యాప్నగరం

ఎవరెస్ట్ ఎక్కేవారిపై.. ఇక నేపాల్ నిఘా!

చాలామంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి... రికార్డు పుస్తకాల్లోకి ఎక్కుతున్నారు. అయితే, ఇటీవల ఓ జంట ఎవరెస్ట్ ఎక్కినట్లుగా నేపాల్ ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ పొందింది. అయితే, వాళ్లు ఎవరెస్టు ఎక్కినట్లుగా చూపించిన ఫొటో, ఆధారాలు ఫేక్ అని తేలడంతో నేపాల్ వారిపై పదేళ్ల నిషేదం విధించింది. ఈ నేపథ్యంలో...

TNN 20 Mar 2017, 6:13 pm
చాలామంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి... రికార్డు పుస్తకాల్లోకి ఎక్కుతున్నారు. అయితే, ఇటీవల ఓ జంట ఎవరెస్ట్ ఎక్కినట్లుగా నేపాల్ ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ పొందింది. అయితే, వాళ్లు ఎవరెస్టు ఎక్కినట్లుగా చూపించిన ఫొటో, ఆధారాలు ఫేక్ అని తేలడంతో నేపాల్ వారిపై పదేళ్ల నిషేదం విధించింది. ఈ నేపథ్యంలో... ఎవరెస్టు అధిరోహణకు వెళ్లవారికి ప్రత్యేక జీపీఎస్ పరికరాన్ని ఇవ్వాలని నేపాల్ ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది.
Samayam Telugu nepal to strap everest climbers with gps device
ఎవరెస్ట్ ఎక్కేవారిపై.. ఇక నేపాల్ నిఘా!


వరెస్ట్ అధిరోహణ... ఓ ప్రమాదకర సాహసం. కొందరు ఆక్సిజన్ అందక, మరి కొందరు దారి తప్పి, మంచు తుఫాన్లలో చిక్కుకుని మృత్యు ఒడికి చేరిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్టు అధిరోహణకు వెళ్లేవారికి జీపీఎస్ పరికరాలను ఇచ్చినట్లయితే... వారు ఏ మార్గంలో వెళ్తున్నారో తెలుసుకోవడం సులభతరం అవుతుందని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది.

వేసవి కాలం రాగానే.. వందలాది మంది ఎవరెస్టు అధిరోహణకు బయల్దేరతారు. ఈ నేపథ్యంలో అందరికీ జీపీఎస్ పరికరాలు అందివ్వాలని నిర్ణయించారు. ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే, వెంటనే సాయం అందించడం వీలవుతుందని నేపాల్ టూరిజం శాఖ ముఖ్యాధికారి దుర్గా దత్త దకల్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఎవరెస్టు అధిరోహణకు సంబంధించి మొత్తం డేటా అంతా రికార్డు అవుతుంది. దీనివల్ల మోసం చేయడానికి కూడా వీలుండదు. ఈ పరికరాల విలువ 300 డాలర్లు.

తేడాది పుణెకు చెందిన పోలీస్ దంపతులు దినేష్, తాకేశ్వరి రాథోడ్‌లు ఎవరెస్టు ఎక్కేందుకు వెళ్లారు. మే 23న తాము ఎవరెస్టు అదిరోహించామని చెబుతూ ఆధారాలిచ్చారు. వాటిని సరిగా పరిశీలించకుండా నేపాల్ అధికారులు.. వారికి ఎవరెస్టు అధిరోహించిన తొలి జంటగా సర్టిఫికెట్ ఇచ్చేశారు. అయితే, వారు ఎవరెస్ట్‌పై తీయించుకున్నట్లు సమర్పించిన ఫొటోలు అసలైనవి కావని క్లైంబర్ సత్యరూప్ సిద్దార్థ్ గుర్తించారు. వాళ్లు తన ఫొటోనే మార్ఫింగ్ చేశారంటూ ఆధారాలతో నేపాల్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారికి జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో జీపీఎస్ పరికరం.. ఎవరెస్టు అధిరోహించేవారికి దిశ నిర్దేశం, అత్యవసర సేవలు అందించడంతోపాటు నిజమైన ఎవరెస్టు అధిరోహులను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.