యాప్నగరం

మలేసియా వెళ్లేవారికి ఉచితంగా ఇ-వీసా!

మలేసియా పర్యటకులకు శుభవార్త. ఇకపై ఆ దేశానికి వెళ్లాలని భావించేవారు వీసా కోసం అదనంగా నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా ‘ఇ-వీసా’ దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ఆ దేశం కలిపిస్తోంది.

TNN 1 May 2017, 11:58 am
లేసియా పర్యటకులకు శుభవార్త. ఇకపై ఆ దేశానికి వెళ్లాలని భావించేవారు వీసా కోసం అదనంగా నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా ‘ఇ-వీసా’ దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ఆ దేశం కలిపిస్తోంది. ఇది 15 రోజులు చెల్లుబాటు అవుతుంది. మలేసియాలో టూరిజానికి మరింత ఆధరణ కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu free e visa for indians travelling to malaysia
మలేసియా వెళ్లేవారికి ఉచితంగా ఇ-వీసా!


టీవల ఆ దేశ ప్రధాని నజీబ్ రజక్ ఇండియా పర్యటనలో భాగంగా ఈ విషయం వెల్లడించారు. ఏటా ఇండియా నుంచే అత్యధిక పర్యటకులు విచ్చేస్తున్నారని, వారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

రఖాస్తు చేసిన 48 గంటల్లోనే ఇ-వీసా లభిస్తుంది. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇ-వీసాతో మలేసియాలో 15 రోజులు పర్యటించవచ్చు. ఇదివరకు వీసా కోసం రూ.2,710 చెల్లించాల్సి వచ్చేది. అయితే, అది 30 రోజులు చెల్లుబాటయ్యేది. తక్కువ రోజుల్లో పర్యటన ముగించుకునేవారికి కొత్త విధానం ఉపయోగపడుతుంది. 2016లో సుమారు 5,40,530 మంది భారతీయులు మలేసియా పర్యటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.