యాప్నగరం

శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్ చూశారా?

తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 353 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న శ్రీవేంకటేశ్వర నేషనల్ పార్క్ ఎన్నో వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తోంది.

Samayam Telugu 5 Sep 2018, 1:54 pm
చిత్తూరు జిల్లాలోని శ్రీ వేంకటేశ్వర జాతీయ వన్యప్రాణి సంరక్షణ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చని అటవీ ప్రాంతంలో అనేక వన్యప్రాణులు ఇక్కడ స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 353 చదరపు కిలోమీటర్లు ఇది విస్తరించి ఉంది.
Samayam Telugu Untitledaa


పులులు, హైనాలు, నక్కలు, చిరుతలు, పాంథర్‌లు, ఎలుగు బంట్లు, జింకలు, అడవి కుక్క, అడవి పిల్లి, ఎగిరే బల్లి ఇంకా ఎన్నో రకాల వన్యప్రాణులను ఇక్కడ చూడవచ్చు. ఈ అభయారణ్యంలో జలపాతాలు సైతం ఆకట్టుకుంటాయి. భారీ సంఖ్యలో విస్తరించిన ఎర్రచందనం, తుమ్మ, గంధపు చెట్లను సైతం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఎర్రచందనం చెట్ల సంరక్షణ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని అనుమతులపై నిబంధనలు కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. ఈ ప్రాంతానికి సఫారీ సదుపాయం లేకపోవడం ప్రతికూలాంశం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.