మధ్య ప్రదేశ్ (Tourist Places in Madhya Pradesh) కూడా ఎన్నో రకాల పర్యాటక ప్రదేశాలను కలిగి ఉంది. అవెంత అందంగా ఉంటాయో ఇక్కడ చూడండి.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 20 Jan 2023, 4:07 pm
భారత దేశంలోని అద్భుతమైన పర్యాటక రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్ (Madhya Pradesh Trip) ఒకటి. ఇది దేశం మధ్యలో ఉండటంతో హిందుస్థాన్ కా దిల్ అని అంటారు. ఇక్కడ ప్రఖ్యాత, చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక (Tourist Places in Madhya Pradesh) వారసత్వ గొప్పదనం కలిగిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవి దేశంలోని ఇతర పేరుమోసిన పర్యాటక ప్రాంతాలతో పోలిస్తే ఏమాత్రం తక్కువకాదు. ఆ రాష్ట్రంలోని అన్ని సందర్శనీయ ప్రాంతాలను చూడాలంటే కూడా ఒక్క ట్రిప్ సరిపోదు. ఇలా అంటున్నామంటే ఆ రాష్ట్రం ఎంత విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. అక్కడున్న టాప్ రేటెడ్ టూరిస్ట్ అట్రాక్షన్స్లోని కొన్నింటిని మీకోసం ఇక్కడ పరిచయం చేస్తున్నాం. అవేంటో తెలుసుకొని మీరూ వెళ్లడానికి ట్రై చేయండి. (Photo Credit: Unsplash)
Samayam Telugu you feel awe when you visit madhya pradesh tourist places
Madhya Pradesh Trip: మధ్య ప్రదేశ్‌ ట్రిప్.. అక్కడ ఇలాంటి పర్యాటక అందాలు చూడొచ్చా..?



భేదాఘాట్ మార్బుల్ రాక్స్..

జబల్పూర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండే భేదాఘాట్ మార్బుల్ రాక్స్ అనేది అరుదైన ప్రదేశం. ఇక్కడ ప్రవహించే నర్మదా నది రెండు పాలరాతి కొండలను చీల్చుకుంటూ 8 కిలోమీటర్ల మేరా సన్నని లోయలాంటి ప్రదేశంలో ప్రవహిస్తుంది. దీంతో ఇది చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ లోకేషన్ను పలు బాలీవుడ్ సినిమాల్లోనూ చూడొచ్చు. (Photo Credit: Unsplash)
Also Read: Unique Villages in India: ఇవి అరుదైన గ్రామాలు గురూ.. వాటి గురించి తెలిస్తే వెళ్లకుండా ఉండలేరు!

ఓర్చా అరుదైన నిర్మణాలు..

మధ్యప్రదేశ్లోని అత్యంత చారిత్రక ప్రాధాన్యత కలిగిన నగరాల్లో ఒకటి ఓర్చా. ఇది బెత్వా నది ఒడ్డున ఉండటంతో సూర్యాస్తమయం వేళ అక్కడ సందర్శించడం మంచిది. ఆ సమయంలో స్థానికంగా ఉండే రాతి నిర్మాణాల అందాలు నదిలో ప్రతిబింబిస్తాయి. అప్పుడు నది మొత్తం బంగారు వర్ణంలో కనిపిస్తూ సుందరమైన దృశ్యాలను అందిస్తుంది. (Photo Credit: Unsplash)
Also Read: Republic Day Trips: హైదరాబాద్ వాసులు రిపబ్లిక్ డే వీకెండ్ ట్రిప్ వెళ్లాలనుకుంటే ఈ 5 డెస్టినేషన్లను ఎంచుకోవచ్చు..!

గ్వాలియర్ కోట అందాలు..

మధ్యప్రదేశ్లోని ముఖ్యమైన నగరాల్లో ఒకటి గ్వాలియర్. అక్కడ ఉండే కొండపై ఉన్న గ్వాలియర్ కోట ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. అది సుమారు 10 శతాబ్దాలుగా గ్వాలియర్ నగరానికి చిహ్నంగా కొనసాగుతోంది. కొన్ని అంచనాల ప్రకారం అది 6వ శతాబ్దానికి చెందిందని తెలిసింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కోట ఇప్పటికీ ఎంతో దృఢంగా ఉంది. కోటపైకెళ్లి చూస్తే గ్వాలియర్ మొత్తం కనిపిస్తుంది. (Photo Credit: Unsplash)
Also Read: Travel With Friends: స్నేహితులతో చెక్కేయాలంటే ఈ అందమైన హిల్స్టేషన్లకు ప్లాన్ చేయండి..!

భీంబేట్కా రాతి గుహలు..

ఈ పురాతన రాతి గుహలు ప్రాచీన శిలాయుగం, మెసోలిథిక్ కాలానికి చెందినవి కావడంతో ఇది అరుదైన ప్రదేశంగా గుర్తింపు సాధించింది. వింధ్యా పర్వతాల్లో ఉండే రాతి గుహలు సాహస ప్రియులకు అమితంగా నచ్చుతాయి. ఈ గుహల లోపలి భాగంలో 8,000 BC కాలం నాటి అరుదైన పెయింటింగ్స్ కనిపిస్తాయి. అవి భారతదేశంలో మానవ జీవితానికి సంబంధించిన తొలి సాక్ష్యంగా ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఈ గుహలను జీవితంలో ఒక్కసారైనా చూడాలని చెప్పొచ్చు. (Photo Credit: Unsplash)
Also Read: IRCTC Vietnam Tour: ఐఆర్సీటీసీ వియత్నాం టూర్.. ధరెంతో తెలిస్తే సీట్ బుక్ చేసుకుంటారు..!

