యాప్నగరం

రామాయణ రైలు.. అయోధ్య నుంచి కొలంబో టూర్!

భారత రైల్వే ‘శ్రీరామయణ’ పేరుతో ప్రత్యేక టూరిస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తేనుంది. రామాయణంలో ప్రస్తావించిన పుణ్యస్థలాలు మీదుగా ఈ రైలు ప్రయాణించనుంది.

Samayam Telugu 10 Jul 2018, 12:00 pm
భారత రైల్వే ‘శ్రీరామయణ యాత్ర - శ్రీలంక’ పేరుతో ప్రత్యేక టూరిస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తేనుంది. రామాయణంలో ప్రస్తావించిన పుణ్యస్థలాలు మీదుగా ఈ రైలు ప్రయాణించనుంది. ఢిల్లీలో నవంబరు 14 నుంచి ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రత్యేక రైల్లో 800 మంది ప్రయాణించవచ్చు. ఈ ప్యాకేజీ టికెట్ ధర రూ.15,120.
Samayam Telugu rail


శ్రీరాముడు దేశంలో సంచరించిన ప్రాంతాలకే గాక.. శ్రీలంకలోని కొలంబో వెళ్లేందుకు కూడా ఇందులో ఆప్షన్ ఉంది. అక్కడ శ్రీరాముడు.. రావణుడితో తలపడిన ప్రాంతం ఉంది. తమిళనాడులోని రామేశ్వరం సందర్శన తర్వాత చెన్నై నుంచి విమానంలో కొలంబోకు తీసుకెళ్తారు. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఉన్న అన్ని శ్రీరాముడి క్షేత్రాలను కలుపుతూ ఈ ప్రయాణం సాగుతుందని ఐఆర్‌సీటీసీ వర్గాలు తెలిపాయి.

అయోధ్యలోని హునుమాన్ గర్హీ, కనక్ భవన్ ఆలయం, రామ్‌కోట్, నందిగ్రమ్, సితామర్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్, శ్రీనగవెర్పూర్, చిత్రకోట్, నాసిక్, హంపీ, రామేశ్వరం మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. మొత్తం 16 రోజుల పాటు ఈ ప్రయాణం సాగుతుంది. అయితే, కొలంబో వెళ్లేందుకు అవసరమైన విమాన టికెట్ల ఛార్జీలను ప్రత్యేకంగా చెల్లించాలి. త్వరలోనే ఈ ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
Image source: YouTube

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.