యాప్నగరం

విమానం ఎక్కేందుకు.. వేలి ముద్ర చాలు!

విమానాశ్రయాల్లో చెక్-ఇన్ పాయింట్లలో గుర్తింపు కార్డులు.. తదితర ఆధారాలేవీ చూపించాల్సిన అవసరం లేకుండా సాఫీగా ప్రయాణించే రోజులు త్వరలోనే రానున్నాయి.

TNN 27 May 2017, 2:58 pm
విమానాశ్రయాల్లో చెక్-ఇన్ పాయింట్లలో గుర్తింపు కార్డులు.. తదితర ఆధారాలేవీ చూపించాల్సిన అవసరం లేకుండా సాఫీగా ప్రయాణించే రోజులు త్వరలోనే రానున్నాయి. వేలి ముద్ర లేదా ఐరిస్‌తో నేరుగా బోర్డింగ్ గేటుకు ప్రయాణించేందుకు అవసరమైన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల వివిధ విమానయాన సంస్థలతో జరిగిన సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది.
Samayam Telugu govt ready to install advanced biometric airport checks soon
విమానం ఎక్కేందుకు.. వేలి ముద్ర చాలు!


ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ‘డిజిటల్ బోర్డింగ్’ ప్రక్రియ గురించి వివరించిందని, ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిసింది. ఈ మేరకు వివిధ విమానయాన సంస్థలు, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ‘డిజిటల్ బోర్డింగ్’ విధానాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు బెంగళూరు వెళ్లినట్లు సమాచారం.

దీన్ని ప్రభుత్వం ఆమోదిస్తే.. వేలి ముద్ర లేదా ఐరిస్ (కళ్లు) ద్వారా ప్రయాణికులు సులభంగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. ఈ విధానం పూర్తిగా అమలు చేయడానికి ఏడాది సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఆధార్’ నమోదు దాదాపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ విధానం అమల్లో ఇబ్బందులు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.