యాప్నగరం

ఐజీఐ విమానాశ్రయం.. ఇక ఫుల్ గ్రీన్!

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయం ఇకపై కాలుష్యం కనుమరుగు కానుంది. రోజూ 65 మిలియన్ ప్రయాణికులతో కిటకిటలాడే ఈ విమానాశ్రయంలో స్వచ్ఛమైన గాలి కోసం.. సుమారు 35,000 ఇండోర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.

Samayam Telugu 4 Jun 2018, 6:02 pm
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయం ఇకపై కాలుష్యం కనుమరుగు కానుంది. రోజూ 65 మిలియన్ ప్రయాణికులతో కిటకిటలాడే ఈ విమానాశ్రయంలో స్వచ్ఛమైన గాలి కోసం.. సుమారు 35,000 ఇండోర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కాలుష్యాన్ని గ్రహించగల ‘ఎయిర్ ప్యూరిఫై’ రకానికి చెందిన మొక్కలు.
Samayam Telugu fba


విమానాశ్రయంలోని 3.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం గల ఐజీఐ విమానాశ్రయంలో ఏటా కొన్ని వేల మొక్కలను ఏర్పాటు చేస్తున్నామని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) వెల్లడించింది. స్నేక్ ప్లాంట్స్, స్పైడర్ ప్లాంట్స్, గోల్డెన్ పోత్స్, వీపింగ్ ఫిగ్, కస్సియా ఫిస్తులా, బామ్‌బూ పామ్ తదితర రకాల మొక్కలను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
విమానాశ్రయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు విమానాశ్రయం లోపల, వెలుపల కూడా ఇండోర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. దీనివల్ల విమానాశ్రయంలో చాలావరకు కాలుష్యాన్ని నియంత్రించగలిగామని తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయం ప్రపంచంలో నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 20వ స్థానంలో ఉంది. ఆసియాలో ఏడో స్థానంలో ఉంది.
Read this news in English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.