యాప్నగరం

లాక్ డౌన్ లో ఈ ప్రదేశాల్లో మాత్రమే ట్రావెల్ పాస్... ఇలా అప్లై చేసుకొండి

లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ సమయంలో అవసరమైన పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లేందుకు వీలుగా ఢిల్లీ, గురుగ్రామ్ ప్రదేశాల్లో ట్రావెల్ పాస్ లను మంజూరు చేస్తున్నారు.

Samayam Telugu 1 Apr 2020, 11:11 am
కరోనావైరస్ ను ఎదుర్కోవడానికి భారత దేశం మొత్తం 2020 ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ లో ఉంది. ఈ ఘోరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇళ్ల వద్దే ఉండాలని, బయట తిరగవద్దని సూచించాయి. దీంతో ప్రజలు అందరూ తమ ఇళ్లకు మాత్రమే పరిమితం చేయబడ్డారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో రైల్వే లతో పాటు అంతరాష్ట్ర బస్సు రవాణాలను కూడా నిలిపివేశారు.
Samayam Telugu ట్రావెల్ పాస్


ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ చర్య వలన వలస కార్మికులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రతరంగా మారింది. ఫలితంగా ప్రజల్లో గందరగోళం, అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను ఏకరీతిలో అమలు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు కూడా తీసుకుంటున్నాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. పనులు లేక తిండి తినేందుకు డబ్బులు లేక చాలా మంది వలస కార్మికులు ఆకలితో బ్రతుకులను నెట్టుకొస్తున్నారు.

ప్రజలందర ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు జారీ కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో కూడా అన్ని రవాణా సేవలు మూతపడ్డాయి. ఢిల్లీ కర్ఫ్యూ సమయంలో చాలా మంది ప్రజలు ఇ-పాస్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని అవసరమైన సేవలను అందించే వారు కూడా ఢిల్లీలో ప్రయాణించడానికి ఇ-పాస్ పొందవచ్చు. అయితే దీన్ని ఎలా పొందాలో చాలా మందికి తెలియదు.

Read Also: ఇలా చేస్తే ఇంట్లో కూర్చునే మీరు ట్రావెల్ చేయవచ్చు

లాక్ డౌన్ సమయంలో ఇ-పాస్ తో పాటు అనేక విషయాలను సులభతరం చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం epass.jantasamvad.org అనే వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఇది కర్ఫ్యూ సమయంలో ప్రయాణానికి ఇ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఆహారం మరియు రేషన్ కోసం సహాయం కోరేందుకు కూడా ఉపయోగపడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇ-పాస్ లాక్ డౌన్ సమయంలో ప్రయాణించడానికి ఒకరికి సహాయపడుతుంది. ఇది కాకుండా రోజువారీ కూలీ కార్మికులకు ఆహారం, రేషన్, రూ. 5000ల పరిహారం మరియు పెన్షన్ మొత్తాన్ని పొందడానికి పోర్టల్ సహాయం చేస్తుంది. ఏదేమైనా ఇ-పాస్ పొందడానికి ఒక వ్యక్తి పైన చెప్పిన వెబ్ సైట్ ను మొదట సందర్శించాలి. అందులో ఇ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఏ పని మీద పాస్ అవసరం, ఐడీ ప్రూఫ్ వంటి కొన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

Read Also: కరోనావైరస్ నుండి సురక్షితంగా ఉన్న ఏకైక ప్రదేశం

అదే విధంగా గురుగ్రామ్ లో కూడా లాక్ డౌన్ సమయంలో ప్రయాణించడానికి వీలుగా పాస్ లు పొందేందుకు ggncurfewpass.in పోర్టల్ ను సందర్శించవచ్చు. అత్యవసరమైన మరియు ముఖ్యమైన సమయాల్లో మాత్రమే ఈ పాస్ లు ప్రజలకు ఇవ్వబడతాయని గురుగ్రామ్ డిసి ట్విటర్ ద్వారా తెలియజేసారు. ఈ లాక్ డౌన్ సమయంలో దరఖాస్తుదారుడి ప్రయాణం ఎంత అవసరమో తెలియజేయడంతో పాటు ఐడి ప్రూఫ్ కూడా సమర్పించాల్సి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.