యాప్నగరం

అవసరమైన పరిస్థితుల్లో ఈ పాస్ తో బయటకు వెళ్లొచ్చు

లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఏదైనా అవసరంపై బయటకు రావాల్సి వస్తే ఖచ్చితంగా ఈ పాస్ లు తీసుకోవాల్సిందే అంటున్నారు ఢిల్లీ పోలీసులు.

Samayam Telugu 30 Mar 2020, 4:00 pm
ప్రజలు ఇళ్ల నుండి బయటకు అడుగు పెట్టాలంటే ఇప్పుడు కాస్త భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఓ వైపు కరోనా అంటుకుంటుందనే భయం, మరో వైపు పోలీసులు పట్టుకుని తంతారనే భయం ప్రజలను వెంటాడుతుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీ ఈ పరిస్థితి కాస్త మెరుగైనట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే... 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ నేపధ్యంలో నగరం చుట్టూ అవసరమైన సేవలను అందించడానికి ఇళ్ల నుండి బయటకు అడుగు పెట్టే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అధికారులు మూమెంట్ పాస్ లను ప్రవేశ పెట్టారు. అసలు ఏమిటి ఈ మూమెంట్ పాస్ లు? వాటి ఉపయోగం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
Samayam Telugu మూమెంట్ పాస్


ఈ పాస్ లు వివిధ వస్తువులను, వాటి రవాణాను సజావుగా జరిగేందుకు అనుమతి ఇస్తాయి. అత్యవసర సేవలతో సంబంధం ఉన్న వారు సంబంధిత చెల్లుబాటు అయ్యే పత్రాలను చూపించాల్సి ఉంటుందని, వారికి పాస్ లతో అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.

వార్తా నివేదికల ప్రకారం... అత్యవసర సేవలతో సంబంధం ఉన్న ఎవరైనా ప్రభుత్వం రూపొందించిన జాబితాలో ఉన్నవారు లేదా అవసరమైన పరిస్థితుల్లో ఉన్న వారు ఢిల్లీ పోలీస్ అధికారిక వెబ్ సైట్ లో ఈ పాస్ ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ పంపిణీ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఫుడ్ అండ్ మెడిసిన్ డెలివరీ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, హెల్త్ కేర్ స్టాఫ్, వాటర్ డిపార్ట్ మెంట్, దుకాణా దారులు వంటి తదితర విభగాలకు చెందిన వారు వీటిని ఉపయోగించుకోవచ్చు.

Read Also: ప్రయాణించే రైళ్లు ఇప్పుడు ప్రాణాలను కూడా కాపాడనున్నాయి

ఈ పాస్ ను ఎలా పొందాలి?

ఇటువంటి పాస్ ను పొందడానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే ఐడీ, ఒక ఫోటో గ్రాఫ్, వారి సంస్థ నుండి ఒక సిఫార్సు లేఖను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పాస్ వ్యక్తి నగరం చుట్టూ తిరగడానికి అనుమతి ఇస్తుంది. నగరంలో మరియు చుట్టుపక్కల ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పోలీసులకు ఐడీతో పాటు ఆ పాస్ ను కూడా చూపించాల్సి ఉంటుంది. ఇది ప్రవేశ పెట్టిన 24 గంటల్లో 2920 మందికి పాస్ లు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా వీటికి సంబంధించి ఎవరికైనా ఫిర్యాదులు / సందేహాలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి 24x7 హెల్ప్ లైన్ 011-23469526 ను ప్రవేశ పెట్టారు.

Read Also: మనం ఇళ్లలో ఉండడం వలన వీటికి ఎంత స్వేచ్ఛ వచ్చిందో చూడండి

ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ " మేము ఇప్పుడు మా సిబ్బందికి పత్రాలను తనిఖీ చేయమని మరియు ప్రజలను తరలించడానికి అనుమతించమని వివరించాం. ఎవరైనా కుటుంబ సభ్యులను కలవవలసిన వారు లేదా ఇంటికి తిరిగి వెళ్లాలనుకునే వ్యక్తులు కూడా ఈ పాస్ లను తగిన కారణాలు చెప్పి పొందవచ్చు" అని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.