యాప్నగరం

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో మారుమూల పర్యాటక ప్రదేశాలకు హెలీపోర్టులు

హిమాచల్ ప్రదేశ్‌లో టూరిజం(Himachal Pradesh Tourism) కార్యకలాపాలను మరింత విస్త్రుతం చేసేందుకు అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఉత్తర భారత దేశంలో హిమాచల్ ప్రదేశ్ అంటేనే పర్యాటక స్థలాలకు ప్రసిద్ధి. ఆ ప్రాంతం మొత్తం కొండకోనలు, హిమాలయాలతో నిండి ఉండటంతో కొత్తగా కొన్ని ప్రాంతాల్లో హెలిపోర్టులను నిర్మించాలని తలపెట్టింది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 5 Sep 2022, 11:13 am
హిమాచల్ ప్రదేశ్ మొత్తం హిల్‌స్టేషన్ (Hill Station). చుట్టూ హిమాలయాలు, దట్టమైన అడవులు, కొండలు లోయలతో నిండి ఉండటంతో నిత్యం పర్యాటకుల్ని (Tourists) ఆకర్షిస్తుంది. దీంతో వేలాది మంది ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకుంటారు. అయితే, ఆ రాష్ట్రంలో ఎక్కడికివెళ్లాలన్నా రోడ్డు మార్గమే ప్రధానమైంది. ఇది కూడా ఎక్కువశాతం ఘాట్‌రూట్ రూపంలో ఉండటంతో ప్రమాదాలు జరిగే వీలుంటుంది. దీంతో చాలా మంది పర్యాటకులు మారుమూల ప్రాంతాల్లోని సందర్శనీయ స్థలాలను చూడటానికి వెనకాడతారు.
Samayam Telugu heliport
హెలీపోర్టు (Photo Credit: Unsplash)


అలాంటి పరిస్థితుల్ని అధిగమించేందుకు హిమాచల్ ప్రభుత్వం కొత్తగా పలు ప్రతిపాదిత స్థలాల్లో హెలీపోర్టులను నిర్మించాలని నిర్ణయించింది. దీంతో ఆయా ప్రాంతాలకు హెలీకాఫ్టర్ల సేవలు అందించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్ షిమ్లా జిల్లాలోని రామ్‌పూర్‌లో కొత్త హెలీపోర్టును ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో టూరిజం కార్యకలాపాల్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ హెలీపోర్టులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. దీంతో హిమాచల్‌లో ఎయిర్ కనెక్టివిటీని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

UDAN పథకం కింద తాజాగా షిమ్లా జిల్లాలోని సంజౌలి బైపాస్ రోడ్డుతో పాటు సోలన్ జిల్లాలోని బడ్డీ, రామ్‌పూర్‌లోనూ హెలీపోర్టులను నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇక్కడి నుండి త్వరలోనే హెలీకాఫ్టర్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరోవైపు మండి, మనాలీ ప్రాంతాల్లోనూ హెలీపోర్టులను నిర్మిస్తున్నట్లు సీఎం వివరించారు. అలాగే చంబా, రెకాంగ్ పియో ప్రాంతాల్లోనూ వీటిని నిర్మించేందుకు ప్రపోజల్స్ పంపామన్నారు. ప్రస్తుతం హిమాచల్ రాష్ట్రంలో 64 హెలీప్యాడ్లు ఉన్నాయని, ఇంకో 38 ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.