అడవిలోని సహజమైన ప్రకృతి నడుమ టైగర్ను దగ్గరగా చూడడం అదో అద్భుతమైన అనుభవం. అలాంటి అనుభూతిని పొందడానికే పర్యాటకులు వన్యప్రాణుల అభయారణ్యానికి బయలుదేరుతుంటారు. ఇలాంటి వాటిలో రణతంభోర్ నేషనల్పార్క్, టైగర్ ప్రాజెక్ట్కు మంచి పేరుంది. రాజస్థాన్లోని సవై మధోపూర్ జిల్లాలో ఉంది రణతంభోర్. నాలుగు పర్వతాలు గుమిగూడిన ప్రాంతంలో ఈ నేషనల్ పార్కును ఏర్పాటు చేశారు. ఇక్కడ పెద్దపులులు, ఎలుగుబంట్లు, సాంబార్ చీతల్, నీల్గై ఇంకా చాలా వన్యప్రాణులు ఉన్నాయి. ఈ నేషనల్ పార్కు 275 చదరపు కిలోమీటర్ల కోర్, 392 చదరపు కిలోమీటర్ల బఫర్జోన్గా విభజించబడింది. ఈ పార్కులో జంగిల్ (అడవి) సఫారి పరంగా ఎనిమిది జోన్లుగా విభజించబడ్డాయి. దీనిని అనుకొని మాన్సింగ్, కైల్దేవి అనే మరో రెండు ఇతర నేషనల్ పార్కులు (అభయారణ్యాలు) ఉన్నాయి. వీటినే వర్త్మాలా, ఆరావళి పర్వతమాళా జంక్షన్ అని పిలుస్తారు. వీటికి దక్షిణాన చంబల్ నది పూర్తి శోభతో ప్రవహించడం కనులారా చూడవచ్చు.
ఇక రణతంభోర్ సఫారి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు బోర్ కొట్టదు. రణతంభోర్ టైగర్ రిజర్వ్లో 55 టైగర్లు ఉన్నాయి. వాటితోపాటు చిరుత, గీతల హైనాలు, సాంబార్ జింకలు, నల్లమచ్చల జింకలు, మనుబోతులు, సాధారణమైన లేదా హనుమాన్ లంగూర్, వానరం, నక్క, అడవి పిల్లి, ఎలుగు బంటి, భారతీయ అడవి ఎలుగుబంటి, కృష్ణజింక సాధారణ తాటి పునుగు లేదా ఈత పిల్లి, గబ్బిలాలు, ఎడారిపిల్లులు ఇలా అన్ని జంతువులు ఉన్నాయి. ఇక్కడి స్థానీయ పక్షులకు ఈ పార్కు స్వర్గంతో సమానం. ఈ పార్కులో 272 రకాల పక్షులు ఉన్నాయి. ఒకవేళ మీరు పక్షి ప్రేమికులయితే రణతమ్భోర్ దుర్గ్, యజమాని చెరువు, రాజ్ చెరువు, పదమ్ చెరువుకు కచ్ఛితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మీకు అరుదైన పక్షిజాతులు తారసపడతాయి.
సందర్శకులు ఓ విషయం గుర్తుపెట్టు కోవాలి. ఈ నేషనల్ పార్కు లోపలికి ప్రవేశించడానికి అటవీశాఖ అనుమతి తప్పని సరి. అడవిలోకి జీప్లో వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయబడి ఉంటాయి. అటవీశాఖ వారు సీజన్కు అనుగుణంగా ఈ పార్కులోకి సందర్శకుల ప్రవేశానికి అనుమతులు ఇస్తూ ఉంటారు. వర్షాకాలంలో మూసివేసి ఉంటుంది.
ఈ జర్నీలో ఏ బోనులో నుంచి ఏ జంతువు బయటికి వస్తుందో అని భయపడనవసరం లేదు. ఎందుకంటే, అనుభవజ్ఞులైన డ్రైవర్ నిరంతరం ఇతర డ్రైవర్లతో కాంటాక్ట్లో ఉంటాడు. టైగర్ మూమెంట్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు. సిబ్బంది డ్రైవర్తో ఫోన్లో మాట్లాడుతూ ఏ జంతువు ఏ ప్లేస్లో ఏం చేస్తుందో అనే సమాచారం ఇస్తారు. ఇక్కడి డ్రైవర్లు టైగర్లను వాటి పేర్లతో గుర్తుపడతారు.
