యాప్నగరం

Lockdown 4.0: ప్రయాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు ఇవే

కరోనా వైరస్ లాక్ డౌన్ 4.0లో భాగంగా ప్యాసింజర్ వాహనాలు, బస్సుల రవాణా అనుమతించేందుకు రాష్ట్రాలకు స్వేచ్ఛ లభించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గీకరించిన జోన్ల ప్రకారం సురక్షితమైన ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలు మొదలయ్యాయి.

Samayam Telugu 18 May 2020, 10:12 pm
భారత దేశంలో కరోనా వైరస్ లాక్ డౌన్ 3.0 ముగిసి లాక్ డౌన్ 4.0 మొదలయ్యింది. ఇది మే 18 నుండి మే 31 వరకు అమలులో ఉంటుంది. ఈ దశలో కొన్ని ఆంక్షలను సడలించే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు, అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న ప్రదేశాల్లో అమలు చేయాల్సి ఉంటుంది.
Samayam Telugu లాక్ డౌన్ లో ప్రయాణాలు


లాక్ డౌన్ 4.0లో మీరు తెలుసుకోవాల్సిన కొత్త ప్రయాణ నిబంధనలు:

- ప్యాసింజర్ వాహనాలు, బస్సుల యొక్క అంతర్రాష్ట్ర రవాణా అనుమతించబడుతుంది. కానీ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పరస్పర అంగీకారం దీనికి ఉండాలి.

- ప్యాసింజర్ వాహనాలు మరియు బస్సుల యొక్క అంతర్రాష్ట్ర రవాణా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.

- వైద్య మరియు భద్రతా ప్రయోజనాల కోసం హోం మంత్రిత్వ శాఖ అనుమతించిన విమానాలు మినహా అన్ని దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలు ఈ కాలంలో నిలిపివేయబడతాయి.

Read Also: లాక్ డౌన్ తరువాత కూడా ప్రయాణాలకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసారా?

- వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, నర్సులు అంతర్ మరియు అంతర్రాష్ట్ర కదలికలకు అనుమతించడతారు. అదే విధంగా అంబులెన్స్ లు, శానిటేషన్ కార్మికులను కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్లేందుకు అనుమతిస్తారు.

- అధికారిక ప్రకటన ప్రకారం... పొరుగు దేశాలతో ఒప్పందాల మేరకు క్రాస్ ల్యాండ్ సరిహద్దు వాణిజ్యం కోసం ఏ రకమైన సరుకు లేదా వస్తువుల రవాణాను రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఆపదు.

- ప్రస్తుత నిషేధింపబడిన కార్యకలాపాల జాబితాలో ఓలా మరియు ఉబెర్ క్యాబ్ సేవల గురించి ప్రస్తావించబడలేదు. ఇది ఆయా రాష్ట్రాలచే నిర్ణయించబడుతుంది. అక్కడి స్వంత ప్రజా రవాణా మార్గదర్శకాల మేరకు వీటి సేవలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు.

- దేశ వ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులు నిలిపివేయబడతాయి.

- క్రీడా సముదాయాలు మరియు స్టేడియంలు తెరవడానికి అనుమతించబడతాయి కానీ ప్రేక్షకులను మాత్రం అనుమతించరు.

Read Also: ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి టికెట్ ఇలా బుక్ చేసుకొండి

కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటూ సంబంధిత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎరుపు, నారింజ, ఆకుపచ్చ మండలాలను వర్గీకరిస్తాయి. ఏదేమైనా అవసరమైన కార్యకలాపాలను మినహాయించి వ్యక్తుల కదలిక రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల మధ్య ఇప్పటికీ నిషేధించబడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.