యాప్నగరం

Delhi Travel Alert: దిల్లీకి వెళ్తున్నారా.. అయితే, ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

తాజాగా దిల్లీలో (Delhi) ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో దట్టమైన పొగమంచు ఆవహించింది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు విమానాలు ఆలస్యమయ్యాయని తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లే ప్రయాణికులు తమ ఫ్లైట్‌లకు సంబంధించిన సమాచారం ముందే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 5 Jan 2023, 3:57 pm
Samayam Telugu Airplane-thumb
దేశ రాజధాని దిల్లీని చలిగాలులు పట్టి పీడిస్తున్నాయి. అక్కడ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యాయి. దీంతో దిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలు దట్టమైన పొగమంచును ఆవహించుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో దృశ్యమానత కూడా తక్కువగా ఉండటంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఉదయం ప్రయాణికులకు ఓ సూచన చేసింది. దిల్లీకి వచ్చే ప్రయాణికులు తాము ప్రయాణించే విమానాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయా విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది.

Also Read: Punjab Tour: అందమైన పంజాబ్ ఎప్పుడైనా సందర్శించారా.. లేకపోతే అక్కడ ఇవి చూడండి..!

దిల్లీ విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ ఉన్నా.. ప్రస్తుతం అన్ని విమాన కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అక్కడికి వచ్చే ప్రయాణికులు మాత్రం తమ ఫ్లైట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఆయా విమానయాన సంస్థల నుంచే పొందాలని పేర్కొంది. మరోవైపు ఈ ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా సుమారు 21 విమానాలు ఆలస్యమయ్యాయని తెలిసింది. అలాగే ఉత్తర భారత రైల్వేస్ కూడా ఈ రోజు దిల్లీకి వెళ్లే 12 రైళ్లు ఆలస్యంగా నడిచాయని పేర్కొంది. ఇంకా అనేక రైళ్లు రీషెడ్యూల్ అయ్యాయని తెలిపింది.

Also Read: Kolleru Lake: ఆంధ్రా వీకెండ్ స్పాట్ కొల్లేరు లేక్.. ఫోటోగ్రఫీ లవర్స్‌కు ఫేవరెట్ హాట్‌స్పాట్

భారత వాతావరణ శాఖ నివేదికల ప్రకారం రాబోయే మూడు-నాలుగు రోజులు వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు దట్టమైన పొగమంచును చూస్తాయని, చలి తీవ్రత కూడా పెరుగుతుందని తెలిసింది. ఆ తర్వాత క్రమంగా పరిస్థితుల్లో మార్పులు వస్తాయని పేర్కొంది. అలాగే జనవరిలో దిల్లీతో పాటు మధ్య భారతంలోని అనేక ప్రాంతాలు సాధారణం కన్నా తక్కువ కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సమాచారం. దీంతో రాబోయే మూడు-నాలుగు రోజుల్లో దిల్లీకి వెళ్లేవారు లేదా ఉత్తర భారత పర్యటనలకు వెళ్లేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా విమాన, రైళ్ల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవడం ఉత్తమం.

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.