ఈ పార్కుకు ఎదురుగానే రణతంభోర్ కోట కూడా ఉంది. ఈ కోట హమీర్ దేవ్ చౌహన్ వైభవానికి ప్రతీకగా చెప్పుకుంటారు. నవంబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రాంతం జర్నీ బాగుంటుంది. రణతమ్భోర్లో ఫైవ్స్టార్ హోటల్స్తో పాటు రిసార్ట్స్, కొన్ని సాధారణ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలో జరుపూర్, కోటా విమానాశ్రయాలు ఉన్నాయి.
ఇక రణతంభోర్ సఫారి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు బోర్ కొట్టదు. రణతంభోర్ టైగర్ రిజర్వ్లో 55 టైగర్లు ఉన్నాయి. వాటితోపాటు చిరుత, గీతల హైనాలు, సాంబార్ జింకలు, నల్లమచ్చల జింకలు, మనుబోతులు, సాధారణమైన లేదా హనుమాన్ లంగూర్, వానరం, నక్క, అడవి పిల్లి, ఎలుగు బంటి, భారతీయ అడవి ఎలుగుబంటి, కృష్ణజింక సాధారణ తాటి పునుగు లేదా ఈత పిల్లి, గబ్బిలాలు, ఎడారిపిల్లులు ఇలా అన్ని జంతువులు ఉన్నాయి. ఇక్కడి స్థానీయ పక్షులకు ఈ పార్కు స్వర్గంతో సమానం. ఈ పార్కులో 272 రకాల పక్షులు ఉన్నాయి. ఒకవేళ మీరు పక్షి ప్రేమికులయితే రణతమ్భోర్ దుర్గ్, యజమాని చెరువు, రాజ్ చెరువు, పదమ్ చెరువుకు కచ్ఛితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మీకు అరుదైన పక్షిజాతులు తారసపడతాయి.
సందర్శకులు ఓ విషయం గుర్తుపెట్టు కోవాలి. ఈ నేషనల్ పార్కు లోపలికి ప్రవేశించడానికి అటవీశాఖ అనుమతి తప్పని సరి. అడవిలోకి జీప్లో వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయబడి ఉంటాయి. అటవీశాఖ వారు సీజన్కు అనుగుణంగా ఈ పార్కులోకి సందర్శకుల ప్రవేశానికి అనుమతులు ఇస్తూ ఉంటారు. వర్షాకాలంలో మూసివేసి ఉంటుంది.
ఈ జర్నీలో ఏ బోనులో నుంచి ఏ జంతువు బయటికి వస్తుందో అని భయపడనవసరం లేదు. ఎందుకంటే, అనుభవజ్ఞులైన డ్రైవర్ నిరంతరం ఇతర డ్రైవర్లతో కాంటాక్ట్లో ఉంటాడు. టైగర్ మూమెంట్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు. సిబ్బంది డ్రైవర్తో ఫోన్లో మాట్లాడుతూ ఏ జంతువు ఏ ప్లేస్లో ఏం చేస్తుందో అనే సమాచారం ఇస్తారు. ఇక్కడి డ్రైవర్లు టైగర్లను వాటి పేర్లతో గుర్తుపడతారు.
ఈ పార్కుకు ఎదురుగానే రణతంభోర్ కోట కూడా ఉంది. ఈ కోట హమీర్ దేవ్ చౌహన్ వైభవానికి ప్రతీకగా చెప్పుకుంటారు. నవంబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రాంతం జర్నీ బాగుంటుంది. రణతమ్భోర్లో ఫైవ్స్టార్ హోటల్స్తో పాటు రిసార్ట్స్, కొన్ని సాధారణ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలో జరుపూర్, కోటా విమానాశ్రయాలు ఉన్నాయి.