యాప్నగరం

తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీకి విమాన సేవలు

తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీ యాత్రలు చేయాలనుకునేవారికి ఇకపై విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Samayam Telugu 18 Jun 2017, 12:39 pm
తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీ యాత్రలు చేయాలనుకునేవారికి ఇకపై విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. షిరిడీ ప్రయాణానికి ప్రస్తుతం రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవి తగిన సంఖ్యలో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం షిరిడీకి నేరుగా విమాన సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా షిరిడీలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
Samayam Telugu flights to operate from shirdi by july
తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీకి విమాన సేవలు


ఇక్కడ నుంచి విమానాలు నడిపేందుకు ట్రూజెట్, ఇండిగో, అలియన్స్ ఎయిర్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే రోజుకు కనీసం 700 నుంచి 800 యాత్రికులు షిరిడీకి రాకపోకలు చేస్తారని అంచనా వేస్తున్నారు. తొలి దశలో విశాఖపట్నం, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, ముంబయిల నుంచి విమానాలు నడపనున్నారు. రూ.340 కోట్లతో నిర్మించిన షిరిడీ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జులైలో ప్రారంభించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.