యాప్నగరం

బాపూజీ జన్మస్థలానికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ

మహాత్మాగాంధీ జన్మస్థలమైన గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘కుష్‌బూ గుజరాత్ కి’ టూర్ పేరుతో ఈ సరికొత్త ప్యాకేజీ కింద ఏసీ త్రీటైర్ బోగీల్లో ప్రయాణించే సదుపాయం కూడా కల్పించనుంది.

Samayam Telugu 3 Aug 2018, 12:57 pm
హాత్మాగాంధీ జన్మస్థలమైన గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘కుష్‌బూ గుజరాత్ కి’ టూర్ పేరుతో ఈ సరికొత్త ప్యాకేజీ కింద ఏసీ త్రీటైర్ బోగీల్లో ప్రయాణించే సదుపాయం కూడా కల్పించనుంది. ఈ టూర్‌లో భాగంగా పోర్‌బందర్‌లోని గాంధీజీ సంగ్రహాలయమైన ‘కీర్తి మందిర్’కు తీసుకెళ్తారు.
Samayam Telugu 112


ఇక్కడ బాపూజీ ఉపయోగించిన వస్తువులతో పాటు.. ఆయనకు సంబంధించిన అరుదైన ఫొటోలను చూడవచ్చు. ఏడు రోజులు, ఆరు రాత్రుల ప్యాకేజీ కింద సోమ్‌నాథ్ ఆలయం, డయ్యు, ద్వారక, నాగేశ్వర్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. ప్రయాణం, వసతి ఛార్జీలు, భోజనం కలిపి ఒక్కరికి రూ.19,990 చెల్లించాలి.

సోమ్‌నాథ్, ద్వారకాలోని త్రిస్టార్ హోటళ్లలో వసతి కల్పిస్తారు. పర్యాటక ప్రాంతాలకు ఏసీ బస్సుల్లో తీసుకెళ్తారు. ఈ ప్యాకేజీ కింద ఇన్సురెన్స్ కూడా కల్పించనున్నారు. ఈ ప్యాకేజీ కింద ప్రయాణం చేయదలచిన పర్యాటకులు న్యూఢిల్లీ, కాంటోన్మెంట్, గుర్గావ్, రివారీ, అల్వార్, జైపర్, అజ్మీర్ జంక్షన్ల నుంచి కూడా ప్రయాణం చేయోచ్చు. ప్యాకేజీ బుక్ చేసుకునే ప్రయాణికులు సెప్టెంబర్ 16, మధ్యాహ్నం 1.25 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే ఉత్తరాంచల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.