మాండులోని జహాజ్ మహల్ ..

మాండు జిల్లాలోని మరో అద్భుతమైన కట్టడం జహాజ్ మహాల్. ఇది చూడటానికి భారీ నౌకలా ఉండటంతో ఆ పేరు పెట్టారు. జహాజ్ అంటే నౌక అని అర్థం. 15వ శతాబ్దంలో సుల్తాన్ ఘియాస్-ఉద్-దిన్-ఖల్జీ దీన్ని నిర్మించారు. ఇది రెండు కృత్రిమ సరస్సుల మధ్య నిర్మించడంతో చూడటానికి గొప్పగా ఉంటుంది. ఈ జహాజ్ మహాల్ నిర్మాణ శైలి ప్రతి ఒక్క పర్యాటకుడికి కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. (Photo Credit: Unsplash)
Also Read: Most Underrated Tourist Places in India: ఇవి అద్భుతమైన అండర్ రేటెడ్ పర్యాటక ప్రాంతాలు.. ఫిబ్రవరిలో వెళ్లడానికి చూడండి..!

కన్హా నేషనల్ పార్క్..

వన్యప్రాణుంటే ఇష్టమైతే తప్పక సందర్శించాల్సిన ప్రదేశం కన్హా నేషనల్ పార్క్. ఇది పులుల వీక్షణకు, బరాసింగ జనాభాకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఇక్కడున్న అరుదైన జీవ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ ఉద్యానవనంగా, టైగర్ రిజర్వ్ కేంద్రంగా తీర్చిదిద్దారు. దీంతో మీరు అద్భుతమైన అటవీ అందాలు చూడాలన్నా, వన్యప్రాణులను చూడాలన్నా ఈ పార్క్ని తప్పక చూడాల్సిందే. (Photo Credit: Unsplash)
Also Read: Ranthambore National Park: పెద్ద పులులను అతి దగ్గరి నుండే ఫొటోలు తీయొచ్చు..రణతంబోర్ అభయారణ్యం గురించి తెలుసా..?

యునెస్కోసైట్ ఖజురహో..

ఖజురహోలోని పలు అందమైన రాతి నిర్మాణాలు ఆ ప్రాంతానికే ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. పురాతన కాలం నాటి ఈ నిర్మాణాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. వీటిని చండేలా రాజవంశం కాలంలో నిర్మించారు.అలాగే ఇక్కడి నిర్మాణాలు శృంగార శిల్పాలకు ప్రసిద్ధి చెందాయి. అయితే, వాటికన్నా ఇంకా అందమైన నిర్మాణాలు పర్యాటకుల మది దోచేస్తాయి. (Photo Credit: Unsplash)
Also Read: canusa street: ఆ వీధిలో రోడ్డు దాటాలంటే పాస్పోర్ట్ ఉండాల్సిందే.. మీరు వెళ్లినప్పుడు జాగ్రత్త!

పెంచ్ టైగర్ రిజర్వ్..

మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ కూడా అత్యంత అందమైన పులుల అభయారణ్యం. అందులో విహరిస్తే మీరు ఎక్కడపడితే అక్కడ పెద్ద పులులు, చిరుత పులులను చూసే అవకాశం ఉంటుంది. దీంతో అక్కడికి వెళ్లే ముందే మీరు కెమెరాను వెంటబెట్టుకెళ్లడం మర్చిపోవద్దు. వీలైతే బైనాక్యులర్ను కూడా పట్టుకెళ్లండి. హ్యాపీగా ఆ అడవిలో విహరిస్తూ వన్యప్రాణుల అందాలను మీ కెమెరాల్లో బంధించుకోండి. (Photo Credit: Unsplash)
Also Read: Odisha Tourist Places: ఒడిశాలో ఇలాంటి అందమైన ప్రదేశాలు ఉంటే వెళ్లకుండా ఎలా ఉంటారు?

సాంచి స్థూపం..

రైజెన్ జిల్లాలో ఉన్న ఈ ప్రసిద్ధ సాంచి స్థూపం భారతదేశంలోని పురాతన రాతి నిర్మాణాల్లో ఒకటి. ఇది ఇక్కడి బౌద్ధ సముదాయంలో ఒక భాగం. మౌర్యుల చక్రవర్తి అశోకుడు అప్పట్లో దీని నిర్మాణం చేపట్టారు. సాంచీ స్థూపం చారిత్రక చిహ్నమే కాకుండా బౌద్ధులకు ముఖ్యమైన ప్రదేశం కూడా. దీంతో ఇదో అరుదైన పర్యాటక ప్రదేశంగానూ నిలిచింది. (Photo Credit: Unsplash)
Also Read: Vande bharat Interesting Facts: వందేభారత్ రైళ్లకు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?


రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.